హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభకు భారీ ఏర్పాట్లు

Publish Date:May 10, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హై అలర్ట్‌లోకి వెళ్లింది. నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో  జరిగే భారీ ప్రజాసభకు లక్ష మందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేయడంతో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. సభ ప్రాంగణం చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేసి, నగరవ్యా ప్తంగా భారీగా పోలీసు బందోబస్తు మోహరించారు.

సుమారు 2,000 మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు విధుల్లో ఉండగా, వివిధ ప్రత్యేక బలగాలు, కమాండోలు, ర్యాపిడ్ యాక్షన్ టీంలు కూడా భద్రతలో భాగమయ్యాయి. ట్రాఫిక్ నియంత్రణ కోసం 550 మంది ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకంగా నియమించబ డ్డారు. మొత్తం భద్రతా వ్యవ స్థను ముగ్గురు డీసీపీలు, అయిదుగురు అదనపు డీసీపీలు పర్యవేక్షిస్తుండగా, 21 మంది ఏసీపీలు, 57 మంది ఇన్‌స్పెక్టర్లు మరియు పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొంటు న్నారు. సభ ప్రాంగణం చుట్టూ వందలాది సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తు న్నారు.

సభకు ముందు నుంచే బాంబ్ స్క్వాడ్లు, స్నిఫర్ డాగ్స్‌తో విస్తృత తనిఖీలు చేపట్టారు. OCTOPUS, SOT వంటి ప్రత్యేక బలగాలు ప్రాంగ ణాన్ని పూర్తిగా స్కాన్ చేసి అనుమానాస్పద వస్తువులు లేకుండా చర్యలు తీసుకు న్నాయి. సభకు వచ్చే ప్రతి వ్యక్తికి అన్ని ప్రవేశ ద్వారాల వద్ద కఠినమైన సెక్యూరిటీ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. సభ సమయంలో డ్రోన్లు, యూఏవీలు, కెమెరాలు, బ్యాగులు, బ్యానర్లు తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు. 

ముఖ్యంగా బేగంపేట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ల వినియోగంపై ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉన్నాయి. ప్రజాసభ కార ణంగా నగరంలోని పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ మార్పులు అమలు చేస్తు న్నట్టు పోలీసులు తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలు ప్రజా రవాణాను వినియో గించి ముందుగానే బయలు దేరాలని సూచించారు. మొత్తం మీద ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరం పూర్తి భద్రతా కవచంలోకి వెళ్లింది.

By
en-us Political News

  
బెంగళూరు నమ్మ మెట్రో ఫేజ్-3 డబుల్ డెక్కర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి లైన్ క్లియర్ అయింది. రూ.9700 కోట్ల అదనపు వ్యయంతో ఒకే పిల్లర్‌పై నిర్మించే ఫ్లైఓవర్, మెట్రో రూట్ మ్యాప్ మరియు 32 మీటర్ల ఎత్తైన స్టేషన్ వివరాలు ఇక్కడ చూడండి.
మమఎర్త్ మాతృసంస్థ హోనాసా కన్స్యూమర్ ఆర్థిక సంవత్సరం 2031 నాటికి రూ.5,500 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని ప్రకటించడంతో షేర్లు 6% పైగా పెరిగాయి. ఈ స్టాక్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఇచ్చిన తాజా రేటింగ్ మరియు పూర్తి వివరాలు మీకోసం.
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యంగ్ షట్లర్ తన్వీ శర్మ సంచలన విజయం సాధించింది. ఐదో సీడ్ చియు పిన్ చైన్ పై అద్భుత పోరాటంతో గెలిచింది. పీవీ సింధు, మాళవిక కూడా తదుపరి రౌండ్ కు దూసుకెళ్లారు. ఆ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అఫ్గానిస్థాన్-Aతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 22 బంతుల్లో 9 ఫోర్లతో 44 పరుగులు చేసి, 200 స్ట్రైక్ రేట్‌తో రెచ్చిపోయిన భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, నిర్లక్ష్యపు షాట్‌తో హాఫ్ సెంచరీని ఎలా చేజార్చుకున్నాడో పూర్తిగా చదవండి.
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే ముడి చమురు రవాణాలో హెర్మూజ్ జలసంధి అత్యంత కీలకం కావడంతో ఇరాన్ నిర్ణయం ప్రపంచదేశాలను షాక్ కు గురి చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని పలు తీర ప్రాంత లక్ష్యాలపై దాడులు ప్రారంభించిన గంటల వ్యవధిలోనే ఇరాన్ హెర్మూజ్ జలసంధి మూతను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. పెట్రోల్‌లో 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉండే సరికొత్త ఇంధన రకాలకు ఈ పన్ను మినహాయింపు లభించనుంది. దీని పరిధిలోకి ఈ22 , ఈ25 , ఈ27, ఈ30 రకాలు వస్తాయి. ఈ నిర్ణయం దేశీయ ఇంధన మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు వేదిక కానుందని పర్యవారణ, ఆర్థిక నిపుణులు అంటున్నారు.
నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సింగపూర్‌ దేశాల్లో బాలకృష్ణ అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ లభించాయి.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ కాంగ్రెస్ ఆరోపించింది.
సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో ఇప్పటికీ డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ వెరిఫికేషన్ అని వివరించారు.
ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది.
భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ, అప్రతిహత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించినందుకు మోదీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.