ఈ ఒత్తిడితో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టచ్చు!! 

Publish Date:May 4, 2023

Advertisement

మన శరీరంలో ఏ అయస్కాంత ప్రవాహమైతే ప్రవహిస్తుందో దాని స్విచ్ బోర్డు మన యొక్క రెండు అరచేతులలో, రెండు అరికాళ్లలో ఉంది. చిత్రంలో వేర్వేరు స్పర్శ బిందువులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూపబడ్డాయి. 1. మెదడు 2. మానసిక రోగం 3. పిట్యూటరీ 4. పీనియల్ 5. మస్తిష్క నర్క్స్ 6. గొంతు, కంఠము 8. థైరాయిడ్ 9. వెన్నుపూస 10. అర్ష్-మసా 11. ప్రోస్టేట్ 12. యోని మార్గము 13. జననేంద్రియము 14. గర్భాశయము 15. అండాశయము 16. నడుము, ప్రక్క ఎముకల క్రింది భాగం 17. తొడ 18. మూత్రాశయం 19. ప్రేగులు 20. గుదము 21. ఎపండిక్స్ 22. పిత్తాశయం 23. కాలేయం 24. భుజం 25. ప్యాంక్రియాస్ 26. కిడ్నీ 27. జఠరము 28. అడ్రిన్ 29. సూర్య కేంద్రం 30. ఊపిరి తిత్తులు  31. శక్తి కేంద్రము 33. నరము - చెవి 34. నరము - జలుబు 35. కన్ను 36. గుండె 37. కాలేయం 38. థాయమస్. 


ఒత్తిడి ఎలా కలిగించాలంటే…


ఇందులో అరచేతుల యొక్క, అరికాళ్ల యొక్క బిందువుల పైన వాటి సమీపంలో ఒత్తిడి కలిగింపబడుతుంది. ఇలా చెయ్యడం వల్ల బిందువుతో కలిసి ఉన్న అవయవాల వైపు అయస్కాంత ప్రవాహం జరుగుతుంది.


ఎలాగంటే - బ్రొటన వ్రేలియందున్న మస్తిష్క బిందువుపై ఒత్తిడి చేసినచో అయస్కాంత ప్రవాహము మస్తిష్కము వైపు ప్రవహిస్తుంది. అది మస్తిష్కమును అధిక క్రియాశీలము చేస్తుంది.


బ్రొటన వ్రేలితో గాని లేక చూపుడు వ్రేలితో గాని లేక మొనలేని పెన్సిల్తోగానీ బిందువులపై ఒత్తిడి చేయవచ్చు. ఏ బిందువుపై ఐనా 4-5 సెకండ్ల వరకు ఒత్తిడి కలిగించాలి. 1-2 సెకండ్ల ఒత్తిడిని కలిగించడం ఆపి తిరిగి ఒత్తిడి కలిగించాలి. ఇలా 1-2 ని॥ల వరకు పంపింగ్ చేసే విధంగా ఒత్తిడిని కలిగించాలి. తిరిగి భారముతో గూడిన మర్దనము చెయ్యాలి. బిందువుపై ఒత్తిడి భారము అనుభవంలోకి వచ్చేంత ఒత్తిడి మాత్రమే చెయ్యాలి. అధికంగా ఒత్తిడిని కలిగించకూడదు. సున్నితమైన చేతిపై తక్కువగా ఒత్తిడి కలిగించినా అది అనుభవంలోకి వస్తుంది. అంతఃస్రావి గ్రంధుల బిందువులు తప్పించి ప్రతి బిందువుపైనా అడ్డంగా ఉన్న బ్రొటనవ్రేలి ద్వారా భారము వేయుట వలన ఆవశ్యకమైన ఒత్తిడి పడగలదు. అంతఃస్రావి గ్రంధుల బిందువులపై అధిక ఒత్తిడి కలిగించడానికి నిలువు బ్రొటన వ్రేలిని పెన్సిలు లేక పెన్నును ఉపయోగించి చేయవచ్చు.


శరీరం యొక్క కుడిభాగమందలి అవయవాలందు బాధ కలిగినా లేక నొప్పి కలిగినా కుడి అరచేతి లేక కుడి అరికాలి బిందువులపై ఒత్తిడి చెయ్యాలి. ఇలాగే శరీరం యొక్క ఎడమ భాగములో బాధలకు తత్సబంధమైన ఎడమ అరచేతి లేక ఎడమ అరికాలు యొక్క ఒత్తిడి బిందువులపై ఒత్తిడి వేయాలి. శరీరం యొక్క వెనుక భాగము అంటే వెన్నెముక, జ్ఞాన తంతువులు, నడుము, సాయటికా నరము, తొడ మొ||వి వస్తాయి. వాటి కొరకు అర చేతి వెనుక భాగములో లేదా కాలిపై భాగములో ఒత్తిడి చేయవచ్చు. ఏ రోగానికైనా లేక అవయవ లోపానికైనా అరచేతి బిందువులపై రోజుకు మూడుసార్లు 1-2 ని॥ల వరకు ఒత్తిడి కలిగించవచ్చు. అరికాలి బిందువులపై ఒకేసారి 5ని॥ల వరకు ఒత్తిడి కలిగించవచ్చు. బిందువుల నొప్పి తగ్గనంత వరకు ఈ  చికిత్సను కొనసాగించవచ్చు. 

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.