ఓట్స్ అంటే ఔషధమే!

Publish Date:May 25, 2021

Advertisement

ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడంతో పాటుగా ఓట్స్ వాడకం కూడా పెరిగిపోయింది. ఇప్పుడు ఓట్స్‌ అంటే తెలియనివారు ఉండరు. నిజానికి ఓట్స్ మన దేశానికి చెందిన పంట కాదు. ఐరోపా, పశ్చిమాసియా దేశాలలో వేల సంవత్సరాలుగా దీనిని పండిస్తూ వచ్చారు. అయితే దీనిని ఎక్కువగా పశువుల దాణాగానే ఉపయోగించేవారు. గుర్రాలు వేగంగా పరుగులెత్తేందుకు కావల్సిన శక్తిని అందించే ఆహారంగా దీన్ని భావించేవారు. 19వ శతాబ్దం నాటికి నిదానంగా ఓట్స్‌ పోషక విలువలు అర్థం కాసాగాయి. ఓట్స్‌తో బ్రెడ్‌ల తయారీ మొదలైంది.

 

పోషకాలే పోషకాలు!:  ఓట్స్‌ ఏడాది పొడవునా పెరిగే పంట. ఎంతటి వర్షపాతాన్నయినా తట్టుకుని పండే సత్తా దీనికి ఉంది. ఇక ఓట్స్‌లో ఉండే పోషక విలువల గురించి చెప్పనే అక్కర్లేదు. విటమిన్లు అందునా ‘బి’ విటమిన్లలో ఉండే అన్ని విభాగాలూ (B1, B2, B3, B5, B6, B9) ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక కార్బోహైడ్రేట్స్‌, మాంసకృత్తులు, ఖనిజాల సంగతి అయితే చెప్పనవసరం లేదు. అందుకే హోమియోపతిలో సైతం దీనిని ‘అవీన సటీవా’ పేరుతో విస్తృతంగా వాడుతూ ఉంటారు. నిస్సత్తువ, నరాల బలహీనతా, గుండె జబ్బులు... వంటి అనేక సమస్యలలో అవీనా సటీవా అద్భుతంగా పనిచేస్తుంని హోమియోపతి వైద్యులు నమ్ముతారు.

 

కొవ్వుని కరిగిస్తుంది:  ఊబకాయం తగ్గాలంటే ఓట్స్‌ గొప్ప ఆహారం అని జనం భావించడం వెనుక శాస్త్రీయత లేకపోలేదు. చాలా తక్కువ పదార్థాలలో ఉండే beta-glucan అనే పీచు పదార్థం ఓట్స్‌లో కనిపిస్తుంది. ఈ beta-glucan చెడు కొవ్వుని కరిగించి, అది రక్తంలో పేరుకోకుండా చేస్తుంది. పైగా ఆహారం శుభ్రంగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. ఒక గుప్పెడు ఓట్స్‌ తీసుకున్నా కూడా అందులో ఉన్న beta-glucan అటు కొవ్వుని కరిగించేందుకు, ఇటు జీర్ణశక్తికి మెరుగుపరిచేందుకు సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. పైగా శరీరంలో క్రిముల వల్ల ఏర్పడే ఇన్షెక్షన్లను కూడా ఈ beta-glucan ఎదుర్కొంటుందని పరిశోధనలు తేల్చి చెబుతున్నాయి.

 

రక్తపోటుని నియంత్రిస్తుంది:  ఒక 40 గ్రాముల ఓట్స్‌లో రోజుకి సరిపడా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని నియంత్రిండానికీ, రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఉండటానికీ ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. దానివల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు! రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రించేందుకు, ఇన్సులిన్‌ ఉత్పత్తి సక్రమంగా ఉండేందుకు కూడా ఈ మెగ్నీషియం తోడ్పడుతుంది. అంటే తరచూ ఓట్స్‌ను తీసుకోవడం వల్ల చక్కెర వ్యాధి కూడా అదుపులో ఉంటుందన్నమాట.

 

ఇతర తృణధాన్యాలు తినలేనప్పుడు:  కొంతమందికి గోధుమలు, బార్లీ వంటి తృణధాన్యాలు సరిపడవు. ఇందులో ఉండే గ్లూటెన్ అనే మాంసకృత్తుల సముదాయం వల్ల వారిలో రకరకాల సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ పదార్థాలన్నింటికీ దూరంగా ఉండటం వల్ల, మనకి కావల్సిన పోషకాల నుంచి దూరమవుతాం కదా! చిత్రంగా ఓట్స్‌లో గ్లూటెన్ ఉన్నప్పటికీ, అది ఎలాంటి దుష్ప్రభావాలను కలిగించడం లేదని తేలింది.

 

ఇంతేకాదు... ఆస్తమా మొదలుకొని క్యాన్సర్‌ వరకూ ఓట్స్‌ ఎన్నోరకమైన అనారోగ్యాలు తలెత్తకుండా ఉండేందుకూ, శరీరంలో ఉన్న రుగ్మతల నుంచి స్వస్థత పొందేందుకూ ఒక ఔషధిలాగా పనిచేస్తుందని తరచూ ఏదో ఒక పరిశోధన రుజువు చేస్తోంది. మరెందుకాలస్యం. మన రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను కూడా చేర్చేసుకుంటే సరి!

 

- నిర్జర

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.