ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన రికార్డు వెనుక నిజాలు
Publish Date:Jun 13, 2026
Advertisement
తెలుగువన్ ప్రత్యేకం
భారతదేశ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం పాటు సేవలందించిన నేతగా సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నారు. కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ అరుదైన మైలురాయి ఆవిష్కృతమైంది. దేశంలో అత్యంత సుస్థిరమైన పరిపాలనను అందించడంలో ఈ కాలపరిమితి ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.
సహజంగా దేశ చరిత్రలో జవహర్లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు. ప్రస్తుత ప్రధాని మోదీని అత్యంత సుదీర్ఘకాలం నిరంతరాయంగా పాలించిన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా అభివర్ణించడానికి అదే కారణమన్నారు. కారణం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో 1947 నుండి దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగే 1952 వరకు నెహ్రూ తాత్కాలిక ప్రధానిగా వ్యవహరించారు. అలాగే ఇందిరా గాంధీ పరిపాలన కాలం మధ్యలో విరామం వచ్చింది. ఈ నేపథ్యంలో వరుసగా మూడు సార్లు ఎన్నికల్లో విజయం సాధించి, నిరంతరాయంగా 4399 రోజులకు పైగా అధికారంలో కొనసాగుతున్న ఏకైక ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.
ఇక మోడీ పుష్కర కాల పాలనలో మౌలిక వసతుల కల్పన, ఆర్థిక సంస్కరణల పరంగా దేశం ఎంతో ప్రగతిని సాధించిందనీ.. ముఖ్యంగా దేశంలో బహుమితీయ పేదరికం (మల్టీ డైమెన్షనల్ పావర్టీ) గతంలో ఉన్న 27 శాతం నుండి ప్రస్తుతం 13 శాతానికి తగ్గుముఖం పట్టిందనీ అన్నారు.
అయితే అదే సమయంలో సంపద పంపిణీలో సమానత్వం లేకపోవడం, కొన్ని రంగాలలో ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోవడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. కొన్ని కీలకమైన విధానపరమైన నిర్ణయాలు మరింత ముందే తీసుకోవాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడు ఇటువంటి హెచ్చుతగ్గులు సహజమైనప్పటికీ, ప్రస్తుత దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీ అంతటి శక్తివంతమైన నాయకుడు మరే ఇతర పార్టీలోనూ లేరనేది విశ్లేషించారు. మోడీ హయాంలో రాజకీయ సుస్థిరత, ప్రజా సంక్షేమం, దేశ ఆర్థిక వృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు.
ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఈ తెలుగువన్ న్యూస్ చానల్ లో వీక్షించండి
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.