Publish Date:Sep 12, 2022
ఎదురు వస్తున్న పిల్లల్ని పక్కకి నెడుతూ ఓ టెన్త్ క్లాస్ పిల్ల ఖంగా రుగా మళ్లీ స్కూ ల్లోకి పరిగెట్టింది. పిల్లలు చూసి వెక్కిరిస్తూ ఆనం దించారు. ఆమె పుస్తకం ఒకటి క్లాస్లో మర్చి పోయింది. ఓ కుర్రాడు బస్సు వెంట పరిగెడు తుంటే రోడ్డుమీద వెళ్లేవారు తిట్టారు పడిఛస్తావని. అతనికి నవ్వొచ్చింది..లవ్లెటర్ ఇంకా చేతిలోనే ఉంది, లవర్ ముందెళ్లే బస్సులో ఉందని! బెంగుళూ రులో ఆ మధ్య ఓ మద్య వయసాయన ట్రాఫిక్ లో వాహనాలు నిలవగానే అమాంతం కారు దిగి పరిగెట్టుకుంటూ వెళుతూంటే అంతా ఆశ్చర్యంతో చూస్తుండి పోయారు. కారు వదిలి వెళ్లేంత తొందరపనేమిటా అని. తీరా చూస్తే ఆయన ఓ డాక్టర్! ఒక రోగి ప్రాణాలు కాపా డేందుకు ఆ డాక్టర్ ఏకంగా మూడుకిలోమీటర్లు పరిగెట్టాడు. ఒలింపిక్స్ వెళ్లాల్సినాయన ఆస్పత్రికి పరిగెట్టాడను కున్నారు కుర్ర కారు!
బెంగుళూరు సర్జాపూర్లోని మణిపాల్ ఆస్పత్రిలో గ్యాస్ట్రోఎంటరాలజీ సర్జన్ డాక్టర్ గోవింద్ నందగోపాల్. ఆయన మొన్నామధ్య ఆస్పత్రిలో ఒక రోగికి ఆపరేషన్ చేయాలని బయలుదేరారు. మరి మూడు కిలోమీటర్ల దూరంలోఆస్ప్రతి ఉందనగా ఆయన కారు ట్రాఫిక్లో చిక్కడింది. ట్రాఫిక్ పరిస్థితి చూస్తే అందులోంచి ఆయన అంత త్వరగా బయటపడే అవకాశం లేదని డాక్టర్ గ్రహించారు. అందుకే వెంటనే కారులోంచి బయటికి వచ్చి ఆస్పత్రికి పరిగెట్టడం మొదలెట్టారు. ఆయన్ను చూసి ఏదో అయింద నుకున్నారంతా. కానీ ఆయన వృత్తి ధర్మం ఆయన్ను పరిగెట్టించింది. కారుని డ్రైవర్కి అప్పగించి బయలుదేరారు. మరి కొద్ది సేపట్లో ఆపరేషన్ చేయకుంటే అక్కడి పేషంట్కి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. అందుకే సమయం వృద్ధాచేయకుండా మూడు కిలోమీటర్లు పరిగెత్తి ఆస్పత్రి చేరుకున్నారు. డాక్టర్ వస్తున్నారని తెలిసి అస్పత్రి సిబ్బంది మరో డాక్టర్ ఆ పేషంట్కి ఆపరేషన్ థియేటర్ ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. డాక్టర్ గోవింద్ ట్రాఫిక్, జనాలను పట్టించుకోకుండా వీలయినంత వేగంగా పరి గెట్టి ఆస్పత్రికి సమయానికి చేరుకున్నారు. అంతేకాదు ఆపరేషన్ విజయవంతంగా ముగించారు.
ఆమధ్య బెంగుళూరులో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ నీటి మయం అయ్యాయి. విపరీత ట్రాఫిక్ జామ్తో ప్రజలు నానా అవస్థ పడ్డారు. సరిగ్గా ఆ సమయంలోనే ఇది జరిగింది. ఆ డాక్టర్ పరిగెడుతూ వెళ్లడాన్ని వీడియో తీసేరు కొందరు. చాలామంది ఆయన్ను ఎంతో మెచ్చుకున్నారు. అసలు అంత వేగంగా ఎలా వెళ్లగలిగారు అని అడిగారు. అందుకు డాక్టర్ సమాధానం చెబుతూ తనకు జాగింగ్ బాగా అలవాటు ఉండంతో మూడు కిలోమీటర్ల దూరం సునాయాసంగా పరిగెత్తగలిగానన్నారు. ఆయన ఆ సమయంలో తీసుకున్న నిర్ణయం, పరిగెట్టి వెళ్లడంకంటే ఆయన అవతల పేషెంట్ గురించి ఎంతో ఆలోచించడమే గొప్ప విషయం. హాట్సాఫ్ డాక్టర్!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/hats-off-25-143631.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.