ఇరాన్‌తో యుద్దం ముగిసిందా? .. సెనెట్‌ను వైట్‌హౌస్ మభ్యపెడుతోందా?

Publish Date:May 2, 2026

Advertisement

ఇరాన్‌తో యుద్దం ముగిసిందని వైెట్ హౌస్ ప్రకటించింది. దాంతో ఇరాన్‌తో యుద్దానికి యూఎస్ కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేకుండా ట్రంప్ సర్కారు జాగ్రత్త పడింది. ఇప్పటికే సెనెట్లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు.  ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో, అమెరికాకు సంబంధించిన ఒక కీలక చట్టం గురించి చర్చ మొదలైంది. అదే 1973 నాటి వార్ పవర్ చట్టం . ఈ చట్టం ప్రకారం, కాంగ్రెస్ అనుమతి లేకుండా అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం వాస్తవంగా ఎంతవరకు అమలవుతోంది అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

వియత్నాం యుద్ధం తర్వాత అమెరికాలో ఏర్పడిన అసంతృప్తి కారణంగా 1973లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పట్లో అధ్యక్షుడు కాంగ్రెస్‌ను పక్కనబెట్టి ఏక పక్షంగా యుద్ధాన్ని కొనసాగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తింది. అందుకే భవిష్యత్తులో అలాంటి పరిస్థితులు రాకుండా నియంత్రణలు అవసరమని భావించి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. యుద్ధంపై తుది నిర్ణయం ఒక్క అధ్యక్షుడి చేతిలోనే కాకుండా, ప్రజల ప్రతినిధులైన కాంగ్రెస్ చేతుల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం ప్రకారం అమెరికా అధ్యక్షుడు సైనిక చర్యలు ప్రారంభించిన 48 గంటల్లో కాంగ్రెస్‌కు సమాచారం ఇవ్వాలి. 

కాంగ్రెస్ అనుమతి లేకుండా గరిష్ఠంగా 60 రోజుల వరకు మాత్రమే యుద్ధాన్ని కొనసాగించవచ్చు. ఆ తర్వాత సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి మరో 30 రోజుల గడువు తీసుకోవచ్చు. అంటే మొత్తం మీద 90 రోజుల్లో యుద్ధాన్ని ముగించాలి లేదా కాంగ్రెస్ నుంచి అధికారిక అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికా యుద్ధం ప్రారంభమై 60 రోజులు దాటింది. ఈ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి లేదు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం యుద్దం ముగిసినట్లు కీలక వాదనను ముందుకు తెచ్చింది. ఆ క్రమంలో ఇరాన్‌తో యుద్దం నిజంగా ముగిసిందా? ..  అనుమతి తీసుకోవడం ఇష్టం లేక సెనెట్‌ను వైట్‌హౌస్ మభ్యపెడుతోందా? అన్న చర్చ మొదలైంది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
ఇటీవల హైదరాబాద్‌ నగరంలో సంచలనం సృష్టించిన రిచ్ కిడ్ కేసు మరువకముందే..అలాంటి తరహాలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
కూకట్‌పల్లిలో టిప్పర్ ఢీకొని యువకుల దుర్మరణం..!
రాజకీయ ప్రవేశంపై కాక్రోచ్ జనతా పార్టీ క్లారిటీ..!
నల్గొండ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు వద్ద ఆదివారం తెల్లవారుజామున తీవ్ర అగ్నిప్రమాదం సంభవించింది.
ధరణి పోర్టల్‌లో చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలు, సాంకేతిక లోపాలు, ప్రభుత్వానికి జరిగిన రెవెన్యూ నష్టంపై సమగ్ర విచారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
జింబాబ్వే పర్యటనలో భారత క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన భారత కేంద్రమంత్రుల చరిత్ర..!
దేశరాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి.
2024 సాధారణ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం గణనీయంగా మారిపోయింది.
ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని...ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు
దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన పెద్ద ఎత్తున సాగిన నిరసన ఘట్టం ఎట్టకేలకు ఒక సంచలనాత్మక ముగింపునకు వచ్చింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.