Publish Date:Jan 17, 2025
లొట్టపీసు కేసు, లైడిటెక్టర్ టెస్ట్ కు సిద్ధం, ఏసీబీ, ఈడీలు ఈ కేసులో నన్నేం పీకలేవు అంటూ పైకి గంభీరంగా చెబుతున్నప్పటికీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ ఫార్ములా రేస్ కేసులో బాగానే ఇరుక్కున్నారు. ఈ కేసులో ఆయన ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశాలున్నాయన్నది కేవలం పరిశీలకుల విశ్లేషణ మాత్రమే కాదు.. స్వయంగా కేటీఆర్ కూడా అదే భావిస్తున్నారు. తనపై ఏసీబీ నమోదు చేసిన ఈ ఫార్ములా కేసును క్వాష్ చేయాలని ఆయన సుప్రీం కోర్టు వరకూ వెళ్లినా ఫలితం లేకపోయింది. ఆయనకు ఇసుమంతైనా ఊరట లభించలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు నుంచి తప్పించుకోవడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నారు.
ఆయనే కాదు.. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఇదే పనిలో ఉన్నారు. ఆయన ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ ను ఏసీబీ, ఈడీలు వరుస విచారణలతో ఉక్కిరిబిక్కిరి చేసి అంతిమంగా అరెస్టు చేస్తారన్న అనుమానంతోనే హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు. అయితే పైకి మాత్రం బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించి, కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టులో పార్టీ తరఫున పిటిషన్ దాఖలుకు వెళ్లానని చెబుతున్నారు. ఆ పిటిషన్ల కోసమైతే షరీష్ రావు స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేదు. పార్టీ తరఫున న్యాయవాదులు వెడితే సరిపోతుంది. కానీ ఆయన గురువారం (జనవరి 16) హస్తినలో న్యాయనిపుణులతో చర్చిస్తూ బిజీబిజీగా గడిపారు.
అదే సమయంలో ఇక్కడ హైదరాబాద్ లో మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఈడీ విచారిస్తోంది. దాదాపు ఏడు గంటలకు పైగా కేటీఆర్ ను విచారించిన ఈడీ, అవసరమైతే మరోసారి పిలుస్తామంటూ విచారణ ముగించి పంపించింది. ఒక వైపు కేటీఆర్ ను విచారిస్తూనే ఏస్ నెక్ట్స్ జెన్ అనే కంపెనీకి నోటీసులు జారీ చేసింది. ఈ కంపెనీ ఫార్ములా ఈ రేసు కు మొదటి సీజన్ కు స్పాన్సర్ గా వ్యవహరించి ఆ తరువాత వైదొలగింది.ఆ కంపెనీ వైదొలగడం వల్లనే అందుకే ప్రభుత్వం స్పాన్సర్ షిప్ సొమ్ము చెల్లించాల్సి వచ్చిందని కేటీఆర్ చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ2, ఏ3 అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను విచారించిన ఈడీ వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్ ను ప్రశ్నిస్తుండటమే కాకుండా, గ్రీన్ కో అనుబంధ ఏస్ నెక్స్ట జెన్ లావాదేవీలపై కూడా ఆరా తీస్తోంది. ఇప్పటికే ఏ2, ఏ3లు తమ వాంగ్మూలాలలో మొత్తం వ్యవహారాలన్నీ కేటీఆర్ కనుసన్నల్లోనే జరిగాయని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ అరెస్టు అనివార్యం అన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ లో కూడా అదే ఆందోళన వ్యక్తం అవుతోంది.
దీంతో అరెస్టు నుంచి కేటీఆర్ బయట పడేందుకు ఉన్న మార్గాలపై న్యాయనిపుణులతో చర్చించేందుకే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ సుప్రీంలో పిటిషన్ సాకుతో హరీష్ రావు హస్తిన వెళ్లారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పొలిటికల్ సర్కిల్స్ లో కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harishrao-in-delhi-for-ktr-39-191390.html
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ఏటీఎఫ్)లో కూడా ఇథనాల్ను మిశ్రమం చేయడానికి సన్నాహాలు చేస్తోందంటూ ఆయన బాంబు పేల్చారు.
రాహుల్ గాంధీ నీట్ లీకేజీ వ్యవహారం కేవలం కేంద్ర విద్యాశాఖ వైఫల్యం మాత్రమే కాదంటున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాటానికి లభించిన తొలి విజయమేనంటూ, ఢిల్లీలో గత నెల 20న శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీఛార్జ్, పెల్లెట్ తుపాకుల వినియోగానికి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
గత కొన్ని నెలలుగా ఇరాన్, ఒమన్ మధ్య ఉన్నత స్థాయి సంప్రదింపుల ఫలితంగా కొత్త రూట్ ప్రతిపాదనపై ఓ ఒప్పందం కుదిరింది. సాంకేతిక, చట్ట, భద్రతా కోణాల్లో సమగ్ర సమీక్షలు జరిపిన అనంతరం, ఈ కొత్త రూట్ కు సంబంధించి ఇరు దేశాలు ఓ అవగాహనకు వచ్చాయి.
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.