Publish Date:Dec 28, 2019
సంగారెడ్డి జిల్లా కంది జెడ్పీ హైస్కూల్ లో మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన ఏర్పాట్లు పరిశీలించి... పదో తరగతి స్టూడెంట్స్ తో ముచ్చటించారు. ఆర్ధికమంత్రి కాస్తా... మ్యాథ్స్, సోషల్, సైన్స్ టీచర్ గా మారి.... విభిన్న ప్రశ్నలతో విద్యార్ధుల సామర్ధ్యాన్ని పరీక్షించారు. టెన్త్ విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగారు. ఎక్కాలు చెప్పాలన్నారు... కాలాల గురించి అడిగారు... సంవత్సరంలో ఎన్ని రోజులో చెప్పాలన్నారు.... బోర్డుపై రాసి చూపించాలంటూ పలు రకాలుగా ప్రశించారు.
అయితే, హరీష్ రావు ప్రశ్నలకు విద్యార్ధులు తెల్లముఖం వేశారు. హరీష్ ప్రశ్నలకు స్టూడెంట్స్ నీళ్లు నమిలారు. కనీసం పదో ఎక్కం కూడా చెప్పలేకపోవడంతో హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సంవత్సరానికి ఎన్ని రోజులో చెప్పలేకపోతే ఎలాగంటూ మండిపడ్డారు. పదో ఎక్కం కూడా చెప్పకపోతే పదో తరగతి ఎలా పాసవుతారంటూ మందలించారు. ఏం పాఠాలు చెబుతున్నారంటూ టీచర్లపై సీరియస్ అయ్యారు. విద్యార్ధులు వెనుకబాటుపై ఉపాధ్యాయులకు క్లాస్ తీసుకున్నారు. మరో రెండు మూడు నెలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉన్నందున ఇప్పుడైనా స్టూడెంట్స్ ను సంసిద్ధం చేయాలని సూచించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harish-rao-visits-govt-school-and-disappoints-over-students-knowledge-25-92664.html
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్ల సౌండ్తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
కరోనా టీకా కోవీషీల్డ్ వ్యవహారం ఎలా వుందంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా వుంది.
మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ శృంగార లీలలు, సెక్స్ స్కాండల్ కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి, వాటి ఆధారంగా వారిని బెదిరించి ప్రజ్వల్ రేవణ్ణ లొంగదీసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి
బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన స్టేషన్ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు నిన్న విచారించింది.
పెన్షన్లను సకాలంలో అందించాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పెన్షన్లను అందించాలని ఆదేశించింది. పెన్షన్ల పంపిణీకి సచివాలయ ఉద్యోగులను వాడుకోవాలని తెలిపింది.
బాధితుల్ని కాపాడాల్సిన పోలీసులే అల్లరి మూకలకు అప్పగిస్తే ఫలితం ఎలా వుంటుందో మణిపూర్ మహిళల అత్యాచార సంఘటన అద్దం పడుతుంది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జి షీటులో సీబీఐ కొందరు పోలీసుల పేర్లను చేర్చింది. బాధిత మహిళలను పోలీసులే స్వయంగా నిందితుల ముందు వదిలిపెట్టారని సీబీఐ పేర్కొంది. గతేడాది మే 4న కుకీ, మెయితీల మధ్య జరిగిన గొడవల్లో ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్లోని అంశాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.