టార్గెట్ పొంగులేటి.. హ‌రీష్ అస‌లు స్కెచ్ అదేనా?

Publish Date:Apr 6, 2026

Advertisement

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హ‌రీష్ రావు మంత్రి పొంగులేటిని ఎందుకు టార్గెట్ చేశారు. ఇటీవల అసెంబ్లీలో రాఘ‌వా క‌న్ స్ట్ర‌క్ష‌న్స్ వ్య‌వ‌హారం.. తాజాగా నాద‌ర్ గుల్ లో 7 వేల కోట్ల భూ కుంభ‌కోణం అంటూ గుప్పిస్తున్న ఆరోపణలు.   ఇంత‌కీ ఈ కొత్త కుంభ‌కోణం వివ‌రాలేంటి?  అని చూస్తే..
హ‌రీష్ ఏం  చేసినా ఒక ప‌క్కా  స్కెచ్ ప్ర‌కార‌మే చేస్తారు. ఎందుకంటే  ఆయ‌న మైండ్ సెట్ అలాంటిది. మందుల సామెల్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్న‌ట్టు.. ఒక ప‌క్క కేటీఆర్ ని క్రాస్ చేసి పార్టీ ఆక్ర‌మ‌ణ ఎలా  చేద్దామ‌ని ఎలా  ట్రై చేస్తున్నారో.. ఇప్పుడు ప్ర‌త్య‌ర్ధి పార్టీల‌ని కూడా అలాగే ల‌క్ష్యంగా చేసుకున్నారన్న చర్చ రాజకీయవర్గాలలో సాగుతోంది. 

 పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో..  ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి  వినిపించిన సంగ‌తి  తెలిసిందే.  వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే.  ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.

సీఎం రేవంత్ ప్ర‌క‌ట‌న‌  బ‌ట్టి  చూస్తే ఇదేదో త‌న‌కు, త‌న కుటుంబానికి గ‌ట్టిగానే త‌గిలేలా ఉంద‌ని భావించిన హ‌రీష్.  పొంగులేటి చుట్టూ ఉన్న వ్య‌వ‌హారాల‌పై  దృష్టిసారించిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకే ఆయ‌న నాద‌ర్ గుల్ కుంభ‌కోణాన్ని తెర‌పైకి తెచ్చిన‌ట్టు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా, సరోర్‌నగర్ మండలం, నాదర్‌గుల్ పరిధిలోని సర్వే నంబర్ 613 లో  373 ఎకరాల ప్రభుత్వ భూమి.  సుమారు 7 వేల‌ కోట్ల రూపాయల విలువైన ఈ ప్రభుత్వ భూమిని మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలు..  కోహినూర్ గ్రూప్, శిల్పా ఇన్ఫ్రా వంటివి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు హరీష్ రావు.

గతంలో వైఎస్సార్ హయాంలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించి టీజీఐఐసీకి అప్పగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఇది 22A నిషేధిత జాబితాలో ఉండేదీ భూమి. అయితే, ఇప్పుడు అధికార బలాన్ని ఉపయోగించి.. రైతులను భయపెట్టి, ఫెన్సింగ్ వేసి ఈ భూమిని కబ్జా చేస్తున్నారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు.   600 మంది పేద రైతులు ఈ భూమి వల్ల నష్టపోతున్నారని అంటున్నారు హ‌రీష్‌.

బేసిగ్గా ఏదైనా గీత‌ను చిన్న‌గీత‌గా చూపించాలంటే, దాని ప‌క్క‌నే పెద్ద గీత గీస్తే సరిపోతుందంటారు. హరీష్ సరిగ్గా అదే ఫార్ములా ఉపయోగిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  త‌మ హ‌యాంలో జ‌రిగిన మైనింగ్ అక్ర‌మాల ముందు పోలిస్తే ఇవి చాలా చాలా పెద్ద‌వి  కాబ‌ట్టి.. ఇవేవీ సీఎంకి క‌నిపించ‌వా?  హైడ్రాకు క‌నిపించ‌వా? అంటూ ఆరోపిస్తున్నారు. 

కాగా హ‌రీష్ ఆరోప‌ణ‌ల‌కు కాంగ్రెస్ కౌంట‌ర్ ఇస్తోంది.  హ‌రీష్ రావు ఆరోపణలన్నీ రాజ‌కీయ ప్రేరేపితాలే అంటోంది.  బీఆర్ఎస్ హ‌యాంలోనే ఈ స్థ‌లంలో కోహినూర్ కంపెనీ రేకుల షెడ్డు వేసింద‌ని  కాంగ్రెస్ చెబుతోంది. జ‌రిగిన  త‌ప్పంతా వారి హ‌యాంలో జ‌ర‌గ్గా వాటిని పట్టుకుని ఇప్పుడు కాంగ్రెరస్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శిస్తున్నది. 

ఇక రాఘవ కన్‌స్ట్రక్షన్స్ వివాదం విషయానికి వస్తే..  మార్చి చివరి వారంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావు ఈ అంశాన్ని లేవనెత్తారు మంత్రి పొంగులేటికి చెందినదిగా చెప్పబడే రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ, ఎలాంటి అనుమతులు లేకుండా స్టోన్ క్రషింగ్, మైనింగ్ చేస్తోందన్నది ఆయన ఆరోపణ.   ముఖ్యంగా జీవో 111 పరిధిలో   నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ, ఇప్పటికే ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చి 2.74 కోట్ల రూపాయల జరిమానా   వసూలు చేశామని వెల్లడించింది. అయితే పొంగులేటి పేరును రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ ఆదేశించడం గొడవకు దారితీసింది. 

ఇంతకీ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని హరీష్ టార్గెట్ చేయడానికి కారణం.. ఆయన ప్రస్తుతం రెవెన్యూ,  మైనింగ్ శాఖల మంత్రి. భూములు, గనులు ఆయన పరిధిలోనే ఉంటాయి కాబట్టి, భూ ఆక్రమణలు,  అక్రమ మైనింగ్ ఆరోపణలు నేరుగా ఈయనపైనే ప్రభావం చూపుతాయి. పొంగులేటి గతంలో బీఆర్ఎస్‌లో ఉండి, తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్‌ను దెబ్బతీయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన్ని ఇరుకున పెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది.

ఇక చెరువుల ఆక్రమణల పేరుతో హైడ్రా ద్వారా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతల కట్టడాలను కూల్చివేస్తోంది. దీనికి ప్రతిగా, మంత్రి కుటుంబమే భూ కబ్జాలకు పాల్పడుతుంటే హైడ్రా ఎందుకు మౌనంగా ఉంది? అని ప్రశ్నించడం ద్వారా హరీష్ రావు ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేశారు. మొత్తానికి, ఈ 7 వేల కోట్ల భూ కుంభకోణం ఆరోపణలతో తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కింది. దీనిపై న్యాయ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

By
en-us Political News

  
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.