సిద్దిపేట నియోజకవర్గంలో మొక్కల సంరక్షణకై హరిష్ రావు ప్రత్యేక శ్రద్ద

Publish Date:Oct 17, 2019

Advertisement


మనం ఒకప్పుడు విన్న  డైలాగ్   ఇప్పుడు  కళ్ళ ముందు  కనిపిస్తుంది మొక్కె కదా అని పీకేస్తే పీక తెగుద్ది ఇది ఓ పాపులర్ సినిమా లోని డైలాగ్ ఇప్పుడు సిద్దిపేటలో ఇదే జరుగుతుంది. కాకపోతే పీక తెగకుండా మొక్క పీకితే జేబులు ఖాళీ కావచ్చు, జైలుకు వెళ్లవచ్చు, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను ఎవరు ధ్వంసం చేసిన అనుమతి లేకుండా కొమ్మలూ నరికిన మొక్కలకు అమర్చిన ట్రీగార్డు ఎత్తుకెళ్లిన జరిమానాలు విధిస్తున్నారు. లేదంటే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు. సిద్దిపేటలో ఇప్పటికే జరిమానాలతో పాటు కేసులు కూడా నమోదయ్యాయి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కల సంరక్షణకు సిద్దిపేటలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హార్టికల్చర్ అధికారులు ఆకస్మిక తనిఖీలను చేపడుతున్నారు. మొక్కల సంరక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, తొలగించిన సదరు వ్యక్తులపై అక్కడికక్కడే చర్యలు తీసుకుంటున్నారు, జరిమానాలు విధిస్తున్నారు.

మొక్క, చెట్టు ఏజ్ ను బట్టి వెయ్యి నుంచి గరిష్ఠంగా ఇరవై ఐదు వేల వరకు జరిమానా విధిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పట్టణంలో మొక్కల నరికిన దాదాపు పదిహేను మందికి జరిమానాలు విధించారు. వీరిలో కొందరిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ముఖ్యంగా పట్టణాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా మొక్కలు నరికిన వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. రోడ్డుపై లేదా డివైడర్లపై మొక్కలూ చెట్లూ పడిపోయి ఉన్న ట్రీగార్డులు ఎత్తుకెళ్లిన, ఎంక్వైరీ చేసి మరీ జరిమానాలు విధిస్తున్నారు.ఇప్పటిదాక జరిమానాల ద్వారా దాదాపు నలభై వేల రూపాయలు మునిసిపల్ అకౌంట్ లో జమ చేశారు.

మాజీ మంత్రి హరీశ్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో మొక్కల రక్షణకు అనుక్షణం తపిస్తున్నారు. చెట్టు పడింది కనపడటం లేదా అంటూ అక్కడే నిలదీస్తారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో పర్యటిస్తున్న హరీశ్ రావు పాత బస్టాండ్ కరీంనగర్ రోడ్డులో ఒక షాపు ముందు పడి ఉన్న చెట్టును గమనించి కారులోంచి దిగి నేరుగా షాపు యజమాని దగ్గరికి వెళ్లారు.

ఏం బాబు చెట్టు కింద పడింది కనబడటం లేదా షాపు ఓపెన్ చేసేటప్పుడు చెట్టును చూడలేదా రోజు ఉన్న చెట్టు లేదని గమనించలేదా చెట్టంటే అంత నిర్లక్ష్యమా అని షాపు యజమానిని నిలదీశారు. అక్కడే ఉండి అతనితో కింద పడిన మొక్కను కర్రతో కట్టించి సరి చేపించారు. మన ప్రాణం ఎంతో మొక్క ప్రాణం అంతే అని మరోసారి మొక్కను నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ శాఖలను కూడా ఆయన వదిలిపెట్టటం లేదు.

ఇటీవల సిద్దిపేట నుండి సీతారాంపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వెళ్తూ పట్టణంలోని ముస్తాబాద్ రోడ్డులో చెట్లను నరకడం గమనించిన హరీశ్ రావు కారులోంచి దిగి చెట్ల కొమ్మలు తీసేస్తున్న విద్యుత్ లైన్ మెన్ పై సీరియస్ అయ్యారు. విద్యుత్ డీఈ, ఏఈలపై ఫోన్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము మొక్కలు నాటుతూ పోతే మీరు నరుక్కుంటూ పోతారా అని సీరియస్ అయ్యారు.

శాఖల మధ్య సమన్వయంతో వ్యవహరించి చెట్లను సంరక్షించాలని సూచించారు. చెట్లను నరకొద్దు ఇబ్బందిగా ఉన్న కొమ్మలను కట్ చేయాలి తప్ప గొడ్డలిపెట్టి నరకొద్దు. మొక్కలు తీసేస్తే చర్యలు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మొత్తమ్మీద హరితహారం కార్యక్రమంతో సిద్దిపేటని హరితవనంగా మార్చడానికి అటు హరీశ్ రావు ఇటు అధికారులు అహర్నిశలు కృషి చేస్తున్నారు.  

By
en-us Political News

  
ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ నేతల ప్ర‌చారం హోరెత్తుతోంది. రాష్ట్రం న‌లుమూల‌లా అభ్య‌ర్థులు గెలుపుకోసం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి ఓట్లు అభ్య‌ర్థిస్తున్నారు. ఏపీ మొత్తం ఒక ఎత్త‌యితే గుంటూరు పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ఒక్కటీ ఒక ఎత్తు. ఈ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో రాజ‌కీయ చైత‌న్యం ఎక్కువ‌, మేధావి వ‌ర్గ‌మూ ఎక్కువే. అలాంటి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం అభ్య‌ర్థి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీకి రైతులు ఓట్లు పడే అవకాశాలు ఎంతమాత్రం లేకుండా పోయాయి.. దీని వెనుక ఎన్నో
చిన్నారుల్ని ఎన్నికల ప్రచారానికి వినియోగించటం తప్పుగా పేర్కొన్న నిరంజన్ రెడ్డి ఫిర్యాదుకు ఎన్నికల సంఘం స్పందించింది. జరిగిన సంఘటనపై విచారణ జరిపించాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహ్రాకు ఆదేశాలు జారీ చేశారు. అమిత్ షాతో పాటు.. మరో నలుగురిపైనా మొఘల్ పురా పోలీసులు కేసు నమోదు చేసి.. ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు.
పదవి ఊడబోతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నవరత్నాల పేరుతో ఏవేవో పథకాలు అనౌన్స్ చేసి 2019లో
తన అన్న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మానసిక పరిస్థితి మీద తనకు అనుమానంగా వుందని ఆయన సోదరి,
ఈ ఏడాది దీపావళి పండగ కొద్ది నెలల ముందే రాబోతోంది. ఈ ఏడాది మే 13న నరక చతుర్దశి, జూన్ 4న దీపావళి రానున్నాయి
ఇది ప్రపంచ వింతల్లో ఎన్నో నంబర్ అవుతుందో తెలియదుగానీ, ఇది నిజంగానే ప్రపంచ వింతే! మజ్లిస్ పార్టీ అధినేత,
సోనియా గాంధీ, రాహుల్​ గాంధీలు ఇప్పటికే పార్లమెంట్​లో ఉన్నారు. ఇప్పుడు తాను కూడా పోటీ చేసి గెలిస్తే. గాంధీ కుటుంబలో ఉన్న ముగ్గురూ. చట్టసభలో కూర్చున్నట్టు అవుతుంది. ఇది బీజేపీకి మరో అస్త్రంగా మారుతుందని ప్రియాంక గాంధీ భ‌య‌ప‌డ్డారు.
అమెరికాలో నర్సుగా పనిచేసిన 41 ఏళ్ళ హీథర్ ప్రెస్డీ అనే మహిళకు కోర్టు 7 వందల సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని పెమ్మసాని హెచ్చరించారు.  గుంటూరులో ఎమ్మెల్యే స్థాయి వ్య‌క్తి గుట్కా, గంజాయి అమ్ముతున్నాడని ఘాటుగా విమ‌ర్శించారు. గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ నిలదీస్తున్నారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.