క్షుద్ర పూజలు చేసినట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టండి : హరీశ్‌రావు

Publish Date:Aug 17, 2026

Advertisement

 

సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను పూజలు చేసినట్లు ముఖ్యమంత్రి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు. దేవుడు కనిపిస్తే భక్తితో దండం పెట్టుకోవడం తనకు మొదటి నుంచీ ఉన్న అలవాటని హరీశ్‌రావు తెలిపారు. దేవుడి పేరుతో కూడా చిల్లర రాజకీయాలు చేయడం రేవంత్‌రెడ్డికి మాత్రమే తెలిసిన విద్య అని విమర్శించారు.

ఆధ్యాత్మిక భావనతో తమిళనాడులోని తిరుచ్చిలో శ్రీరంగనాథస్వామి ఆలయానికి వెళ్లానని చెప్పారు. అలాగే కర్ణాటకలోని కొల్లూరు మూకాంబికా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకునేందుకు శివమొగ్గ ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. దేవుడి దర్శనం కోసం తాను ఆలయాలకు వెళ్లడం కూడా ముఖ్యమంత్రికి తప్పుగా కనిపిస్తోందా అని ప్రశ్నించారు.

తాను ఎయిర్‌పోర్టుకు వెళ్లిన సమయంలో ఇంటెలిజెన్స్‌, పోలీసు అధికారులు గుర్తించి ఫొటోలు తీశారని, అభిమానంతో కొందరు తనతో ఫొటోలు దిగారని హరీశ్‌రావు వివరించారు. అయితే, అక్కడ తాను ఏవో పూజలు చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాను అలాంటి పూజలు చేసినట్లు రేవంత్‌రెడ్డి వద్ద ఆధారాలు ఉంటే వెంటనే బయటపెట్టాలని సవాల్‌ చేశారు. తనపై బురదజల్లి, వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ‘పూజల డ్రామా’ ఆడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే తన పేరు చెప్పి ఆరోపణలు చేయాలని హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి తన పేరు ప్రస్తావిస్తే వెంటనే లీగల్‌ నోటీసు పంపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. చట్టపరమైన చర్యలకు భయపడే రేవంత్‌రెడ్డి తన పేరు నేరుగా చెప్పకుండా పరోక్షంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

Harish Rao, Revanth Reddy, Telangana Politics, Harish Rao Challenge, Pooja Controversy, Temple Visit, Political Controversy, Telangana Congress, BRS, Harish Rao Comments, Revanth Reddy Comments, Legal Notice, Political Allegations

By
en-us Political News

  
జాగిత్యాల జిల్లా మల్యాల మండల పరిధిలోని కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఒక దిగ్భ్రాంతికర ప్రమాదం చోటుచేసుకుంది.
లైంగిక పటుత్వ పరీక్షకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!
ఏపీలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు..!
ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..!
తీవ్ర ఆర్థిక సంక్షోభం, రాజకీయ అశాంతి ఆ దేశం స్వాతంత్ర్య వేడుకల్లో ప్రస్ఫుటంగా కనిపించింది.  పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో  నిర్లిప్తత కొట్టొచ్చినట్లు కనిపించింది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో దేశ వ్యతిరేకత వ్యక్తమైంది.
నా బిడ్డకు బతుకునిచ్చారు సార్.. మీరే పేరు పెట్టండి..!
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గం ప్రకటన..!
కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తమిళనాడు రైతు ప్రయోజనాలను,  సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున వరుసగా 12 రోజుల పాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అసలు జగన్ హయాం అంతా అక్రమాలు, అవినీతి మయం అని విమర్శించిన ఆయన ముఖ్యంగా గ్రూప్ వన్ నియామకాలలో చోటు చేసుకున్నటువంటి కుంభకోణాన్ని తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని పేర్కొన్నారు
జీవితమంతా ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు, ఉద్యోగ విరమణ తర్వాత దక్కాల్సిన ఫలాలు ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి.
పిఠాపురం ఏఈ నూకరాజు సహా ముగ్గురు గల్లంతు..!
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ విద్యా వ్యవస్థను బలోపేతంపై  దృష్టి సారించిందన్నారు. గడిచిన కొద్ది నెలలలోనే ఉపాధ్యాయ నియామకాలు, ట్రాన్స్‌ఫర్‌ల ప్రక్రియను పారదర్శకంగా,  నిష్పాక్షికంగా నిర్వహించామని వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.