ఆసియాకప్లో పాకిస్తాన్, శ్రీలంక చేతిలోనూ భారత్ ఓటమి పట్ల మాజీ క్రికెటర్లు, వీరాభిమానులు మండి పడుతున్నారు. అసలు సెలక్షన్ విషయంలోనే పొరపాట్లు చేశారని మాజీ స్టార్ హర్బజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండు మ్యాచ్ల్లోనూ ముందు బ్యాట్చేసిన భారత్ పెద్దగా స్కోర్ చేయకపోగా ప్రత్యర్ధు లను నిలువరించడంలో ఘోరంగా విఫలమయిందని హర్భజన్ ఆరోపణలు గుప్పించాడు. ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్లను వినియోగించకపోవడం మీద టీమ్ ఇండియా కెప్టెన్ శర్మను, సెలక్షన్ కమటీని మాజీ స్పిన్నర్ ప్రశ్నించాడు. పాక్తో తలపడిన మ్యార్లో 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేశారు. మంచి స్కోర్ అనుకున్నా, ఆ తర్వాత పాక్ను నిలువరించడంలో బౌలర్లు విఫలం కావడమే ఆశ్చర్యపరిచందని అన్నాడు. ఆ మ్యాచ్లో మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ నవాజ్లు అద్భుతంగా ఆడారు. అంతకంటే మన బౌలర్లు వారిని నిలువరించడంలో చేతులెత్తేశారన్నాడు. మంచి బౌలర్లు అందుబాటులో ఉన్నప్పటికీ వారిని సమయానికి జట్టులోకి తీసుకోకుండా ఉన్నవాళ్లతో సర్దుకుపోయే ప్రయత్నాలే జరిగాయని ఆరోపించాడు. అసలు ఉమ్రాన్ మాలిక్, దీపక్ చాహర్ను పనికి రారని ఎలా భావించారో అర్ధంకావడం లేదని మండి పడ్డా డు హర్భజన్ సింగ్.
శ్రీలంకతో మ్యాచ్ విషయానికి వస్తే, కెప్టెన్ శర్మ అద్భుతంగా ఆడి 41 బంతుల్లో 72 పరుగులు చేయడం ఆశలు కల్పించిందని కానీ ఆ తర్వాత ఏ బ్యాటర్ అతనికి మద్దతుగా నిలవలేకపోవడం దారుణ మన్నాడు. కింగ్ కోహ్లీ, సూర్య, పాండ్యాల మీద పెట్టుకున్న ఆశలు దెబ్బతిన్నాయన్నాడు. మరో వంక కుశాల్ మెండిస్, నిస్సంక ఇద్దరూ 97 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం ఆ జట్టును విజయానికి గట్టిమార్గం వేసింది. వారిని అరికట్టడానికి భారత్ బౌలర్లు గట్టిగా వారి ప్రత్యేకతలు ప్రదర్శిం చలేదనే హర్భజన్ విమర్శించాడు. కాయితంమీద కనిపించిన అద్భుతం ఫీల్డ్లో లోపించడమే మన సును గాయపరిచిందన్నాడు. రెండు మ్యాచ్ల్లో చేతులుఎత్తేయడంతో కప్ ఫైనల్ ఆశలు దెబ్బ తిన్నా యని, దీన్ని గురించి సెలక్షన్ కమిటీ ప్రత్యేకంగా ఆలోచించాలన్నాడు.
హర్భజన్ సింగ్ ఒక్కడేకాదు, పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా భారత్ పరాజయం పట్ల ఆశ్చ ర్యం వ్యక్తం చేశాడు. భారత్ అనుసరించిన గేమ్ ప్లాన్ ఘోరంగా విఫలం కావడం ఇప్పుడే చూశా నన్నాడు. పాకిస్తాన్తో ఓడినప్పటికీ ఆ మేరకు శ్రీలంక మీద గెలిచి పాక్ జట్టుకు సవాలు విసరు తుందని ఆశించాన ని కానీ రెండో మ్యాచ్ పరాజయం అస్సలు ఊహించలేదన్నాడు. మ్యాచ్ ఆడే ఫైనల్ లెవెన్ ఎంపిక విష యంలోనే భారత్ సెలక్టర్లు పొరపాటు చేసినట్టుగా కనపడుతోందని అక్తర్ అనుమానం వ్యక్తం చేశాడు. జట్టుకు దినేష్ కార్తీక్, ఆవేష్ఖాన్, బిష్ణోయ్, రిషబ్ పంత్, హుడా లలో జట్టుకు ఎవరు ఎప్పుడు ఎంతగా ఉపయోగపడతారన్నది ఆలోచించి నిర్ణయం తీసుకుంటే పరాభవాలకు అవకాశం ఉండేది కాదని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/harbhajan-questions-selectors-about-umran-25-143432.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.