హ్యాపీ బర్త్ డే చంద్రబాబూ.. ఏపీ నీడ్స్ యూ

Publish Date:Apr 19, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.  వైసీపీ అధినేత జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టారు. ఇది జరిగి ఐదేళ్లయ్యింది. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్త్రం రెండుగా విడిపోయి పదేళ్లు పూర్తయ్యాయి.  కానీ విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం  ఇప్పటికీ రాజధానే లేని రాష్ట్రంగా మిగిలిపోయింది.

విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన రాజదాని అమరావతి నిర్మాణాన్ని ప్రస్తుత  ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి  ప్రభుత్వం అటకెక్కించింది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులనే ఆలోచన పేరుతో  అసలుకే ఎసరు పెట్టారు. జగన్ రెడ్డి దుర్మార్గ ఆలోచన కారణంగా  రాజధాని కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులు ఆందోళన బాటపట్టారు. కోర్టులు, కేసులతో ఐదేళ్లు గడిచిపోయాయి.   అసలు రాజధానే లేని రాష్ట్రంగా   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నవ్వుల పాలైంది. 

 ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రానికి  జీవనాడిగా పేర్కొన్న జాతీయ ప్రాజెక్ట్ పోలవరం   ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా వుంది. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్ళలో 75 శాతానికిపైగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తిచేసినా, ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం గడచిన నాలుగేళ్ళలో మరో అడుగు ముందుకేయలేదు. చాప చుట్టేసింది. జీవనాడి ఊపిరి తీసేసింది. ఇక పెట్టుబడులు, ఇతరత్రా అభివృద్ధికి సంబంధించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచింది. జగన్ మోహన్ రెడ్డి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం  పరిస్థితి అభివృద్ధి అన్న మాటకే తావులేని విధంగా మారిపోయింది. అన్ని విషయాల్లోనూ వెనుక బడి అక్షరక్రమంలో అగ్రస్థానంలో అభివృద్ధిలో అధమ స్థానంలో అన్నట్లుగా మారిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో ఏపీ అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధి, సంక్షేమాలలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్న ఆశలు ఉండేవి. ఐటీ రంగంలో హైదరాబాద్ కు దీటుగా ఎదుగుతుందన్న భావన అన్ని వర్గాల్లోనూ ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ రంగంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు విశేషంగా కృషి చేశారు.   ఆయన కృషి ఫలించి మొగ్గ తొడిగే సమయానికి ప్రభుత్వం మారి పోయింది.

అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత  ఏపీలో ఐటీ రంగం పరిస్థితి ఏమిటి?  సేమ్ ఓల్డ్ స్టోరీ రాజధాని అమరావతి ఏమైందో, 75శాతం పూర్తయిన పోలవరం ఎలా పడకేసిందో.. రాష్ట్రంలో ఐటీ రంగానిది కూడా అదే కథ. అదే వ్యథ.  ఐటీ శాఖ మంత్రికి గుడ్డు కథ చెప్పడంలో ఉన్న నైపుణ్యం.. రాష్ట్రానికి ఐటీ పరిశ్రమలను ఆకర్షించడంలో లేదు.  

నిజమే రాష్ట్ర విభజన సమయంలోనే అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు అన్యాయం చేసింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం  అదే అన్యాయాన్ని కొనసాగించింది.  మరో వంక 2019 లో ఒక్క ఛాన్స్  అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  అంతకు ముందు   ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో అప్పుడే మొదలైన ప్రగతి ప్రస్థానానికి స్పీడ్ బ్రేకులు వేసి నిలిపివేశారు. అనుభవ రాహిత్యం, అజ్ఞానం, అహంకారంతో   అభివృద్ధిని అటకెక్కించారు.   ఈ రోజు  ఏపీ అంటే అప్పులు. ఏపీ అంటే తిప్పలు  అనుకునే  పరిస్థితికి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దిగజార్చేశారు. అందుకే  రాజకీయ విశ్లేషకులు, మేథావులు రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుదు శ్రీకారం చుట్టిన ఏపీ పునర్నిర్మాణ మహా యజ్ఞం కొనసాగాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలన రావడమొక్కటే మార్గం అంటున్నారు.

చంద్రబాబునాయుడు అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభు త్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. రాజకీయ వైరుధ్యాలు, విభేదాలతో ఆయన ఘనతను మరుగుపరుద్దామన్న ప్రయత్నం అరచేతిని అడ్డుపెట్టి సూర్య కాంతిని ఆపుదామనుకోవడమే అవుతుంది. స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసి  జైల్లో పెట్టినప్పుడు… ఆయన చేసిన పనులన్నీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఆయన సంస్కరణలతో ఉద్యోగాలు సాధించుకున్న లక్షలాది మంది ఇవేం కుట్రలని బాధపడ్డారు. ఆగ్రహంతో రోడ్డు మీదకు వచ్చి ఆందోళనలకు దిగారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఉన్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఆయన వేసిన పునాదుల్ని.. ఆయన పడిన కష్టాన్ని అందరితో పంచుకుంది.  అదీ చంద్రబాబు నాయుడు బ్రాండ్. రాజకీయాలంటే ప్రజలకు మేలు చేయడానికేనని నమ్మే నాయకుడు. ఏదో గాలిలో అభివృద్ధి జరిగిపోయిందని వాదించే వారు.. ఓ అహ్మదాబాద్ ఎందుకు ఐటీ హబ్ కాలేదు.. ఓ లక్నో ఎందుకు కాలేదు.. ఓ కోల్ కతా ఎందుకు కాలేదు..  ఓ జైపూర్ ఎందుకు కాలేదు? అన్న ప్రశ్నకు జవాబు చెప్పగలరా? కానీ అశేష ఆంధ్రులు మరో ఆలోచన లేకుండా ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలరు?    అక్కడ చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి లేరు అన్నదే.వారి జవాబు వచ్చిన అవకాశాల్ని అంది పుచ్చుకుని ప్రజల జీవితాల్ని బాగు చేయాలన్న సంకల్పం ఉన్న నేత అక్కడ లేరు. చంద్రబాబు ఉండటం ఏపీ ప్రజల అదృష్టం. తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సంపూర్ణంగా ప్రజల భవిష్యత్ ను తీర్చిదిద్దడానికి చంద్రబాబు ఉపయోగించారు. చంద్రబాబు కృషికి, ఓ తరం యువత రాత మార్చేందుకు చేసిన ప్రయత్నానికి  ప్రజల హృదయాలలో  ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకు నిదర్శనమే ఆయన అక్రమ అరెస్టుకు నిరసనగా దేశ విదేశాల్లో తెలుగువారున్న ప్రతి చోటా ప్రతీ చోటా  వెల్లువెత్తిన నిరసనలు, ఆందోళనలు.  రాష్ట్ర విభజనతో ఏమీ లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ను   అభివృద్ధి చేయాలని ఆయన కలలు కన్నారు. వాటిని ఎగ్జిక్యూట్ చేసే దశలో అధికారం కోల్పోయారు. ఐదేళ్ల కిందటితో పోలిస్తే.. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే.. ఏం కోల్పోయారో అందరికీ అర్థమవుతుంది. చంద్రబాబు చూడని పదవి లేదు.. అనుభవించని అధికారం లేదు. ఇప్పుడు ఆయన సీఎం కావడం ఆయనకు  కాదు.. ఏపీకి ముఖ్యం. ఏపీ భవిష్యత్ కు ముఖ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ అంతా బైబై జగన్ అంటోంది. హ్యాపీ బర్త్ డే.. ఏపీ నీడ్స్ చంద్రబాబు ! 


(చంద్రబాబు జన్మదినం సందర్భంగా..)

By
en-us Political News

  
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.