జీవీఎల్ నరసింహారావు తన జగన్ భక్తిని చాటుకోవడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. పేరుకు బీజేపీ ఎంపీ అయినా జగన్ ఏపీలో అధికారంలో ఉన్నంత కాలం, అంతకు ముందు వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో కూడా జీవీఎల్ వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గానే వ్యవహరించారు. ఆయన తీరుకు అప్పట్లో బీజేపీ రాష్ట్ర నాయకులే అసహనం వ్యక్తం చేశారు. జీవీఎల్ తీరు పై రాష్ట్ర బీజేపీ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా చేశారు. అంతెందుకు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా జీవీఎల్ తీరుపై విమర్శలు గుప్పించారు. జగన్ అండతో విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి సునాయాసంగా ఎంపీగా ఎన్నికైపోవచ్చని భావించి.. జగన్ పైనా, జగన్ పార్టీపైనా జీవీఎల్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శించారు.
సరే ఆయనకు బీజేపీ ఎన్నికలలో పోటీ చేసేందుకు అవకాశమే ఇవ్వలేదు. చేసింది చాలు.. ఇక మౌనంగా ఉండండి అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో ఉంది. ఆ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. దీంతో జీవీఎల్ కు తత్వం బోధపడి ఇక నోరెత్తే సాహసం చేయరని అంతా అనుకున్నారు. అయితే ఓ నెలా పదిహేను రోజులు నోరు కట్టేసుకుని మౌనంగా ఉన్న ఆయన మళ్లీ జగన్ కు మద్దతుగా తన డ్యూటీని ప్రారంభించేశారు.
అమరావతిపై విషం చిమ్మడం మొదలెట్టేశారు. అమరావతికి కేంద్రం ఇచ్చింది ముమ్మాటికీ అప్పేనని, ఎవరూ అడగకుండానే జగన్ గొంతు అరువు తీసుకుని మరీ రోడ్డెక్కేశారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి అమరావతి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన 15 వేల కోట్ల రూపాయలూ అప్పేనని చెప్పారు. అయితే ఆ అప్పును కేంద్రం చెల్లిస్తుందా? రాష్ట్రం చెల్లిస్తుందా అనే దానిపై క్లారిటీ లేదుని.. ఈ అప్పు తీర్చేందుకు కనీసం 30 ఏళ్లు పడుతుందని చెప్పుకొచ్చారు.
బీజేపీ నేతగా జీవీఎల్ అన్న ఈ మాటల్ని పట్టుకుని వైసీపీ రాష్ట్రానికి కేంద్రం అన్యాయం అంటూ గగ్గోలు పెట్టేయడం మొదలైంది. వాస్తవానికి కేంద్రం గ్యారంటీగా ఉండి ఇప్పించే అప్పులు కేంద్రం ఖాతాలోనే ఉంటాయి. రాష్ట్రం ఓ పది శాతం కట్టాల్సి ఉంటుంది. ఆ పది శాతం కూడా రాష్ట్రం కట్టలేకపోతే.. అదీ కేంద్రమే కడుతుంది. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు. అభివృద్ధి పనులు జరిగితే ఆటోమేటిక్గా పెట్టుబడి అంతా తిరిగి వస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయినా జీవీఎల్ ఎందుకు పనిగట్టుకుని కేంద్రం అమరావతికి ఇచ్చింది అప్పు అంటూ వైసీపీ వాదనకు మద్దతు పలకడానికి మీడియా ముందుకు వచ్చి జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకోవడానికి తహతహలాడుతున్నారు. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తున్న చందంగా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నానని చెబుతూనే.. బడ్జెట్ లో ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందనే అర్ధం వచ్చే మాటలు మాట్లాడుతూ.. జగన్ భక్తిని చాటుకున్నారు. జీవీఎల్ బీజేపీలో ఉన్న జగన్ కోవర్టు అన్న విషయంలో బీజేపీకి స్పష్టత ఉంది. కాషాయ కండువా కప్పుకుని ఫ్యాన్ గాలి పీలుస్తానంటున్న జీవీఎల్ కు శృంగభంగం తప్పదని బీజేపీ, తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gvl-started-again-25-181973.html
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.