బీఆర్ఎస్ గాలి తీసేసిన గుత్తా ఆయనా ‘చే’యందుకుంటున్నారా?

Publish Date:Apr 20, 2024

Advertisement

బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత  కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు. తాజాగా శాశనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీ నుంచి వలసలపై చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఓటమి పరాభవాన్ని దిగమింగుకుని పార్టీ ఉనికిని కాపాడుకోవాలంటే లోక్ సభ ఎన్నికలలో సత్తాచాటడమే మార్గమని భావించి సర్వశక్తులూ కూడగట్టుకుని లోక్ సభ ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్ర ద్వారా కేసీఆర్  శ్రీకారం చుట్టడానికి సర్వం సిద్ధం చేసుకున్న వేళ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాశనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి.

తలెత్తుకోలేనంతగా పార్టీ అధిష్ఠానం పరువును గంగలో కలిపేశాయి. ఇంతకీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏమన్నారంటే పార్టీ నుంచి వలసలకు   పార్టీ నాయకత్వంపై నేతలు విశ్వాసం కోల్పోవడమే కారణమని కుండబద్దలు కొట్టేశారు. శనివారం (ఏప్రిల్ 19) విలేకరులతో మాట్లాడిన ఆయన పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలు కావడానికి పార్టీ హైకమాండ్ తో పాటు మంత్రుల వ్యవహారశైలి కూడా కారణమన్నారు. అహంకారం తలకెత్తినందునే పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ఇప్పటికి కూడా పార్టీ పరిస్థితిని సమీక్షించుకోవడానికి పార్టీ అగ్రనాయకత్వం ముందుకు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ తీరు మారకుంటే భవిష్యత్ లో  పార్టీ ఉనికి కూడా ప్రమాదంలో పడుతుందని చెప్పారు. 

అంతే కాదు.. నాడు తాను బీఆర్ఎస్ లో చేరడానికి కారణాలను కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నాడు తనను 16 సార్లు కలిసి బతిమలాడితే తాను పార్టీ మారాననీ, కేబినెట్ లోనికి తీసుకుంటామన్న హామీ ఇచ్చిన తరువాతే కారెక్కాననీ వివరించారు. ఆ తరువాత పరిస్థితి మారిపోయిందనీ, గత ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎవరికీ అప్పాయింట్ మెంటే ఇవ్వలేదనీ అన్నారు, 

పార్టీని అడ్డుపెట్టుకుని ఉద్యమ కారుల ముసుగులో కోట్ల రూపాయలు సంపాదించారనీ, ఒక నాడు జేబులో వందల రూపాయలు కూడా లేని వ్యక్తులు ఈ రోజు కోట్లకు పడగలెత్తారంటే ఏ రీతిన సంపాదనకు మరిగారో అర్ధం చేసుకోవచ్చన్నారు. తన కుమారుడు అమిత్ పోటీకి వెనుకడుగు వేయడానికి పార్టీలోని కొందరు సహకరించకపోవడమే కారణమన్నారు. ఇక ఇటీవలి కాలంలో పార్టీ మారిన బీఆర్ఎస్ సిట్టుంగులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గుత్తా శుఖేందర్ రెడ్డి చెప్పారు.  గుత్తా వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆయన కూడా కారు దిగడానికి నిర్ణయించుకున్నారా అన్న అనుమానాలు బీఆర్ఎస్ వర్గాలలో వ్యక్తమౌతున్నాయి. ఆయన కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన నిర్ణయం తీసుకుని ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పార్టీ మారుతున్నాననే సంకేతాలను ఆయన నేరుగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ మాట్లాడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నుంచి వలసలు ఆ పార్టీని గాభరాపెడుతున్నాయి. పార్టీ నుంచి వలసల  నిరోధం విషయంలో పార్టీ హైకమాండ్ చేతులెత్తేసినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన  రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్‌ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
 బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్క‌డ‌ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొన‌సాగుతోంది
ఎట్టకేలకు చిరుత చిక్కింది. శంషాబాద్ విమానాశ్రయం పరిసరాల్లో ఆరు రోజులుగా సంచరిస్తూ అందరినీ కలవరపెట్టిన చిరుత చివరకు పట్టుబడింది. అటవీ శాఖ అధికారులు అమర్చిన బోనులో ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి అందులో చిక్కుకుంది. దీంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఆ చిరుతను తొలుత నెహ్రూ జూపార్క్ కు తరలించనున్నారు. చిరుత ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొనేందుకు దానికి వైద్య పరీక్షలు నిర్వహించనన్నారు. అనంతరం ఒక రోజుపాటు జూ అధికారుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. ఆరోగ్యంగానే ఉందని నిర్ధారణ అయ్యాక చిరుతనునల్లమల అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. 
తెలంగాణలో బిఆర్ఎస్ చచ్చిపోయింది. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బిఆర్ఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రస్తుతం
కడప పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తుకు వచ్చేది వైఎస్ కుటుంబం. ఆ జిల్లాపై ఆ కుటుంబం ఆధిపత్యం. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయింది. ఆ ప్రభావం జిల్లాలో ఆ కుటుంబం ఆధిపత్యంపై కూడా పడింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.