ఓ వైపు రాష్ట్రంలో పోలీసుల పనితీరుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ హయాంలో దారుణాలకు పాల్పడ్డ వారి పట్ల మరీ మెతకగా వ్యవహరిస్తున్నారని ఆరోపించడమే కాకుండా, ఇప్పటికీ రాష్ట్రంలో పోలీసు అధికారులు కొందరు వైైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుంటే.. మరో వైపు రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు, పోలీసుల తీరు ఆ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఉంది.
వైసీపీ సోషల్ మీడిాయా యాక్టివిస్ట్ వర్రా రవీంద్ర రెడ్డిని కడప జిల్లా పులివెందలలో అదుపులోనికి తీసుకున్న పోలీసులు కడపకు తీసుకువచ్చి 41ఏ నోటీసులు ఇచ్చి వదిలివేయడం, ఆ నోటీసులు అందుకు బయటకు వచ్చిన వర్రా రవీద్రరెడ్డి ఆచూకీ లేకుండా పరారైపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయిన సంగతి తెలిసిందే. కడప ఎస్పీపై బదిలీ వేటు కూడా వేసింది.
అలాగే రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనీల్ కు పోలీసులు రాచమర్యాదలు చేసిన సంఘటన కూడా సంచలనం రేపింది. అలా బోరుగడ్డ అనీల్ కు రాచమర్యాదలు చేసి రెస్టారెంట్లో విందు భోజనం తినిపించిన పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ కేసులో విచారణకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డ అనీల్ ను పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బుధవారం తీసుకువచ్చి మంగళగిరి కోర్టులో హాజరు పరిచారు. విచారణ పూర్తై తిరిగి జైలుకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో గన్నవరంలోని ఓ రెస్టారెంట్ లో భోజనాలు చేశారు. ఈ దృశ్యాలను సెల్ ఫోన్ లో రికార్డు చేస్తున్న తెలుగుదేశం కార్యకర్తల నుంచి ఫోన్ లాక్కున్న పోలీసులు ఆ వీడియో డిలీట్ చేశారు.
అయితే ఆ రెస్టారెంట్ లో ఉన్న సీసీ కెమేరా ఫుటేజీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిందితుడు బోరుగడ్డ అనీల్ కు పోలీసుల విందు భోజనం అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు స్పందించి విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేశారు. బోరుగడ్డ అనిల్ కు రెస్టారెంట్ లో భోజనం పెట్టించిన సమయంలో విధినిర్వహణలో ఉన్న ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేస్తూ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/guntur-sp-suspend-seven-police-conistables-25-187998.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!