జగన్ హయాంలో గుంతల మయం.. ఇప్పడు అద్దంలా మెరుస్తున్న వైనం!

Publish Date:Feb 16, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రోడ్లు అద్దాల్లా మెరిసిపోతున్నాయ్. జగన్ హయాంలో అడుగుకో గుంత అన్నట్లుగా ఉండే రోడ్లు..  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తరువాత  బాగుపడ్డాయి. జగన్ తన ఐదేళ్ల పాలనలో బటన్ నొక్కుడుకు తప్ప మరే విషయాన్నీ పట్టించుకోలేదు. ప్రజల  గుంతల రోడ్లపై ప్రయాణించలేక నరకయాతన అనుభవిస్తున్నా పట్టించుకోలేదు. ఉచితాలు పందేరం చేస్తున్నా.. నన్ను కాక ఇంకెవరిని ఎన్నుకుంటారు అన్నట్లుగా వ్యవహరించారు. అయితే కేవలం బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేయడం ఒక్కటే పాలన అని ప్రజలు భావించలేదు. ఐదేళ్ల పాటు తమకు నరకాన్ని చూపించిన జగన్ కు గత ఏడాది జరిగిన ఎన్నికలలో గుణపాఠం చెప్పారు. జగన్ బాబూ మీకు పాలన చాతకాదు.. ఇక ఇంటికి దయచేయడం అని ఓటుతో గట్టి బుద్ధి చెప్పారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వైసీపీని అసెంబ్లీలో కేవలం 11 అంటే 11 సీట్లకు పరిమితం చేశారు. జగన్ కు ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందుల ప్రజల సైతం గట్టి షాక్ ఇచ్చారు. సొంత జిల్లా కడపలో మెజారిటీ సీట్లలో ఓడించిన జనం.. పులివెందులలో జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించేశారు. 

ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపడుతూనే రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించారు. నిర్దిష్ట సమయంలో రోడ్లపై గుంతలు కనిపించకుండా మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు అద్దాల్లా తయారయ్యాయి. మచ్చుకైనా ఒక్కటంటే ఒక్క గుంత కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు జగన్ హయాంలో రోడ్లపై ప్రయాణం అంటే నరకంలా ఉందనీ, ఇప్పుడు స్వర్గంలా మారిందని అంటున్నారు. ఇదే విషయాన్ని నెటిజనులు కూడా సాక్ష్యాలుగా అప్పటి ఫొటోలు, ఇప్పటి ఫోటోలు సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తూ జగన్ పాలన నరకం, బాబు పాలన స్వర్గం అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా గుంటూరులోని  ఆగ్రహారం రోడ్లుకు సంబంధించి జగన్ పాలనలో ఆ రహదారి దుస్థితిని, ఇప్పుడు అద్దంలా మెరిసిపోతున్న పరిస్థితిని తెలియజేసేలా ఫొటోలు పోస్టు చేశారు. ఆ ఫొటోలు వెంటనే తెగ వైరల్ అయ్యాయి. జనం.. చంద్రబాబు సమర్ధతను, ప్రజల ప్రయోజనాలు, వారి సమస్యల పరిష్కారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. 

ఇదే అగ్రహారం రోడ్డు జగన్ హయాంలో గుంతలతో నిండి, వర్షాకాలంలో స్విమ్మింగ్ పూల్ ను తలపించేలా ఉండేది. అప్పట్లో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు సంభవించేవి. పలువురు మరణించగా, మరింత మంది ఆస్పత్రుల పాలయ్యారు. అదే రోడ్డు ఇప్పుడు  గుంతలనేవి లేకుండా, రోడ్డు మధ్య డివైడర్ తో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా మారిపోయింది. జనం ఈ రోడ్డు పై ప్రయాణిస్తూ నిత్యం జగన్ పాలనలో ఈ రోడ్డు పై ప్రయాణం అంటే నరకయాతనగా ఉందని, ఇప్పుడెంతో హాయిగా ఉందని వ్యాఖ్యలు చేస్తున్నారు.   

By
en-us Political News

  
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.