Publish Date:Mar 29, 2025
హైద్రాబాద్ బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీతో భయభ్రాంతులకు గురి చేశాడు. శుక్రవారం అర్దరాత్రి కొందరు యువకులు ఓ పెన్ టాప్ జీప్ లో చేసిన రచ్చ సృష్టించారు. ఏకంగా జీపు డ్యాష్ బోర్డుపై తుపాకీకి ఉంచి చేసిన విన్యాసాలను చిత్రీకరించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. సుమోటాగా స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తుపాకీ తీసిన అకతాయి అప్సర్ ని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడితో పాటు తుపాకీ విన్యాసాలను చేసిన ఆకతాయిలను పోలీసులు అదుపులో తీసుకున్నారు
హైద్రాబాద్ లో తుపాకీతో హడావుడి చేయడం కొత్త కాదు. అనేక చోట్ల ఇలా విన్యాసాలు చేయడం మామూలైంది. 2022 అక్టోబర్ లో బహదూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు. యుపిఐ ద్వారా పేమెంట్ చేస్తానని చెప్పి వెళ్లిపోతుండగా బంక్ నిర్వాహకులు అడ్డుకున్నారు. ఆ యువకుడు మరో ఇద్దరు యువకులను పిలిపించి బంక్ సిబ్బందిపై దాడి చేశాడు. వచ్చిన ఇద్దరుయువకుల్లో ఒకరివద్ద గన్ ఉంది. సిబ్బందికి గన్ చూపిస్తూ నానాహంగామా చేశాడాయువకుడు. ఈ ఘటనలో పోలీసులు ఇప్తెకార్ ను అరెస్ట్ చేశారు.
2021 మార్చిలో తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ గ్రేటర్ హైద్రాబాద్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ ఎంఎల్సి ఎన్నికల సంబురాల్లో తన లైసెన్స్ గన్ తీసి గాల్లో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. కార్యకర్తలు వారించడంతో గన్ లోపల పెట్టుకున్నాడు.
2024లో బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద కొందరు యువకులు తుపాకీతో రోడ్ల మీద తిరిగారు.
2016 మార్చిలో నకిలీ పోలీస్ డమ్మీ రివాల్వర్ తో హల్ చల్ చేశాడు ప్రేమ జంటలను టార్గెట్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ నకిలీ పోలీస్ ను ఎన్ ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సంవత్సరం జనవరిలో బీదర్ ఎటిఎం దొంగల ముఠా అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి పరారయ్యారు.
హైద్రాబాద్ లో సంఘ విద్రోహశక్తులు తుపాకీలతో విన్యాసాలు చేస్తున్నా పౌరులు సామాజిక బాధ్యతగా స్పందించి పోలీసులకు సమాచారం ఇస్తున్న దాఖలాలు లేవు. తాజాగా బంజారాహిల్స్ లో అకతాయిల విన్యాసాలపై పోలీసులకు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ అయినదాన్ని పోలీసులే స్పందించి సుమోటాగా కేసు నమోదు చేయాల్సి వచ్చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gunman-gun-show-in-banjara-hills-police-register-a-case-as-a-fir-39-195212.html
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. . ఈ నేపథ్యంలో తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24వ మహాసభల్లో కేరళ మాజీ ఎంఏ బేబీ సీపీఎం నూతన సారథిగాఎన్నికయ్యారు.
శ్రీ రామనవమి రోజే వేములవాడ రాజన్న ను వరుడిగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది. ప్రతీ యేటా శ్రీ రామనవమి రోజు హిజ్రాలు రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. ఆ చులకన భావాన్ని పోగొట్టే విధంగా శ్రీరామనవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో అడుగుపెడతారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు
వైకాపా నేత , మాజీమంత్రి అంజద్ భాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు. అహ్మద్ భాషాపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారి అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో రేషన్ బియ్యం దళారులు చేతుల్లో వెళ్లిపోతుంది. దీనికి ప్రధాన కారణం దొడ్డు బియ్యం. ఈ బియ్యం వండుకుని తినడానికి ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు.
తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు
కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరాల్లో వన్య ప్రాణులు వచ్చేస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని ఎస్వీయు క్యాంపస్ లో చిరుతపులి చిక్కింది. గత కొంత కాలంగా ఈ చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఇదే తొలిసారి. ఆదివారం (ఏప్రిల్ 6) ఉదయం జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 6) స్వామివారిని దర్శించుకునేందుకు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
కోహినూర్ వజ్రం గురించి మనం ఎక్కడో ఎప్పుడో వినే ఉంటాం. అవును చిన్నప్పడు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో చదువుకునే ఉంటాం. అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం ఇప్పడు ఎక్కడుందో, మనలో చాలా మందికి తెలియదు. ఇప్పడు ఎక్కడ వుందో అనే కాదు, అసలు ఎక్కడ పుట్టిందో, అక్కడికి ఎలా చేరిందో కూడా మనకు తెలియదు.
పార్లమెంట్ సమావేశాలంటే, ఏముంది? మూడు వాయిదాలు, ఆరు వాకౌట్లు. కాదంటే, గౌరవ సభ్యుల అరుపులు, కేకలు.. నిరసనలు, నినాదాలు, ఇంతే కదా అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చును. తప్పు కాదని చెప్ప లేము.
అవును మరి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని కదా అంటారు. సో.. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అందరం చూస్తున్నది అదే అయినప్పుడు.. కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్ర విచిత్ర, విన్యాస వికారాలను, కాదని అనడం కుదరదు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్ లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసిపి అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజుకు ఒకరి పైన కేసులు నమోదు అవుతున్నాయి.
రాజమండ్రి వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి గణేష్ల మధ్య ఆధిపత్యపోరు పోరు తార స్థాయికి చేరుకుంది. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆ పార్టీ పరువుతో పాటు నాయకుల ప్రతిష్ఠను కూడా బజారున పడేస్తున్నది.