గుడివాడ, గన్నవరం తెలుగుదేశం ఖాతాలోకే.. కొడాలి, వంశీ ఇక ఇంటికే!

Publish Date:May 2, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది.  ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి. అయితే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ దాకా, ఫలితం దాకా వేచి చూడాల్సిన పని లేదంటూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న సర్వేలు కుండబద్దలు కొట్టుస్తున్నాయి. అయితే కోడ్ అమలులో ఉన్నందున ప్రిపోల్ సర్వేలపై  నిషేధం ఉన్న నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో వచ్చే సర్వేల ప్రామాణికతను నిర్ధారించలేం. అయితే.. ప్రజల మూడ్ ను గమనించినట్లైతే ఆ సర్వేలలో నిజమెంతో ఇట్లే అవగతమైపోతుంది. 

తాజాగా రైజ్ (RISE) సర్వే పేరిట సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న సర్వే ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని పేర్కొంది. కోడ్ అమలులోకి రావడానికి ముందు వచ్చిన దాదాపు డజన్ సర్వేలు కూడా ఇదే విషయాన్ని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన రైజ్ సర్వే కూడా అదే విషయాన్ని చెప్పింది. తెలుగుదేశం కూటమి 108 నుంచి 120 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుందని పేర్కొంది. గత సర్వేలు కూడా దాదాపుగా ఇదే ఫలితాన్ని వెలువరించిన నేపథ్యంలో ఇదేమంత ఆశ్చర్యం కలిగించదు. కానీ ఈ సర్వేలో గుడివాడ, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థుల పరాజయం ఖరారైందని సర్వే పేర్కొంది. ఈ రెండు నియోజకవర్గాల పట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే.

ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలలో అధికార పార్టీ అభ్యర్థులుగా రంగంలో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీల రాజకీయ ప్రయాణం తెలుగుదేశంతో ఆరంభమైంది. ఇరువురూ తరువాత వైసీపీలో చేరారు. రాజకీయాలలో పార్టీలూ మారడం అరుదేమీ కాదు. కానీ వీరు తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి చేరిన తరువాత తెలుగుదేశంపై నోరుపారేసుకున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. రాజకీయ విమర్శలు చేసి ఉంటే వారి పట్ల ప్రజలలో ఇంత ఆగ్రహం వ్యక్తమయ్యేది కాదు. కానీ ఇరువురూ కూడా తెలుగుదేశం అధినేత, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారు. 

దీంతో తెలుగుదేశం పార్టీ కూడా ఈ రెండు నియోజకవర్గాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. గుడివాడలో నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ ఓటమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి అభ్యర్థుల ఎంపిక చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు నియోజకవర్గాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే రైజ్ సర్వేలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఓటమి బాటలో ఉన్నారని వెల్లడి కావడంతో తెలుగుదేశం శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  రైజ్ సర్వే ప్రకారం గుడివాడలో వైసీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొడాలి నాని కంటే తెలుగుదేశం అభ్యర్థి వెనిగండ్ల రాముకు ప్రజాదరణ అధికంగా ఉందని పేర్కొంది. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఇందులో రెండు సార్లు తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత వరుసగా రెండు సార్లు వైసీసీ అభ్యర్థిగా గెలిచారు. ఐదో సారి మాత్రం కొడాలి నానికి గుడివాడలో శృంగభంగం తప్పదని అంటున్నారు. ప్రజా వ్యతిరేకతను ముందుగానే పసిగట్టిన వైసీపీ అధిష్ఠానం ఒక దశలో  గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొడాలి నానిని తప్పించాలని కూడా యోచించిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గత ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విస్మరించి విపక్షంపైనా, విపక్ష నేత, ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత భాషా ప్రయోగంతో చేసిన విమర్శలూ ప్రజలలో కొడాలి నాని ప్రతిష్టను దిగజార్చడమే కాకుండా, వారి ఆగ్రహానికి కూడా కారణమయ్యాయి. ఆ ప్రజాగ్రహమే రైజ్ సర్వేలో ప్రతిఫలించినట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఇక గన్నవరం అధికార పార్టీ అభ్యర్థి  వల్లభనేని వంశీ విషయానికి వస్తే ఆయన ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలుపోందారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే 2019 విజయం తరువాత ఆయన తెలుగుదేశం పార్టీని వీడి జగన్ గూటికి చేరిపోయారు.  గన్నవరంలో గెలుపు తన బలం అని భ్రమించిన వంశీ తెలుగుదేశంపైనా, తెలుగుదేశం నాయకత్వం పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  నియోజకవర్గ అభివృద్ధికి గుండు సున్నా చుట్టేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అది ఆయన నామినేషన్ దాఖలు ర్యాలీలో ప్రస్ఫుటంగా కనిపించింది. దీంతో తెలుగుదేశం బలం కానీ, తన విజయానికి తన బలం కారణం కాదన్న విషయం వంశీకి బోధపడినట్లైంది. అందుకే ఇవే గన్నవరం నుంచి తన చివరి ఎన్నికలు అంటూ ప్రజాసానుభూతి కోసం బేల మాటలు మాట్లాడారు. వైసీపీలో తన వ్యతిరేక వర్గాన్ని ఈ ఒక్కసారికీ సహకారం అందించాలంటూ బతిమలాడుకున్నారు. ఆ మాటలే వంశీ ఓటమి బాటలో ఉన్నారన్న విషయాన్ని తేల్చేశాయి. ఇప్పుడు తాజాగా రైజ్ సర్వే కొడాలినాని, వల్లభనేని వంశీల సీన్ అయిపోయిందని తేల్చేసింది.  

By
en-us Political News

  
పొలిటికల్ కామెడీడలో ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మించిపోయారు. ఇంత కాలం రోహిణీకార్తె ఎండలను మించి వేడెక్కిన రాజకీయ మంటల నుంచి పాల్ మాత్రమే తన ప్రసంగాలతో ఒకింత ఉపశమనం కలిగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తరువాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం కావడానికి బాధ్యులెవరని నిలదీసింది. హింస ప్రజ్వరిల్లిన పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (మే 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ వెలుపలి వరకూ సాగింది.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-19
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.
చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా షిర్డీ సాయిబాబాను సందర్శించుకున్నారు.
సీబీఐ, ఈడీ చాలా పవిత్రమైన, అమోఘమైన తేదీ అయిన జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, జగన్‌కి తమ సత్తా చూపించడానికి అవసరమనవన్నీ ‘సిద్ధం’ చేసుకుంటున్నాయి.
ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.
తెలంగాణలో చాలావరకు వేడి తగ్గింది. వాతావరణం చల్లబడింది. ఈనెల మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొన్ని చోట్ల 47 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. వాతావరణం చల్లబడటంతో 40 డిగ్రీలకు పడిపోయింది. ఉపరితల ఆవర్తనమే కారణమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అవర్తనం ఏర్పడమే దీనికి కారణం. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు కురవనున్నాయి.
చంద్రగిరి నుంచి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి విశాఖపట్నంలో వెయ్యి కోట్ల స్కామ్ చేశాడు. అక్రమ మైనింగ్‌తో  అందినంత దండుకున్నాడు.
ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. పోలింగ్ సరళిని బట్టి తెలుగుదేశం భారీ విజయం సాధించడం ఖాయమన్న అంచనాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ కూడా స్వయంగా నిర్వమించుకున్న పోస్ట్ పోల్ సర్వే ఫలితం కూడా భారీ విజయాన్ని ఖరారు చేసిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.