వైఎస్ అవినాష్ రెడ్డి ఖేల్ ఖతం? అరెస్టుకు రంగం సిద్ధం!?

Publish Date:Nov 11, 2024

Advertisement

సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టులు, ప్రత్యర్థులపై దూషణలకు పాల్పడిన వారిపై ఇటీవల ఏపీ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఫిర్యాదు అందగానే పోలీసులు రియక్ట్ అవుతున్నారు. జగన్ హయాంలో ఈ పరిస్థితి  ఉండేది కాదు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ బూతుల‌కు కర్మాగారంగా మారిపోయి.. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నేతలపై అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌తో రెచ్చిపోయింది. అలా రెచ్చిపోయిన వారికి అప్పటి సీఎం జగన్ ప్రోత్సాహం, అండదండలు ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్ పై, వారి కుటుంబ స‌భ్యుల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌ పోస్టులు పెట్టారు. అలాంటి వారిపై ప్ర‌స్తుత ఎన్డీయే కూట‌మి   కొర‌డా ఝ‌ళిపిస్తున్నది. ఇప్ప‌టికే ప‌లువురిని పోలీసులు అరెస్టులు చేయ‌గా.. మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేశారు. పులివెందుల వైసీపీ సోషల్‌ మీడియా  కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని విచారణలో  విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వందల మంది వైసీపీ కార్యకర్తలకు బూతు పోస్టులు పెట్టేందుకు, మార్ఫింగ్‌లు చేసేందుకు, అప్పటి ప్రతిపక్ష నేతల కుటుంబాలపై తప్పుడు ప్రచారాలు చేసేందుకు జీతాలు ఇచ్చేవార‌ని పోలీసుల విచార‌ణ‌లో వర్రా రవీందారెడ్డి చెప్పిన‌ట్లు తెలిసింది. వ‌ర్రాతో పాటు ఇంటూరి రవి కిరణ్ కూడా పే రోల్ లో ఉన్నారు. మొత్తంగా న‌ల‌బైకు పైగా యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కార్యకర్తలకూ డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేసినట్లుగా తెలిసింది. ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరిగితే చాలాపెద్ద కేసు అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అసలు ఇలాంటి   పనులు చేయడమే తప్పు అయితే ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు   పెట్టించడం సంచలనంగా మారింది. ఈ అంశంలో అప్పటి ప్రభుత్వ పెద్దల కుట్ర ఖచ్చితంగా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ లో పోస్టులు పెట్టిన ఆర్జీవీకి కూడా ఎన్నికలకు ముందు డబ్బులు చెల్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇవన్నీ బయటకు తీసి అసలు తప్పుడు ప్రచారం.. పేక్ పోస్టుల కుట్ర ఏమిటో లెక్క తేల్చే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. 

వ‌ర్రా ర‌వీంద‌ర్ తోపాటు సుబ్బారెడ్డి, ఉద‌య్ ల‌ను పోలీసులు మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. క‌ర్నూల్ రేంజ్ డీఐజీ కొయ్య ప్ర‌వీణ్ ఈ కేసుకు సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆర్గ‌నైజ్డ్ గా నేర‌పూరిత సామ్రాజ్యాన్ని వీళ్లు నెల‌కొల్పారు. ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిళ‌, వైఎస్ విజ‌య‌మ్మ‌, సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి పోలీసుల విచార‌ణ‌లో స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. వైఎస్ వివేకానంద హ‌త్య కేసులో ప్ర‌దాన ముద్దాయి అవినాశ్ రెడ్డి అని ష‌ర్మిళ‌, సునీత‌లు ప‌దేప‌దే చెబుతూ వ‌చ్చారు. వైఎస్ వివేకా హత్య కేసు  విచార‌ణలో ఉంది. 

అయితే, ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అవినాశ్ రెడ్డి చిన్న‌పిల్ల‌వాడు అని, ఆయ‌న‌పై ష‌ర్మిళ‌, సునీత అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారంటూ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అప్ప‌ట్లో ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్ మాట‌ల‌ను న‌మ్మి వైఎస్ అవినాశ్‌రెడ్డిని మ‌రోసారి ఎంపీగా గెలిపించారు. ప్ర‌స్తుతం వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి చెప్పిన విష‌యాల‌ను బ‌ట్టిచూస్తే.. ష‌ర్మిళ‌, సునీత‌, విజ‌య‌మ్మ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం, మార్ఫింగ్ ఫొటోల‌తో అస‌భ్య‌క‌ర ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంలో అవినాశ్ రెడ్డే సూత్ర‌దారి అని తేలుతోంది.

వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి భార‌తీ సిమెంట్ లో ఉద్యోగి. అయితే, ఆయ‌న పూర్తిగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం, సోష‌ల్ మీడియా గ్రూపుల‌ను హ్యాడిల్ చేయ‌డం చేసేవార‌ని పోలీసుల విచార‌ణ తేలింది. తాడేప‌ల్లిలోని వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి న‌డుచుకునేవారు.  ష‌ర్మిళ‌, విజ‌య‌మ్మ‌, సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టేవాడు. ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘ‌వ రెడ్డి నుంచి వ‌చ్చిన కంటెంట్ ను, మార్ఫింగ్‌ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి స‌ర్క్యులేట్ చేసేవారు. ప‌లు సందర్భాల్లో రాఘ‌వ‌రెడ్డితో ఫోన్లో మాట్లాడే స‌మ‌యంలో.. ప‌క్క‌నే అవినాశ్ రెడ్డి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయాల్సిన కంటెంట్ ను రాఘ‌వ‌రెడ్డితో చెబుతుండ‌టాన్ని గుర్తించిన‌ట్లు ర‌వీంద్రరెడ్డి పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించిన‌ట్లు డీఐజీ పేర్కొన్నారు. దీంతో ష‌ర్మిళ‌, సునీత‌, విజ‌య‌మ్మ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల పెట్ట‌డం వెనుక అవినాశ్ రెడ్డి ఉన్నారని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, ఈ విష‌యంపై లోతుగా విచార‌ణ చేస్తామ‌ని పోలీసులు చెప్పారు. త‌న‌పై త‌ప్పుడు పోస్టుల‌కు సంబంధించి సునీత ఇప్ప‌టికే హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశార‌ని, ఆ ఫిర్యాదును సైబ‌ర్ క్రైంవారు మాకు బ‌దిలీ చేస్తే విచార‌ణ చేస్తామ‌ని డీఐజీ చెప్పారు. ఒక‌వేళ సునీత వ‌చ్చి మాకు ఫిర్యాదు ఇచ్చినా విచార‌ణ చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంలోని ఆడ‌వారిపై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టుల వెనుక ఎంపీ అవినాశ్ ఉన్నారన్న స్ప‌ష్ట‌త వ‌స్తుండ‌టంతో ఆయ‌న అరెస్టుకు సైతం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నది.

By
en-us Political News

  
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.