వైఎస్ అవినాష్ రెడ్డి ఖేల్ ఖతం? అరెస్టుకు రంగం సిద్ధం!?

Publish Date:Nov 11, 2024

Advertisement

సామాజిక మాధ్యమంలో అనుచిత పోస్టులు, ప్రత్యర్థులపై దూషణలకు పాల్పడిన వారిపై ఇటీవల ఏపీ పోలీసులు సీరియస్ గా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులపై ఫిర్యాదు అందగానే పోలీసులు రియక్ట్ అవుతున్నారు. జగన్ హయాంలో ఈ పరిస్థితి  ఉండేది కాదు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ బూతుల‌కు కర్మాగారంగా మారిపోయి.. అప్పటి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన నేతలు, మహిళా నేతలపై అసభ్య పోస్టులు, మార్ఫింగ్ ఫొటోల‌తో రెచ్చిపోయింది. అలా రెచ్చిపోయిన వారికి అప్పటి సీఎం జగన్ ప్రోత్సాహం, అండదండలు ఉండేవన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌, లోకేశ్ పై, వారి కుటుంబ స‌భ్యుల‌పై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌ పోస్టులు పెట్టారు. అలాంటి వారిపై ప్ర‌స్తుత ఎన్డీయే కూట‌మి   కొర‌డా ఝ‌ళిపిస్తున్నది. ఇప్ప‌టికే ప‌లువురిని పోలీసులు అరెస్టులు చేయ‌గా.. మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేశారు. పులివెందుల వైసీపీ సోషల్‌ మీడియా  కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని విచారణలో  విస్తుపోయే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. 

ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వందల మంది వైసీపీ కార్యకర్తలకు బూతు పోస్టులు పెట్టేందుకు, మార్ఫింగ్‌లు చేసేందుకు, అప్పటి ప్రతిపక్ష నేతల కుటుంబాలపై తప్పుడు ప్రచారాలు చేసేందుకు జీతాలు ఇచ్చేవార‌ని పోలీసుల విచార‌ణ‌లో వర్రా రవీందారెడ్డి చెప్పిన‌ట్లు తెలిసింది. వ‌ర్రాతో పాటు ఇంటూరి రవి కిరణ్ కూడా పే రోల్ లో ఉన్నారు. మొత్తంగా న‌ల‌బైకు పైగా యూట్యూబ్ చానళ్లు నిర్వహిస్తున్న కార్యకర్తలకూ డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు చేసినట్లుగా తెలిసింది. ఈ వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరిగితే చాలాపెద్ద కేసు అవుతుందని పరిశీలకులు అంటున్నారు. అసలు ఇలాంటి   పనులు చేయడమే తప్పు అయితే ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు   పెట్టించడం సంచలనంగా మారింది. ఈ అంశంలో అప్పటి ప్రభుత్వ పెద్దల కుట్ర ఖచ్చితంగా ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ లో పోస్టులు పెట్టిన ఆర్జీవీకి కూడా ఎన్నికలకు ముందు డబ్బులు చెల్లించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇవన్నీ బయటకు తీసి అసలు తప్పుడు ప్రచారం.. పేక్ పోస్టుల కుట్ర ఏమిటో లెక్క తేల్చే ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది. 

వ‌ర్రా ర‌వీంద‌ర్ తోపాటు సుబ్బారెడ్డి, ఉద‌య్ ల‌ను పోలీసులు మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు. క‌ర్నూల్ రేంజ్ డీఐజీ కొయ్య ప్ర‌వీణ్ ఈ కేసుకు సంబంధించిన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఆర్గ‌నైజ్డ్ గా నేర‌పూరిత సామ్రాజ్యాన్ని వీళ్లు నెల‌కొల్పారు. ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిళ‌, వైఎస్ విజ‌య‌మ్మ‌, సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి పోలీసుల విచార‌ణ‌లో స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలిసింది. వైఎస్ వివేకానంద హ‌త్య కేసులో ప్ర‌దాన ముద్దాయి అవినాశ్ రెడ్డి అని ష‌ర్మిళ‌, సునీత‌లు ప‌దేప‌దే చెబుతూ వ‌చ్చారు. వైఎస్ వివేకా హత్య కేసు  విచార‌ణలో ఉంది. 

అయితే, ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో అవినాశ్ రెడ్డి చిన్న‌పిల్ల‌వాడు అని, ఆయ‌న‌పై ష‌ర్మిళ‌, సునీత అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారంటూ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. అప్ప‌ట్లో ప్ర‌జ‌లు సైతం జ‌గ‌న్ మాట‌ల‌ను న‌మ్మి వైఎస్ అవినాశ్‌రెడ్డిని మ‌రోసారి ఎంపీగా గెలిపించారు. ప్ర‌స్తుతం వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి చెప్పిన విష‌యాల‌ను బ‌ట్టిచూస్తే.. ష‌ర్మిళ‌, సునీత‌, విజ‌య‌మ్మ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం, మార్ఫింగ్ ఫొటోల‌తో అస‌భ్య‌క‌ర ఫొటోలు సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంలో అవినాశ్ రెడ్డే సూత్ర‌దారి అని తేలుతోంది.

వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి భార‌తీ సిమెంట్ లో ఉద్యోగి. అయితే, ఆయ‌న పూర్తిగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డం, సోష‌ల్ మీడియా గ్రూపుల‌ను హ్యాడిల్ చేయ‌డం చేసేవార‌ని పోలీసుల విచార‌ణ తేలింది. తాడేప‌ల్లిలోని వైసీపీ సోష‌ల్ మీడియా ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి వ‌చ్చిన ఆదేశాల మేర‌కు వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి న‌డుచుకునేవారు.  ష‌ర్మిళ‌, విజ‌య‌మ్మ‌, సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టేవాడు. ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘ‌వ రెడ్డి నుంచి వ‌చ్చిన కంటెంట్ ను, మార్ఫింగ్‌ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో వ‌ర్రా ర‌వీంద్ర రెడ్డి స‌ర్క్యులేట్ చేసేవారు. ప‌లు సందర్భాల్లో రాఘ‌వ‌రెడ్డితో ఫోన్లో మాట్లాడే స‌మ‌యంలో.. ప‌క్క‌నే అవినాశ్ రెడ్డి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేయాల్సిన కంటెంట్ ను రాఘ‌వ‌రెడ్డితో చెబుతుండ‌టాన్ని గుర్తించిన‌ట్లు ర‌వీంద్రరెడ్డి పోలీసుల విచార‌ణ‌లో వెల్ల‌డించిన‌ట్లు డీఐజీ పేర్కొన్నారు. దీంతో ష‌ర్మిళ‌, సునీత‌, విజ‌య‌మ్మ‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టుల పెట్ట‌డం వెనుక అవినాశ్ రెడ్డి ఉన్నారని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అయితే, ఈ విష‌యంపై లోతుగా విచార‌ణ చేస్తామ‌ని పోలీసులు చెప్పారు. త‌న‌పై త‌ప్పుడు పోస్టుల‌కు సంబంధించి సునీత ఇప్ప‌టికే హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశార‌ని, ఆ ఫిర్యాదును సైబ‌ర్ క్రైంవారు మాకు బ‌దిలీ చేస్తే విచార‌ణ చేస్తామ‌ని డీఐజీ చెప్పారు. ఒక‌వేళ సునీత వ‌చ్చి మాకు ఫిర్యాదు ఇచ్చినా విచార‌ణ చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. వైఎస్ కుటుంబంలోని ఆడ‌వారిపై సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌క‌ర పోస్టుల వెనుక ఎంపీ అవినాశ్ ఉన్నారన్న స్ప‌ష్ట‌త వ‌స్తుండ‌టంతో ఆయ‌న అరెస్టుకు సైతం పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతున్నది.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.