సంజయ్ నై.. కిషన్ సై! బీజేపీలో ఏం జరుగుతోంది? 

Publish Date:Nov 21, 2020

Advertisement

తెలంగాణ బీజేపీ రెండు వర్గాలుగా విడిపోయిందా? జనసేనతో పొత్తు కొందరికి ఇష్టం లేదా? పవన్ తో చర్చలకు ఆయన ఎందుకు వెళ్లలేదు? గ్రేటర్ ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతుండగా బీజేపీలో పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి. గ్రేటర్ ఎన్నికల కార్యాచరణ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన పొత్తు విషయంలో పార్టీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయడంపై బండి సంజయ్ ఓ అభిప్రాయంతో ఉండగా కిషన్ రెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరించారనే చర్చ బీజేపీలో జరుగుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మధ్య సఖ్యత లేదని. నగర సీనియర్ నేతలు కూడా రెండు వర్గాలుగా విడిపోయారని చెబుతున్నారు.

జనసేనతో పొత్తు విషయంలో బండి సంజయ్ కు ఇష్టం లేకున్నా కిషన్ రెడ్డి చొరవ తీసుకుని పవన్ కల్యాణ్ తో మాట్లాడరనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే శుక్రవారం రోజంతా హైదరాబాద్ లోనే 
ఉన్నారు బండి సంజయ్. కాంగ్రెస్ మాజీ నేత సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లి ఆయన్ను బీజేపీలోకి ఆహ్వానించారు. మరికొందరు నేతలతోనూ సంజయ్ మంత్రాంగం జరిపారని చెబుతున్నారు. హైదరాబాద్ లోనే ఉన్నా పవన్ కల్యాణ్ తో చర్చలకు సంజయ్ వెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. జనసేనతో పొత్తు ఇష్టం లేదు కాబట్టే.. పవన్ దగ్గరకు బండి వెళ్లలేదని చెబుతున్నారు. అంధ్రా పార్టీగా ముద్రపడిన జనసేనతో పొత్తు పెట్టుకుంటే గ్రేటర్ లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని కూడా కొందరు బీజేపీ నేతలు ఆందోళన పడుతున్నారని తెలుస్తోంది. అందుకే బండి సంజయ్ జనసేన విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేన పొత్తుపై మొదటి నుంచి తీవ్ర గందరగోళం నడిచింది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన పవన్ కల్యాణ్ ..అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు 
చేస్తున్నామని చెప్పారు. గ్రేటర్ లో పోటీ చేయడానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపిన జనసేన.. పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసింది. సొంతంగానే పోటీ చేస్తామని బయటికి చెబుతూనే... బీజేపీతో పొత్తుకు జనసేన నేతలు ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే జనసేనతో పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపలేదు. జనసేనతో పొత్తు పెట్టుకుంటే వారికి కొన్ని డివిజన్లు ఇవ్వాల్సి వస్తుందని. దాంతో పార్టీలో అసంతృప్తి వస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భావించారట. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎవరితోనూ పొత్తు లేదని ఆయన ప్రకటించారు. అంతేకాదు జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితమని కూడా స్పష్టం చేశారు. సంజయ్ ప్రకటన తర్వాత కూడా గురువారం జనసేన నుంచి మరో ప్రకటన వచ్చింది. గ్రేటర్ ఎన్నికలపై  పవన్ తో మాట్లాడేందుకు బండి సంజయ్ వస్తున్నారని ప్రకటించింది. జనసేన లేఖపై మరోసారి స్పందించిన బండి సంజయ్.. జనసేనతో పొత్తు సమస్యే లేదని తేల్చి చెప్పారు. 

బండి సంజయ్ పొత్తు లేదని రెండోసారి స్పష్టం చేయడంతో జనసేన ఒంటరిగానే పోటీ చేస్తుందని భావించారు. అయితే శుక్రవారం మళ్లీ పొలిటికల్ సీన్ మారిపోయింది. జనసేన పొత్తు మేటర్ లోకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎంటరయ్యారు. పార్టీ మరో ముఖ్య నేత లక్ష్మణ్ తో కలిసి వెళ్లి ఆయన పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేలా పవన్ ను ఒప్పించారు. కిషన్ రెడ్డి తో సమావేశం తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు జనసేన చీఫ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డిల తీరుతో బీజేపీలో కన్ఫ్యూజన్ నెలకొన్నదని చెబుతున్నారు. టికెట్ల ఎంపికలోనూ సంజయ్, కిషన్ రెడ్డి వర్గాల మధ్య గొడవలు జరిగాయంటున్నారు. బంజారాహిల్స్, కూకట్ పల్లి ప్రాంత నేతలు కొందరు కిషన్ రెడ్డిపై బహరంగంగానే తీవ్ర ఆరోపణలు చేశారు. 

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు మీద ఉన్నట్లు కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నిక విజయంతో జీహెచ్ఎంసీలోనూ పాగా వేస్తామనే ధీమా కమలనాధుల్లో పెరిగిందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బీజేపీలోకి జోరుగా వలసలు కొనసాగుతున్నాయి. నగర కాంగ్రెస్ లోని కొందరు ముఖ్య నేతలు, టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా కమలం గూటికి చేరారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ నుంచి  పోటీ 
చేసేందుకు నేతలు పోటీ పడ్డారు. ఒక్కో డివిజన్ నుంచి 10 నుంచి 10 మంది టికెట్ కోసం పోటీ పడ్డారని బీజేపీ నేతలు చెబుతున్నారు. గ్రేటర్ లో దాఖలైన నామినేషన్లలోనూ అధికార టీఆర్ఎస్ కంటే బీజేపీ పేరుతో వేసినవే ఎక్కువగా ఉన్నాయి. ఇంత వరకు  బాగానే రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతల తీరే గందరగోళంగా మారిందని తెలుస్తోంది. ముఖ్య నేతల తీరుతో గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగవచ్చనే ఆందోళన కమలం కేడర్ లో కనిపిస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.