అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానం.. జగన్ కింకర్తవ్యం?

Publish Date:Apr 28, 2025

Advertisement

అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ సారి అమరావతి పనులకు ఎలాంటి విఘాతం కలగకుండా, అత్యంత వేగంగా పూర్తి చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు  41 వేల కోట్ల రూపాయల విలువైన టెండర్లు   ఖరార య్యాయి.  అలాగే  రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.4,700 కోట్ల అంచనా వ్యయంతో ఐదు టవర్లతో కూడిన ఇంటిగ్రేటెడ్ స్టేట్ సెక్రటేరియట్‌ను నిర్మాణానికి టెండర్లు పిలిచింది. అమరావతి పూర్తికి మూడు సంవత్సరాల గడువును నిర్ణయించి.. ఆ దిశగా వేగంగా ముందుకు కదులుతున్నారు.  

ఇక అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కూడా ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  2015లో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి జగన్‌ను  ఆహ్వానించారు, కానీ అప్పుడు ఆయన ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.  ఆ తరువాత 2019లో అధికార పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ మూడు రాజధానులంటూ అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారు.  అయితే 2024 ఎన్నికలలో  జనం జగన్ ను అధికారం నుంచి దించేశారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికే ఓటుశారు.  

ఇప్పుడు చంద్రబాబు నిర్దిష్ట కాలవ్యవధిలో అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. అదలా ఉంచితే.. ఇప్పుడు ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికి జగన్ హాజరౌతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఇప్పుడు సరైన కారణం చూపకుండా జగన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరు అవ్వడం అంటే ప్రజాభిష్ఠాన్ని ఖాతరు చేయకపోవడమే అవుతుంది. జగన్ మూడు రాజధానుల విధానాన్ని జనం నిర్ద్వంద్వంగా తిరస్కరించారన్నది గత ఏడాది జరిగిన ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి. ఇక అంటే జనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతే ఏకైక రాజధాని అని తేల్చేశారు. ఈ దశలో అందుకు పడుతున్న కీలక ముందడుగు అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమం. ఆ కార్యక్రమానికి జగన్ తన అహంకారంతో గైర్హాజరైతే.. జనానికి మరింత దూరమౌతారు. ఆయన ఎటూ రారని ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపకుంటే.. అదే వేరే విషయం కానీ, ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందినా కూడా గైర్హాజరు కావడాన్ని జగన్ ఎలా సమర్థించు కుంటా రన్నది ఆయనకే తెలియాలి. కానీ, సమస్య ఏమిటంటే జగన్  జనం ఇవ్వని ప్రతిపక్ష హోదా డిమాండ్ తో అసెంబ్లీనే బాయ్ కాట్ చేశారు. అలాగే ఇప్పుడు అమరావతి పనుల పున: ప్రారంభ కార్యక్రమానికీ డుమ్మా కొట్టే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.