రెజ్లర్ల ఆందోళన బీజేపీకి పట్టదా?

Publish Date:May 29, 2023

Advertisement

ఢిల్లీలో మహిళా రెజ్లర్ల  ఆందోళన పై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. రెజ్లర్ల సమస్యపై  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వినా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ, సామాజిక వేత్తలు, మేధావులూ.. ఇలా అన్ని వర్గాలూ స్పందించాయి. రెజ్లర్లకు మద్దతుగా నిలిచాయి. అయితే ప్రధాని మోడీ మాత్రం ఈ విషయంలో ఇంత వరకూ నోరెత్తలేదు. పైగా పోలీసులు రెజ్లర్ల విషయంలో అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్త అవుతోంది.

దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ప్రపంచస్థాయి పోటీలలో పతకాలను సాధించిన రెజ్లర్లు తన సమస్యలపై గళమెత్తితే.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా, వారి ఆందోళనను శాంతి భద్రతల సమస్యగా చూడటాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.  రెజ్లర్ల  తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోరుతున్నారు. ఇది న్యాయమైన డిమాండే. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడైన బీజేపీ ఎంపీ  బ్రిజ్‌భూషణ్‌ సింగ్ పై ఈ రకమైన ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి.

అయినా కేంద్రం పట్టించుకోలేదు. పోలీసులు ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదు. దేశానికి పతకాలు తెచ్చిన ఎంతో మంది మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ పై చేస్తున్న ఆరోపణలకు పూచికపుల్ల పాటి విలువ ఇవ్వడం లేదు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియా వంటి వారు బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేస్తున్నా  కేంద్రం, క్రీడాశాఖ ఉన్నతాధికారులు  ఎవరూ స్పందించడం లేదు.  ఎంపీకే  మద్దతుగా నిలుస్తున్నారు.

పోనీ బ్రిజ్ భూషణ్.. క్రీడాకారుడా అంటే కాదు. దేశానికి పతకాలు సాధించుకువచ్చిన మల్లయోధుడూ కాదు.. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు.  అంతే కాదు అధికార పార్టీ ఎంపీ. ఇవే అర్హతలుగా ఆయనపై ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోనికి తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ ముందుకు రావడం లేదు. అదే సమయంలో రెజ్లర్ల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయడానికి క్షణమాత్రం సంకోచించడం లేదు.

ఘనత వహించిన బ్రిజ్ భూషణ్ సింగ్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కోట్లది రూపాయలు ట్నరోవర్ ఉన్న విద్యాసంస్థలకు అధిపతి కూడా. యూపీలోని పలు ప్రాంతాలలో బ్రిజ్ భూషణ్ బలమే వల్లే బీజేపీ ఉనికిలో ఉందన్న పరిస్థితి ఉంది. అందుకే అంత మంది రెజర్లు దాదాపుగా నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఆయన పై చర్యలు తీసుకోవడానికి బీజేపీ వెనుకాడుతోంది.   రెజ్లర్ల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను, మోడీ వ్యక్తిగత ప్రతిష్టనే కాదు.. దేశ ప్రతిష్టను సైతం మసకబారుస్తోంది. శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల జులం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. 

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.