ఇంటర్నెట్ వినియోగంపై ప్రభుత్వ పెత్తనం అక్కర్లేదు

Publish Date:Apr 14, 2015

Advertisement

 

ప్రపంచదేశాలలోకెల్లా భారతదేశంలోనే అత్యంత వేగంగా మొబైల్, ఇంటర్నెట్ వాడకం పెరుగుతోందణి గణాంకాలు చెపుతున్నాయి. అందుకే ఇప్పుడు మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలు అందించే అనేక పెద్దపెద్ద కంపెనీలు భారతదేశానికి క్యూ కడుతున్నాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మొబైల్, ఐటి కంపెనీల స్థాపనకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. ఆంద్ర, తెలంగాణా, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలలో డిల్లీ, చెన్నై, ముంబై, కోల్ కతా, హైదరాబాద్ వంటి అనేక ప్రధాన నగరాలలో బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వాలు ఉచిత వైఫీ సౌకర్యం కల్పిస్తున్నాయి.

 

దేశంలో ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలు మరింత ఎక్కువగా, వేగంగా అందుబాటులోకి తీసుకురావాలంటే దానిపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా తగ్గించడం లేదా పూర్తిగా వదులుకోవడమే సరయిన మార్గమని మోడీ ప్రభుత్వం గట్టిగా విశ్వసిస్తోంది. అందుకోసం డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ శాఖకు చెందిన నిపుణులతో కూడిన ఒక కమిటీని కూడా ఇటీవల నియమించింది. ఆ కమిటీ ఇందుకు అవసరమయిన సలహాలు, సూచనలు, మార్గదర్శకాలతో కూడిన ఒక నివేదికను ప్రభుత్వానికి వచ్చేనెల రెండవ వారంలోగా ఒక నివేదికను సమర్పిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన చట్టం రూపొందిస్తుందణి కేంద్ర ఐ.టి. శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలియజేసారు.

 

ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వం అజమాయిషీ వదులుకోవాలనుకోవడం సంబంధిత సంస్థలు, ప్రజలు కూడా హర్షించవచ్చును. కానీ దానిపై ఎంతో కొంత ప్రభుత్వ నియంత్రణ లేకపోయినట్లయితే, దాని వలన చాలా అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది. ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పుడే అనేక అత్యంత ప్రమాదకర, హానికర సమాచారం సరఫరా అవుతోంది. దానివలన దేశంలో ఎన్నడూ ఊహించలేని అనర్ధాలు ఎన్ని జరుగుతున్నాయో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. అటువంటప్పుడు ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ లేకపోయినట్లయితే అది ఇంకా చాలా ప్రమాదకర పరిస్థితులు సృష్టించవచ్చును. లేదా ఊహించలేని సరికొత్త సమస్యలు సృష్టించవచ్చును.

 

కొన్ని ప్రముఖ సెర్చ్ ఇంజన్లు, వెబ్ సైట్లు యువతను తప్పు ద్రోవలోకి వెళ్లేలా చేస్తున్నాయని చైనాతో సహా అనేక దేశాలు వాటిని నిషేధం విదించాయి. ఆ కారణంగానే అనేక దేశాలలో నేటికీ ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ తప్పనిసరవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఇంటర్నెట్ వ్యవస్థపై ఉన్న కొద్దిపాటి నియంత్రణను ఎత్తివేసినట్లయితే దాని వలన మేలు కంటే కీడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.

 

కనుక అటువంటి ఆలోచనచేసే కంటే ఇంటర్నెట్ వినియోగదారులకు మరింత చౌకగా సేవలు ఉపలబ్దమయ్యేందుకు అవసరమయిన చర్యలు చేపడితే బాగుంటుంది. అదేవిధంగా ఇంటర్నెట్ వినియోగదారులు రకరకాల కంప్యూటర్ వైరస్ ల నుండి తమ డాటాను కాపాడుకొనేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయవలసి వస్తోంది. అదేవిధంగా దేశంలో ఇంటర్నెట్ వినియోగంతో బాటు సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, ఆన్ లైన్ వ్యవహారాలూ చేసేవారు హ్యాకర్ల భారీన పడి చాలా నష్టపోతున్నారు. వారందరూ తమ సమస్యలను ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక మౌనంగా నరకం అనుభవిస్తున్నారు. దేశ ప్రజలందరికీ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో తేవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించడం మంచిదే. అందుకోసం ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేయాలని ఆలోచించడం కంటే ఇటువంటి సమస్యలకు పరిష్కారం కోసం అవసరమయిన యంత్రాంగం, సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లయితే ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ ఉన్నప్పటికీ శరవేగంగా దేశంలో వ్యాప్తి చెందుతుంది. అలాకాక హడావుడిగా ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటే చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం వలన ఏమీ ప్రయోజనం ఉండబోదు.

By
en-us Political News

  
ఇప్పుడు బీజేపీ సమాజ్‌వాదీ పార్టీని నిట్టనిలువుగా చీల్చేందుకు. ఆ పార్టీ ఎంపీలకు గాలం వేస్తున్నట్లు రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ మంత్రి, బీజేపీ మిత్రపక్ష నేత అయిన ఓం ప్రకాష్ రాజ్‌భర్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఏ క్షణంలోనైనా అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వారీ పార్టీ ఎంపీలు కమలం గూటికి చేరే అవకాశాలున్నాయన్న చర్చకు బలం చేకూరుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా నగరంగానే కాకుండా.. ప్రపంచస్థాయి పెట్టుబడులకు, అత్యాధునిక సాంకేతికతకు కేంద్రబిందువుగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. గతంలో హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన ఆయన ఇప్పుడు అమరావతిని అంతకు మించి.. అన్నట్లుగా ముందుకు తీసుకువెడుతున్నారు.
దేశంలో లోక్‌సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్‌పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది.
2024 ఎన్నికలలో ఆయన వైసీపీ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ.. ఆయన శైలిలో ఇసుమంతైనా మార్పు రాలేదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పరిపాలనను పూర్తి చేసుకున్న తరుణంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేందుకు ఎంచుకున్న అంశాలు.. ఆయనను నవ్వుల పాలు చేసేవిగా ఉన్నాయని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేస్తున్నారు.
జగన్ ను రానున్న రోజులలో న్యాయపరమైన చిక్కులు చుట్టుముట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ చిక్కుల కారణంగా ఆయన రాజకీయంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన కొన్ని కీలక అంశాలు ఇప్పుడు ఆయనకు అవరోధాలుగా మారే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగినట్లుగా చెబుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు.
చంద్రబాబు నాయుడు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బాధ్యతల కాంచర్ల శ్రీకాంత్‌ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే కుప్పంలోని ద్వితీయ శ్రేణి నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో శ్రీకాంత్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పి.ఎస్. మునిరత్నం, డాక్టర్ సురేష్ బాబు, కాంచర్ల శ్రీకాంత్ ల మధ్య సమన్వయ లోపం ప్రస్ఫుటంగా బహిర్గతమైంది.
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.