అమలాపురం అల్లర్ల వెనక సర్కార్ హస్తం

Publish Date:May 25, 2022

Advertisement

అనాలోచిత, బాధ్యతా రహిత ప్రభుత్వ నిర్ణయాలు, ఎలాంటి అనర్ధాలకు దారి తీస్తాయో చూపేందుకు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడేళ్ళ పాలనలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. జగన్  రెడ్డి మూడేళ్ళ  తిరగేస్తే అడుగు కొకటిగా అనేక ఉదాహరణలు కపిస్తాయి. పంచాయతీ కార్యాలయాలకు వైసీపే జెండా రంగులు వేయడం మొదలు మూడు రాజధానుల నిర్ణయం వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు, వివాదంగా మారాయి.

ఆందోళనలకు దారి తీశాయి  న్యాయస్థానాలకు చేరాయి. ఇంచుమించుగా అన్ని కేసులలోనూ, సర్కార్ వెనక్కి తీసుకోక తప్పలేదు. వందల కోట్లు కాదు వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఈ క్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ తాజా ఉదాహరణగా నిలుస్తుంది. రెండు సంవత్సరాల తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ఆయనని సర్వీస్’లోకి తీసుకోక తప్పలేదు. ఇదొక తాజా ఉదాహరణ మాత్రమే, ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు ఇంకా అనేకం.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనుభవ రాహిత్యం, 151 మంది ఎమ్మెల్యేల బలముందనే రాజకీయ దురహంకారం, ఈ అన్నిటినీ మించి ముఖ్యమంత్రి  సహజ నైజం,  

ఈ   అన్నీ ఒకదానికి ఒకటి తోడై ప్రభుత్వ నిర్ణయాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక అనర్ధాలకు దారి తీస్తున్నాయి.  ఇందులో భాగమే ఇప్పుడు, కోనసీమ జిల్లా పేరు విషయంలో ప్రభుతం తీసుకున్న అనాలోచిత నిర్ణయం సృష్టించిన అరాచకం. అందుకే అమలాపురంలో చెలరేగిన హింసకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   నిజం అమలాపురం అల్లర్లు తీరు, ప్రభుత్వ స్పందన చూస్తే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నట్లుగా అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్‌ విధ్వంసమని వేరే చెప్పనవసరం లేదు. నిజానికి ఈ మొత్తం వ్యవహరం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, ప్రణాళిక బద్దంగా నడిపించిన నాటకం అని, ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు.  సెక్షన్‌ 144 అమలులో ఉన్నప్పుడు, నలుగురు వ్యక్తులు ఒక దగ్గర చేరితేనే పోలీసులు జోక్యం చేసుకుంటారు.

అలాంటిది అమలాపురంలో, సెక్షన్‌ 144 అమలులో ఉండగానే, వందల మంది వీదుల్లోకి రావడమే కాదు, మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారు. అయినా  అక్కడా, ఇక్కడా పోలీసులు ప్రేక్షక పాత్రనే పోషించారు. అందుకే,  ఈ దాడులు సర్కార్ స్పాన్సర్డ్ దాడులని  అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంత్రి ఇంటిని దుదగులు తగల పెట్టారంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఎందుకు భద్రత కల్పించలేకపోయారని అడిగారు. అమలాపురం ఘటన వెనుక ప్రభుత్వమే ఉందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. హత్య ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ విధ్వంసమని అన్నారు. ప్రజల దృష్టి మళ్లించడం డైవర్షన్‌ సీఎంకు బాగా అలవాటని యెద్దేవా చేశారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్‌ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.అది ధర్మాగ్రహం. ముఖ్యమంత్రి కోనసీమ పై ఎందుకనో కట్టి కట్టారు, అది రాజకీయ ఆరోపణ కాదు, నిజం. అందుకే ఆ ఆరోపణలో నిజం ఉందని కోనసీమ వాసులే కాదు రాష్ట్ర ప్రజలు అందరూ ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.  

అలాగే  ప్లాన్‌ ప్రకారమే కోనసీమలో అల్లర్లు సృష్టించారని బీజేపీ నేత సత్యకుమార్‌ ఆరోపించారు. మంత్రి ఇంటినే దహనం చేశారంటే రాష్ట్రంలో పరిస్థితి అర్థమవుతోందన్నారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే దాడులు చేశారని మండిపడ్డారు. కోనసీమ కుట్రలో అధికార పార్టీ భాగస్వామ్యం ఉందని అన్నారు. వైసీపీ నేతల్లో కొందురు దాడులను ప్రేరేపిస్తున్నారని విశ్వరూప్‌ అన్నారని తెలిపారు. మరో బీజేపీ నాయకుద రాజయ్ సభ సభ్యుడు, జీవీఎల్ నరసింహ రావు వైకాపాకు అంబేడ్కర్‌ పట్ల గౌరవం ఉంటే,  నవరత్నాలకు ఆయన పేరు పెట్టొచ్చుగా అని ప్రశ్నించారు. అంబేడ్కర్‌ పేరును ఈ ప్రభుత్వం రాజకీయ వివాదంలోకి లాగిందని ఆరోపించారు. విపక్షాల ఆరోపణల విషయం ఎలా ఉన్నా, జగన్ రెడ్డి ప్రభుత్వం గత చరిత్రను చూసినా, కోనసీమ వివాదానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.