Publish Date:Apr 30, 2025
చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా ఉంది వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తీరు. ఎంపీగా ఉండగా ఆయన తన పనితీరు కంటే న్యూడ్ వీడియోద్వారానే ఎక్కువ మందికి తెలిశారు. అంతకు ముందు పోలీసు అధికారిగా ఉండగా తెలుగుదేశం నాయకులపై తొడకొట్టి సవాల్ చేసి జగన్ దృష్టిలో పడి ఎంపీ టికెట్ కొట్టేసి గెలిచేసిన గోరంట్ల మాధవ్.. ఆ తరువాత కూడా తరచూ వివాదాలతోనే జనం నోళ్లలోనానారు.
ఒక యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టును ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా గోరంట్ల మాధవ్ అడ్డుకుని చేబ్రోలు కిరణ్ పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకున్న పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్శించారు. దీంతో పోలీసులు గోరంట్ల మాధవ్ ను అరెస్టు చేసి గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్ర వరం సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. ఈ నెల 10 నుంచీ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గోరంట్ల మాధవ్ బెయిలుపై విడుదలయ్యారు. విడుదలైన గంటల వ్యవధిలోనే తన నోటికి పని చెప్పారు. గతంలో పోలీసు అధికారిగా పని చేసిన గోరంట్ల మాధవ్ పోలీసుల విధులను అడ్డుకోవడం, వారిపై దాడికి పాల్పడడం నేరాలని తెలియంది కాదు. కానీ ఆ పనే చేసి అరెస్టయ్యారు. కానీ ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు ప్రతీకార రాజకీయాలంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
కటకటాలు లెక్కపెట్టినా ఆయన తీరులో మార్పు రాలేదు. వాస్తవానికి వైసీపీ నేతలలో అత్యధికులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, బూతులతోనే ఎక్కువగా గుర్తింపు పొందారు. అలా ఒక నెగటివ్ ఇమేజ్ తో పాపులర్ అయిన వైసీపీ నేతలలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. తాజాగా ఆయన జైలు నుంచి షరతులతో కూడిన బెయిలుపై విడుదలయ్యారు.
మాజీ పోలీసు అధికారి అయిన మాధవ్.. ఇప్పుడు గుంటూరు పోలీసు స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాలి. కోర్టు విధించిన షరతులలో ఇది ఒకటి. అయినా గోరంట్ల మాధవ్ తీరు మారలేదు. ఇలా జైలు నుంచి బయటకు వచ్చారో లేదో అలా చంద్రబాబుపై నోరు పారేసుకున్నారు.
చంద్రబాబు ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించిన గోరంట్ల మాధవ్ అన్నిటినీ గుర్తుపెట్టుకుంటాం. మా పిక్క మీద వెంట్రక కూడా పీకలేరంటూ ఇష్టారీతిగా మాట్లాడారు. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అప్పుడు చంద్రబాబుకు, ఆయన మనుషులకు గట్టి గుణపాఠం చెబుతామంటూ హెచ్చరిక జారీ చేశారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు సంగతి చూస్తాం అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ లో చ ర్చనీయాంశంగా మారింది. చింత చచ్చినా పులుపు చావలేదంటూ నెటిజన్లు గోరంట్ల మాధవ్ పై సెటైర్లు పేలుస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gorantla-madhav-contrvesial-comments-on-cbn-again-39-197198.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.