Publish Date:Aug 11, 2022
న్యూఢ్ వీడియో కాల్ విషయంలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను కాపాడేందుకు ఏపీ సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా
విచారణే జరపకుండా పోలీసులు గోరంట్ల మాధవ్ కు మీడియా సమావేశం పెట్టి మరీ క్లీన్ చిట్ ప్రయత్నం చేసినా… అవన్నీ ఏ మాత్రం ఫలించలేదు. గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఢిల్లీ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏపీ పరువును నిలువునా తీసేసింది.
వైసీపీ సర్కార్ నిర్వాకంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ జస్బీర్ సింగ్ గిల్ … లోక్సభ స్పీకర్, మహిళా కమిషన్ చైర్ పర్సన్, ప్రధాని మోడీలకు గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తూ లేఖలు రాశారు. గోరంట్ల మాధవ్ తీరుతో పార్లమెంటు పరువు రోడ్డున పడినట్లైందనీ, పార్లమెంటు సభ్యులకు ఎంపీలకు మాయని మచ్చలామారిందనీ అన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. గోరంట్ల మాధవ్ తన ఛండాలమైన పనితో ఎంపీ అబ్రివేషన్ నే మారిపోయేలా చేశారనీ, అందరూ ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారని జస్బీర్ సింగ్ గిల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీ ఎంపీలు కూడా గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మాట్లాడుతున్న మాటలు పార్లమెంటు పరువుతీసేలా ఉన్నాయన్నారు.
ఎంపీ భరత్.. గోరంట్ల మాదవ్ వీడియోను ఫోరెన్సిక్ను పంపామని ఒకసారి, అలాంటిదేమీ లేదని మరోసారి చెబుతున్నారని, ఇలా ఆ పార్టీ ఎంపీలు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. తక్షణం విచారణ జరిపించి పార్లమెంట్ ఔన్నత్యం కాపాడాలని కోరారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gorantla-changes-the-abrivation-of-mp-says-jasbir-singh-39-141781.html
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.