మంచి ఆహారం అంత మంచిది కాకపోవచ్చు!

Publish Date:Jul 6, 2016

Advertisement

 

 

మంచి ఆహారం అంత మంచిది కాకపోవచ్చు!

 


నలుగురూ నడిచేదారే సవ్యమైనది కాకపోవచ్చు. అందరూ మంచి అని నమ్మేదే నిజం కావాలన్న నియమం ఏదీ లేదు! ఆహారంలో పోషకాల విలువలకి సంబంధించి కూడా ఇదే విషయం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. సాధారణ పౌరులంతా ఆహా ఓహో అనుకునే ఆహారాలలో అంత పటుత్వం ఉందని చెప్పలేమంటున్నారు. ఈ విషయాన్ని రుజువు చేయడం కోసం ‘న్యూయార్క్‌ టైమ్స్’ పత్రిక ఓ పరిశోధనను చేసింది. అదేమిటంటే...

 

ఆహారంలో పోషక విలువలకు సంబంధించి, అమెరికాలోని ఒక రెండువేల మంది పౌరుల అభిప్రాయాలను సేకరించింది న్యూయార్క్‌ టైమ్స్‌! ఒక యాభైకి పౌగా ఆహార పదార్థాల జాబితాను వీరికి అందించి వీటిలో ఏ పదార్థానికి ఎంత ప్రాముఖ్యతని ఇస్తున్నారో తెలియచేయమంది. మరోవైపు ఒక 672 మంది పోషకాహార నిపుణులను కూడా సంప్రదించింది. పౌరులకు అందించిన ఆహారపదార్థాల జాబితానే ఈ నిపుణులకు కూడా అందించింది. ఆ జాబితాలో ఉన్న పదార్థాల మీద వారి అభిప్రాయమూ సేకరించింది.

 

 

పోషక పదార్థాలకు సంబంధించి ఇటు పౌరులకీ, అటు పోషకాహార నిపుణులకి ఉన్న అభిప్రాయాలలో భూమ్యాకాశాలకు ఉన్నంత వ్యత్యాసం కనిపించింది. ఉదాహరణకు ఈ మధ్య కాలంలో రకరకాల పప్పులతో రూపొందిస్తున్న ఎనర్జీ బార్స్‌ (granola bars) అద్భుతమైన పోషకాలను అందిస్తాయని 71 శాతం పౌరులు భావిస్తే, కేవలం 28 శాతం నిపుణులు మాత్రమే ఈ వాదనతో ఏకీభవించారు. దీనికి పూర్తివ్యతిరేకంగా ద్రాక్షసారాయి (Wine) ఆరోగ్యానికి మంచిదని 70 శాతం మంది నిపుణులు అనుకుంటే, కేవలం 52 శాతం పౌరులు మాత్రమే ఈ అభిప్రాయానికి అనుకూలంగా ఉన్నారు. అలాగని అన్ని ఆహారపదార్థాల విషయంలోనూ ఈ వైరుధ్యం కనిపించింది అనుకోవడానికి లేదు. పాప్‌కార్న్‌, జున్ను, పాలు వంటి పదార్థాలు ఆరోగ్యానికి మంచివని అటు నిపుణులూ, ఇటు పౌరులూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఇంతకీ పౌరులు, నిపుణుల అభిప్రాయాల మధ్య ఇంత వైరుధ్యం ఎందుకు తలెత్తినట్లు! అంటే దానికి చాలా కారణాలే చెబుతున్నారు పరిశోధకులు.

 

- ఆహారపదార్థాలలో పైపైన కనిపించే మెరుగులకి పౌరులు ఆకర్షింపబడతారే కానీ అందులో అంతర్గతంగా ఉన్న అంశాల జోలికి పోరు. ఉదాహరణకు ఎనర్జీ బార్స్‌లో ఉండే పప్పుల గురించి ఆలోచిస్తారే కానీ ఆ చాక్లెట్లని రూపొందించేందుకు వాడే చక్కెర పదార్థాలని పట్టించుకోరు.

 

- పౌరుల ఆలోచనాతీరు ఎక్కువగా ప్రకటనల వల్ల ప్రభావితం అవుతూ ఉంటుంది. ఉదాహరణకు... నారింజరసం తాగడం వల్ల వెంటనే శక్తి, పోషకాలు కలుగుతాయని తరచూ ప్రకటనలు వస్తే... అది నిజమే కాబోసు అని వారు నమ్మేస్తారు. కానీ అందులో పీచుపదార్థాలు ఉండవనీ, చక్కెర శాతం అధికమనీ నిపుణులు మాత్రమే గుర్తించగలుగుతారు.

 

- మన రోజువారీ అవసరాలను తీర్చేందుకు ఏఏ పోషకాలు ఏ స్థాయిలో అవసరం అన్న అవగాహన సాధారణ పౌరులకు తక్కువగా ఉంటుంది.

 

కాబట్టి మనం ఆరోగ్యమైన ఆహారం అనుకునేదో, ప్రకటనల్లో కనిపించే అభిప్రాయాలో నిజం అనుకోవడానికి వీల్లేదని ఈ పరిశోధన తేల్చి చెబుతోంది. ఏది నిజమైన పోషకాహారమో తెలియాలంటే నిపుణుల మాట వినాలని హెచ్చరిస్తోంది.

 

- నిర్జర.

By
en-us Political News

  
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.