35 మంది ట్రాఫిక్ పోలీస్ స్కామ్.. అధికారి ఇల్లు అంత బంగారమే..  

Publish Date:Jul 26, 2021

Advertisement

ఈ ప్రపంచంలో మంచి ఎంత ఉందో.. అంతకు రెట్టింతలు  అవినీతి కూడా ఉండనే చెప్పాలి. ఇందుగలడందు లేదని సందేహం కలదు ఎందెందు చూసిన అందండు కలేదు అని కూడా చెప్పొచ్చు.. తాజాగా అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ అధికారి నివాసంలో సోదాల కోసం వెళ్లిన పోలీసులకు అక్కడ దృశ్యాలు చూసి కంగుతిన్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం..? 

ఈ స్క్యామ్ లో దాదాపు 35 మందికిపైగా ట్రాఫిక్ పోలీసుల కీలక పాత్ర పోషించినట్టు అధికారులు గుర్తించారు. ఈ కుంభకోణం దర్యాప్తులో కల్నల్ అలెక్సీ సఫోనోవ్ అనే ఉన్నతాధికారి ఇంటిలో సోదాలు నిర్వహించిన అధికారులు. అతని ఇంటిని చూస్తే అధికారులకు నోటిమాట రాలేదు.  అక్కడ దృశ్యాలు చూసి కళ్లు బైర్లు కమ్మాయి. ఆయన ఇల్లంతా ఎక్కడ చూసిన బంగారంతో నిండిపోయింది.  ఆ ఇంట్లోని ఏవస్తువును పట్టుకున్న బంగారంతో తయారుచేసినవే కావడంతో అవాక్కయ్యారు. అంతే కాదు  బెడ్రూమ్‌, హాలు, కిచెన్‌లోని పలు వస్తువులతోపాటు..చివరికి  బాత్రూమ్ లో కూడా ఆ అధికారి బంగారంతో కట్టించుకున్నాడు.

అంతే కాదండోయి దానికి మ్యాచింగ్‌గా ఫ్లోర్ను కూడా స్పెషల్  మార్బుల్తో డిసైన్ చేయించారు. అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న స్టావ్రోపోల్లో భూతల స్వర్గాన్ని తలపించే ఆ ఇంటి ముందు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. అందులోని ఫర్నీచర్, గోడకు ఉండే ఫ్రేమ్లు, కుర్చీలు, కిచెన్లో ఉండే అలమరాలు, ఇతర సామాగ్రి అంతా బంగారంతో మెరిసిపోతున్నాయి. ఇంటీరియర్ డెకరేషన్ అంతా పసిడితోనే చేయడం గమనార్హం. దర్యాప్తు బృందం ఆ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్ను షేక్ చేస్తోంది. జులై 20న ఆప్లోడ్ యూట్యూబ్ లో చేయగా.. ఇప్పటివరకు 4.37 లక్షల మందికిపైగా వీక్షించారు. కామెంట్స్ కూడా చేస్తున్నారు. 

కల్నల్ అలెక్సీ, అతడి కింద ఉండే ఆరుగురు అధికారులు పెద్ద మొత్తంలో లంచాలకు మరిగారు.. లంచం తీసుకుని  వాహనాలకు ఫేక్ పర్మిట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీని వల్ల స్టావ్రోపోల్లో ఎలాంటి రుసుము చెల్లించకుండా వాహనాలతో సరుకు రవాణా చేయవచ్చు. ఈ క్రమంలోనే వారు భారీగా అవినీతికి తెరతీసినట్టు కేసు నమోదు కాగా.. ఇందులో మరో 35 మంది హస్తం ఉందనే అనుమానులు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే పోలీస్ మాఫియా అని చెప్పొచ్చు.  ఈ క్రమంలో సోదాలకు వెళ్లిన దర్యాప్తు అధికారులు.. ఆ ఇంటిని చూసి షాక్ తిన్నారు. ఈ కేసులో 80 చోట్ల సోదాలు నిర్వహించారు. అలెగ్జాండర్ అర్జ‌నుఖిన్ అనే అధికారి సహా మరి కొందర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలు రుజువైతే అలెక్సీకి సుమారు 15ఏళ్ల జైలు శిక్ష పడుతుందని స్థానిక మీడియోలో కథనాలు వెలువడ్డాయి.

మొత్తానికి ఈ ఘటన రష్యా లో జరిగింది.. ఈ విషయాన్నీ తెలుసుకున్న ప్రొ-క్రెమ్లిన్ యునైటెడ్ రష్యా పార్టీ ఎంపీ అలెగ్జాండర్ ఖిన్‌స్టేన్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో 35 మందికి పైగా ట్రాఫిక్ పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. ‘స్టావ్రోపోల్‌లో కరుడగట్టిన మాఫియా రాజ్యమేలుతోంది.. బ్లాక్ మార్కెట్ నంబర్ ప్లేట్లు, సరుకు రవాణా నుంచి ఇసుక పంపిణీ వరకు ప్రతిదాని నుంచి లాభం పొందుతోంది’ అని ఆరోపించారు. రష్యాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

By
en-us Political News

  
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.
ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు.
ఏదో వాషింగ్ పౌడర్ ప్రకటనలో ‘మరక మంచిదే’ అంటూ వుంటారు. ఈ తరహాలోనే ఒక్కోసారి ‘పొరపాటు కూడా మంచిదే’ అనొచ్చు. అలాంటి మంచి పొరపాట్లు అరుదుగా జరుగుతాయి.
‘ఆశ కురుపులు’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒక భూమి కు సంబంధించిన వివాదంలో  జూనియర్ ఎన్టీఆర్ హై కోర్టును ఆశ్రయించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్.
సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని తేలిపోవడంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫ్రస్టేషన్ లో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ వరుస దాడులకు బరి తెగించింది. ఈసీ జోక్యం చేసుకుని ఆయా జిల్లాలకు చెందిన అధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం , వేటు వేయడం వంటి చర్యలు తీసుకొంటున్నప్పటికీ దున్నపోతు మీద  వర్షం పడ్డట్టు తయారయ్యింది. 
ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో.
హైదరాబాద్ న‌గ‌రంలో మరోసారి డ్రగ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం రేపింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు నగరంలోని కూకట్‌పల్లి ప‌రిధిలోని శేషాద్రినగర్‌లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్‌వోటీ అధికారులు దాడులు నిర్వహించారు.
తమ చిప్‌ని తింటూ వీడియో చేయాలి. తమ చిప్ తిన్న తర్వాత నీళ్ళు తాగకుండా, పంచదార లాంటి ఏ పదార్థాలూ తినకుండా ఐదు క్షణాలు వుండగలగాలి. ఇదీ ఛాలెంజ్.
నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. 
ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్ అయింది. సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు.
గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.