నడుముకి రూ.3.36 కోట్ల బంగారు బెల్ట్! కస్టమ్స్ అధికారులకు చిక్కిన స్మగ్లర్లు

Publish Date:Jun 26, 2026

Advertisement

విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారం తరలించేందుకు స్మగ్లర్లు రోజురోజుకూ కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే స్మగ్లర్ల ఎత్తుగడలను    కస్టమ్స్ అధికారులు చిత్తు చేస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ శంషాబాద్ లోని    రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో   ఇద్దరు ప్రయాణికులు ఏకంగా తమ నడుము చుట్టూ రూ.3.36 కోట్ల విలువైన బంగారం దాచుకుని కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. 

కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఈ ఇద్దరు  ప్రయాణికులపై కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్   అధికారులకు ముందుగానే సమాచారం అందింది. అడ్వాన్స్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ , డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన  సమాచారంతో విమానం దిగిన క్షణం నుంచే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.

ముందుగా వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపో వడంతో ఇద్దరూ ఏమీ జరగనట్లు హుందాగా బయటకు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వారి హావభావాలు, నడవడిక అధికారులకు అనుమానం కలిగించాయి. వెంటనే వారిని పక్కకు తీసుకెళ్ళి తమదైన విచారించగా  అసలు కథ బయటపడింది. వారు ధరించిన ప్యాంట్ల నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన రహస్య పాకెట్లలో తెల్లటి సెలోపేన్ టేపుతో చుట్టిన బంగారం పేస్ట్‌ను బెల్ట్ మాదిరిగా అమర్చినట్లు అధికారులు గుర్తించారు.  స్వర్ణకారుడి సహాయంతో బంగారం పేస్ట్‌ను వెలికితీసి పరీక్షించగా, అది స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారమని తేలింది.

ఈ ఘటనలో మొత్తం 2.271 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా, దాని విలువ సుమారు రూ.3.36 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. ఆ ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసి, ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న ముఠా, బంగారం ఎవరికి చేరాల్సి ఉంది, దీనికి సూత్రధారులు ఎవరు అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.  

By
en-us Political News

  
భీమవరంలో పర్యటించి అక్కడి ఆక్వారైతులతో భేటీ అయిన తరువాత జగన్ బుధవారం మధ్యాహ్నానికి కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి చేరుకున్నారు. ముద్రగడ భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు.
రోడ్డు మార్గం ద్వారా  కిర్లంపూడి చేరుకునివంగత నేత ముద్రగడ భౌతికకాయానికి అంజలి ఘటించి,   వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. 
దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో రోబో ల్యాబ్, సెంట్రల్ కంట్రోల్ రూమ్ ను మంత్రి సందర్శించి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్, ఏవీని వీక్షించారు.
స్థానిక అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సిఎం చంద్రబాబుకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం శాస్త్రోక్తంగా నిర్వహించిన జల పూజలో ముఖ్యమంత్రి పాల్గొని, కృష్ణవేణి, సప్త గోదావరి దేవతలకు నీరాజనాలు సమర్పించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్ర గడ కుటుంబ సభ్యులు  తిరస్కరిం చారు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే కిర్లంపూడిలో అంత్యక్రియలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 
ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది.
ఆదాయపు పన్ను శాఖకు ఐటీఏటీ ITAT షాక్ ఇచ్చింది. మూడో వ్యక్తి వద్ద దొరికిన కాగితాలు, డైరీల ఆధారంగా స్వతంత్ర సాక్ష్యాలు లేకుండా పన్ను డిమాండ్లు విధించడం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్థిక సంవత్సరం 2027 క్యూ1 లో నువోకో విస్టాస్ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ఏకంగా 20% లాభాల వృద్ధి, రికార్డు స్థాయి EBITDA నమోదు కావడంతో బ్రోకరేజ్ సంస్థలు ఈ షేరుపై ఏకంగా 47% అప్‌సైడ్ టార్గెట్‌ను నిర్దేశించాయి. ఆ వివరాలు మీకోసం.
దేశీయ మార్కెట్‌లో ఒక్కసారిగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ యుద్ధ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి 24K, 22K, 18K గోల్డ్ లేటెస్ట్ రేట్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి స్పెయిన్ ఫైనల్ చేరింది. నాకౌట్ మ్యాచ్ లలో కిలియన్ ఎంబాపెపై లామిన్ యమల్ 6-0 తో తన అజేయ రికార్డును ఎలా కొనసాగించాడో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో స్పెయిన్ సంచలనం సృష్టించింది. హాట్ ఫేవరెట్ ఫ్రాన్స్‌ను 2-0 గోల్స్ తేడాతో ఓడించి 2010 తర్వాత తొలిసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
విదేశీ ఆదాయంపై రెండు దేశాల్లో పన్నులు చెల్లించి నష్టపోతున్నారా? ఇన్కమ్ టాక్స్ రూల్ 128 ప్రకారం ఫామ్ 67 (Form 67) ఆన్‌లైన్‌లో ఫైల్ చేసి, ఫారిన్ టాక్స్ క్రెడిట్ FTC ద్వారా భారతదేశంలో మీ పన్ను భారాన్ని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలతో తెలుసుకోండి.
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ. 9,795 కోట్ల భారీ ఐపీఓతో మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్ జీఎమ్‌పీ, సబ్‌స్క్రిప్షన్ వివరాలు మరియు నిపుణుల ఇన్వెస్ట్‌మెంట్ సలహాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.