ప్రేమ వివాహమే ప్రాణాలు తీసింది...గోల్కొండ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Publish Date:Jun 15, 2026

Advertisement

 

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల సంచలనం సృష్టించిన యువకుడి హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహం కారణంగా పెరిగిన కుటుంబ విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

పోలీసుల వివరాల ప్రకారం గోల్కొండలోని కుమ్మరవాడికి చెందిన షేక్ మహబూబ్ అలియాస్ మసూద్ చండి (26) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతడు 2025 జనవరిలో రుక్షార్ బేగమ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ వివాహాన్ని రుక్షార్ సోదరుడు షేక్ జాహెద్ అలియాస్ సోహైల్(28) తీవ్రంగా వ్యతిరేకించాడు. పెళ్లి జరిగినప్పటి నుంచి మసూద్‌పై ద్వేషం పెంచుకున్న సోహైల్ తరచూ గొడవలకు దిగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గత ఏడాది డిసెంబర్‌లో దంపతులకు కుమారుడు జన్మించాడు. అయినప్పటికీ రెండు కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగాయి. ఇటీవల సోహైల్ తన తల్లి షమీమ్ బేగమ్, సోదరి రూబీలతో కలిసి మసూద్ ఇంటికి వెళ్లి గొడవ పడి, తన సోదరిని మసూద్‌తో కలిసి జీవించనివ్వ బోనని, వారిద్దరికీ విడాకులు ఇప్పిస్తానని బెదిరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ క్రమంలో జూన్ 12న మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో షేక్ జాహెద్ అలియాస్ సోహైల్(28)తన బంధువులైన జీషన్ నవాబ్ అలియాస్ జాబర్(30), అమీర్ నవాబ్ అలియాస్ లడ్డు(26/, జాబర్ తల్లి నఫీజ్ సుల్తానా(48)తో కలిసి కుమ్మరవాడిలోని మసూద్ ఇంటికి వెళ్లారు. ఇనుప రాడ్లు, కత్తి, కర్రలతో ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి మసూద్‌పై దాడికి పాల్పడ్డారు.

మృతుడి కుటుంబ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ నిందితులు వారిని తోసిపుచ్చి దాడి కొనసాగించారు. సోహైల్ ఇనుప రాడ్‌తో మసూద్ తలపై బలంగా కొట్టగా, జాబర్ కత్తితో తలతో పాటు శరీరంలోని పలు భాగాల్లో విచక్షణారహితంగా పొడిచినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో లడ్డు, నఫీజ్ సుల్తానా కర్రలతో తీవ్రంగా కొట్టినట్లు వెల్లడించారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన మసూద్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన అతని తండ్రి షేక్ ఇస్మాయిల్‌పై కూడా దాడి చేయడంతో ఆయనకు చేతి, చెంపపై గాయాలయ్యాయి.

మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోల్కొండ పోలీసులు  భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు కింద 103(1), 329(4), 118(1) రీడ్ విత్ 3(5)తో పాటు ఆర్మ్స్ యాక్ట్ 1959లోని సెక్షన్ 25(1A) కింద కేసు నమోదు చేశారు. టోలిచౌకి డివిజన్ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టి జూన్ 13న నలుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి దాడికి ఉపయో గించిన జిమ్ ఇనుప రాడ్, కత్తిని స్వాధీనం చేసుకు న్నారు.ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించడం, కుటుంబ విభేదాలు మరియు వ్యక్తి గత కక్షలే ఈ దారుణ హత్య కు ప్రధాన కారణమని పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

By
en-us Political News

  
ఝార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది.
ప్రతీ నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ...
రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ కేసులో కస్టడీ విచారణ ముమ్మరం...
కరీంనగర్ జిల్లా చొప్పదండి పర్యటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకార సంఘాలకు కీలక సూచనలు చేశారు
క్రికెటర్లు తిలక్ వర్మ, అంబటి రాయుడు, సిరాజ్‌లకు నోటీసులు పంపిన TCA..
హైదరాబాద్‌ పరిధిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది.
రాష్ట్రంలో రెవెన్యూ ఆదాయం తగ్గిపోతున్నా, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం మాత్రం వందల రెట్లు విస్తరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.
జూన్ 17 వచ్చినా దేశంలోని చాలా ప్రాంతాలలో వేసవి వాతావరణమే నెలకొని ఉంది. చురుకుగా కదలాల్సిన నైరుతి రుతుపవనాలు మందగించాయి. సాథారణంగా జూన్ 17 నాటికి దేశ వ్యాప్తంగా 65.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 39.7 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.
భారత్ మరియు అఫ్గానిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ సమరం సరికొత్త మలుపు తిరిగింది.
నిరంజన్ ను చూసేందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ ఆతనితో చాలా సమయం గడిపారు. ఇంట్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ లేవలేని స్థితిలో ఉన్న అభిమానిని చూసి చలించిపోయారు. అతని మంచంపై కూర్చుని ఆత్మీయంగా పలకరించారు. చిన్ననాటి నుంచి మీరంటే అభిమానం అన్న నిరంజన్ మాటలకు పవన్ కదిలిపోయారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన వస్త్రాన్ని అతనికి కప్పి, కళ్యాణం అక్షతలు ఇచ్చి ఆశీర్వదించారు.
ర్యాగింగ్ సంఘటనకు సంబంధించి  ప్రభుత్వ డెంటల్ కాలేజీకి చెందిన 12 మంది ఫైనల్ ఇయర్ సీనియర్ విద్యార్థులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. బాధితులు,  ప్రస్తుతం మొదటి సంవత్సరం  బీడీఎస్  చదువుతున్నారు. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు నివసిస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలోనే ఈ  ర్యాగింగ్ జరిగింది.
మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయస్వామి సభ్యులుగా ఉన్న ఈ సబ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా వచ్చిన ప్రతిపాదనలను, నివేదికలను పరిశీలించింది. బుధవారం జరిగే భేటీలో అధికారుల అభిప్రాయాలను సేకరించి, భవనాల వాడకంపై ఒక స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ సమావేశం అనంతరం.. వచ్చే కేబినెట్ మీటింగ్‌లోనే కమిటీ నివేదిక ఆధారంగా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాజ ఈస్ట్ లేక్ పార్క్ ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. పార్క్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కను నాటారు. అనంతరం పార్క్ మొత్తం కలియతిరిగి వసతులను పరిశీలించారు. సెల్ఫీలు తీసుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.