జావో జగన్.. ఆవో బాబు..!

Publish Date:May 12, 2022

Advertisement

2024 ఎన్నికలు. ఏపీ ఎలా జరగబోతున్నాయి..? గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జగన్ పార్టీ వైసీపీకి వచ్చే ఎన్నికల్లో ఏపీ జనాలు ఎలాంటి సీన్ చూపించబోతున్నారు..? జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడేం చేయబోతున్నారు? కొన్ని మెట్లు దిగి అయినా పొత్తులతో మళ్లీ జయపతాకం ఎగరేస్తారా? గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా ప్రజా సమస్యలపై స్పందిస్తూ జనాల్లో ఉంటున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏం చేయబోతున్నారు..? ఏపీలో ఎప్పుడూ గుర్తింపు పొందని జాతీయ పార్టీ బీజేపీ మద్దతు ఎవరికి..?

ఏపీలో వైసీపీకి గానీ.. సీఎం జగన్ కి గాని 2019 నాటి క్రేజ్ ఇప్పుడు లేదనేందుకు అనేక అంశాలు, సంఘటనలూ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మూడేళ్లకుపైగా అధికారంలో ఉన్న జగన్ పాలనతో ఆయన సత్తా ఏంటో.. వైసీపీ రంగేంటో జనానికి బాగా తెలిసింది. జగన్ వల్ల అభివృద్ధి శూన్యమని.. ధరలు పెరిగిపోయని సామాన్యులు, మధ్యతరగతి జన జీవనం దుర్భరంగా మారినా పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలున్నాయి. జగన్ అనుభవ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనంత దుర్భరం అయింది. కొత్త ప్రాజెక్టులు రావు.. ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావు.. ఏ పని ఎందుకు చేస్తున్నారో తెలియని అయోమయం.

జగన్ సీఎం అయినప్పటి నుంచీ ఏపీ రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. ఉన్న జిల్లాలతో పాలన సరిగా లేకపోయినా కొత్త జిల్లాలు ఏర్పాటు ఎందుకో అంటున్నారు. మంత్రివర్గ పునర్నిర్మాణం.. కొత్త కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు చూస్తే ‘అసలు తక్కువ.. హంగామా ఎక్కువ’ అన్నట్లు ఉందంటున్నారు. జగన్ ఇచ్చే ఉచితాలు లబ్ధిదారులకు కూడా వెగటు కలిగిస్తున్నాయట. జగన్ రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాలో సొమ్ములు నిండుకున్నాయి. ధరల పెరుగుదల జనం నెత్తిన పిడుగులా మారింది. విద్యుత్ సంక్షోభం.. క్షీణించిన శాంతి భద్రతలు.. మహిళలకు రక్షణ లేకపోవడం.. ఫలితాలివ్వని సచివాలయ వ్యవస్థ.. చెత్త పన్ను.. ఎమ్మెల్యేలు.. వైసీపీ నేతల ఆగడాలు లాంటి ఎన్నో మైనస్ లతో.. పూర్ ట్రాక్ తో వైసీపీ ఎన్నికల్ని ఫేస్ చేయాల్సి ఉంది.

 అధికారంలోకి రాక ముందు ఓదార్పు యాత్రతో జనాల్లో తిరిగిన జగన్ దర్శనం సీఎం అయ్యాక కరవైపోయింది. కరోనా.. తుపాను లాంటి అత్యవసర సందర్భాల్లో కూడా జనానికి జగన్ అందుబాటులో ఉన్న సందర్భాలే లేవు. ఇలాంటి ధోరణుల వల్లే జనానికి- జగన్ కి మధ్య దూరం పెరిగిపోయిందనేది వాస్తవం. జగన్ ఏలుబడి పట్ల, వైసీపీ పాలన పట్ల జనానికి ముఖం మొత్తేసిందటున్నారు. మొన్నటికి మొన్న తిరుపతిలో జగన్ సభకు బలవంతంగా తీసుకువచ్చిన డ్వాక్రా మహిళలు సహా అనేక మంది సభా ప్రాంగణం ఫెన్సింగ్ దూకి మరీ పారిపోవడం లాంటి దృశ్యాలు ఇందుకు ఉదాహరణ.

2019 ఎన్నికల్లో అధికారం కోల్పోయినా మొక్కవోని ధైర్యంతో టీడీపీ అధినేత జనం మధ్యలోనే తిరుగుతున్నారు. వైసీపీ సర్కార్ తప్పుల్ని ఎత్తిచూపడంలో, సమస్య వచ్చినప్పుడు తానే రంగంలోకి దిగడం, పార్టీని నడిపిస్తున్న తీరు ఏపీలో మళ్లీ టీడీపీకి పూర్వపు వైభవం వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అంటున్నారు. వయసు పైబడినా.. సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి చంద్రబాబు పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఏపీలో విద్యుత్ సమస్యలపై పోరాడినా.. ఆర్థిక సమస్యల గురించి మాట్లాడినా.. ప్రాజెక్టులపై గళమెత్తినా.. శాంతి భద్రతలు, మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై స్పందించినా.. రహదారుల దుస్థితిపై నినదించినా.. ఆయన ఎక్స్ పీరియన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే చంద్రబాబు తాజాగా చేపట్టిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి జనం నుంచి భారీ స్పందన వస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారో స్పష్టం అవుతోందంటున్నారు విశ్లేషకులు.

పవన్ కళ్యాణ్ కు జనంలో విపరీతమైన క్రేజ్ ఉంది. పవన్ మాటలు జనాన్ని ఆకట్టుకుంటాయి. సమస్యలపై పోరాటాలూ చేస్తారు. ఇవి పవన్ కళ్యాణ్ ప్లస్ పాయింట్లు. 2019లో తనను జనం ఆమోదించకపోయినా వచ్చే ఎన్నికలకు షాట్ రెడీ చేసుకుంటున్నారు పవన్. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ పిలుపు వచ్చే ఎన్నికల్లో కీలకం అంటున్నారు.

2024 ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలో దిగుతుందనుకున్నా పొత్తు కుదుర్చుకుంటే బీజేపీతో జగన్ వెళ్లే అవకాశం ఉందంటున్నారు. కానీ జగన్ తో చేతులు కలిపే సంకేతాలు బీజేపీ నుంచి లేవు. పవన్ మాటలతో టీడీపీ- జనసేన పొత్తుపై కొత్త ఆశలు కలుగుతున్నాయి. జనసేనతో ఇప్పటికే పొత్తున్న బీజేపీ రేపు చంద్రబాబుకు పవన్ దగ్గరైతే ఎలా స్పందిస్తుందో చూడాలి. అదే జరిగితే బాబుతో బీజేపీ మరోసారి దోస్తీకి సిద్ధపడినట్టే. అప్పుడు వైసీపీ అధినేతకు దబిడి దిబిడి తప్పదంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.