ఇండిపెండెంట్ అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తు తొలగింపు?

Publish Date:Apr 30, 2024

Advertisement

గాజుగ్లాసు గుర్తు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలో ఉంది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసిన ఎన్నికల సంఘం ఆ పార్టీ పోటీ చేయని స్థానాలలో మాత్రం ఆ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించింది. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

పొత్తులో భాగంగా జనసేన రాష్ట్రంలో 21 అసెబ్లీ, 2 లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తున్నది. మిగిలిన స్థానాలలో  కూటమిలోని మిగిలిన పార్టీల అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన పోటీలో లేని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఇండిపెండెంట్ అభ్యర్థులకు కేటాయించడం కూటమి అభ్యర్థులకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ జనసేన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గాజు గ్లాసు గుర్తును  ఇతరులెవరికీ కేటాయించవద్దని కోరుతూ తాము ఎన్నికల కమిషన్ ను కోరినట్లు పేర్కొన్నది. ఒక సారి కాదు రెండు సార్లు ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ను కోరామని పేర్కొంది. జనసేన పోటీ లో లేకపోయినా ఆయా నియోజకవర్గాలలో పోటీలో ఉన్న కూటమి అభ్యర్థులకు ఇండిపెండెంట్లకు గాజుగ్లాసు గుర్తు కేటాయించడం వల్ల నష్టం జరుగుతుందనీ, ఓటర్లలో కన్ఫ్యూజన్ కు కారణమౌతుందనీ పేర్కొంది. ముఖ్యంగా జనసేన పోటీ చేయని స్థానాలలో ఇండిపెండెంట్లుగా నిలబడిన రెబల్ అభ్యర్థులకు ఈ గుర్తు కేటాయించడం కూటమి అభ్యర్థుల అవకాశాలపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.  

దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఇటువంటి వినతులపై 24 గంటలలో నిర్ణయం తీసుకుంటుదని పేర్కొన్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు జనసేన పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా ఇదే అంశంపై తెలుగుదేశం కూడా సప్లిమెంటరీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల కమిషన్ ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోలేదనీ, ఏమీ చెప్పకపోవడం అంటే నిరాకరించడం కాదనీ పేర్కొనడాన్ని పరిగణనలోనికి తీసుకున్న కోర్టు విచారణను బుధవారం (మే1)కి వాయిదా వేసింది. 

By
en-us Political News

  
సింగపూర్ ఎయిర్​లైన్స్​కు చెందిన ఓ విమానం ఆకాశంలో తీవ్రమైన కుదుపునకు లోనవ్వడం వల్ల ఓ వ్యక్తి మరణించారు. మరో 30 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు సమాచారం. లండన్​ నుంచి సింగపూర్ వెళ్తున్న  విమానంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు సింగపూర్ ఎయిర్​లైన్స్ సంస్థ వెల్లడించింది.
నేను చెప్పింది జరగకపోతే జనం నా ముఖం మీద పేడ కొడతారు. అదే, నేను చెప్పింది జరిగితే ఆ పేడ జగన్ ముఖాన పడుతుంది అన్నారు.
ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందడం మీద అనేక సందేహాలు ముసురుకుంటున్నాయి.
తెలంగాణా రాష్ట్రంలో ఉన్న 10 విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. అయితే, పారిపాలనా సౌలభ్యం కోసం ఉన్న వారికే ఇంచార్జీలుగా బాధ్యతలు ఆప్పగిస్తారా? లేదా ఐఎఎస్‌లను ఇంచార్జీలుగా నియమిస్తారా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
ఏపీలోని తూర్పు గోదావ‌రి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పెండ్యాల వెంక‌ట కృష్ణారావు (కృష్ణ‌బాబు) అనారోగ్యంతో మృతిచెందారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఇవాళ తెల్లవారుజామున కృష్ణ‌బాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. 
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులు కావడంతో గత నాలుగు రోజుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారి ద‌ర్శ‌నం కోసం క్యూక‌డుతున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు కిలో మీటర్ల మేర బారులు తీరుతున్నారు. ఇలా భ‌క్తుల తాకిడి పెర‌గడంతో టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్ల జారీని తిరిగి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించింది. ఈ నిర్ణయంతో భక్తుల రద్దీ ఉన్నాస‌రే.. శ్రీవారిని దర్శించుకునే సమయం తగ్గనుంది.
అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక, విద్య, ప్రణాళిక, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, సేవలు, స్థానిక సంస్థలు, భూమి & భవనాలు, ఉన్నత విద్య, శిక్షణ & సాంకేతిక విద్య, విజిలెన్స్, సహకార సంఘాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ వంటి అనేక ముఖ్యమైన విభాగాలకు సిసోడియా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు.
ఈసారి లోకేష్‌కి 60 వేల ఓట్ల మెజారిటీ పక్కా అని తెలుగు తమ్ముళ్ళు ఢంకా బజాయించి చెబుతుంటే, వైసీపీ సానుభూతిపరులు మాత్రం తమ అభ్యర్థి ఆర్కే మీద సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మహత్య సదృశ్యం జగన్ రెడ్డి పరిపాలనాని అంటారు సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాదం. తిరుపతి, అనంతపురం, మాచర్లలో జరిగిన అల్లర్ల, విధ్వంసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్లు ధ్వంసం చేసిన ఘటనలో వైసిపి పాత్ర వుంది. వీటన్నింటిపై సిట్ దర్యాప్తు జరుగుతుంది.
కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడానికి ఎన్‌ఫోర్స్.మెంట్ డైరెక్టరేట్ అవకాశం కల్పించిది. తద్వారా ఈడీ ద్వారా కవితకి బర్త్ డే గిఫ్ట్ అందించింది.
ఇజ్రాయెల్ శత్రువు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా అంతమొందించే శక్తి సామర్థ్యాలు మొసాద్ కు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం! గతంలో ఇజ్రాయెల్ శత్రువులు వివిధ ఘటనల్లో చనిపోయారు. వాళ్లలో ఇరాన్ కు చెందిన అణు పరిశోధకులు కూడా ఉన్నారు. కచ్చితంగా ఫలానా వాళ్లు చంపారనే ఎలాంటి ఆధారాలు లేని రీతిలో వాళ్లు కడతేరిపోయారు. ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడంలో మొసాద్ దిట్ట!
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుపై ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు హైదరాబాద్ లో రెయిడ్స్ చేపట్టారు. మంగళవారం ఉదయాన్నే ఆశోక్ నగర్ లోని ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసానికి చేరుకున్న అధికారులు.. ఏసీపీ నివాసంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్ లోని ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు మొత్తంగా సిటీలో ఆరుచోట్ల సోదాలు చేస్తున్నారు.
చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నట్టు.. వైసీపీ దండుపాళెం బ్యాచ్ తమ కర్మఫలాన్ని అనుభవించడం కోసం రోజులు లెక్కపెట్టుకుంటోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.