Publish Date:Aug 30, 2022
కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యపరుస్తాయి. వయసుతో నిమిత్తం లేకుండా ఆయా సంఘటనల్లో పిల్ల లూ హీరోలయిపోతుంటారు. ఊహించని సంఘటనల్లో ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచనలతో వెంటనే స్పందించడం అనేది అవతలివారికి ఎంతో మేలు చేస్తుంది. గెవిన్ తన తల్లిని కాపాడాడు.
పదేళ్ల గెవిన్ ఏం చదువుతున్నాడు, బడికి సరిగా వెళుతున్నాడా, గుడ్ స్టూడెంటా.. అనే ప్రశ్నలతో చుట్టు పక్కలవారూ, పక్కంటి పిన్నిగారూ వేధించలేదు. గెవిన్ ని తమ ఊరు హీరో అనేశారు. పిల్లవాడయినా ఎంత వేగంగా, చురుగ్గా ఆలోచించాడమ్మా.. అనుకున్నారు వెనకింటి బామ్మగారు, ఎదురింటి బాబాయి గారూ .. పిల్లడు పదేళ్లవాడయితేనేమి.. వాళ్ల డాడీ ఇవ్వాల్సిన రక్షణ వాడే చేసేడన్నారంతా.
ఓక్లహామాలో ఓ చిన్న కుటుంబం. తల్లీ, పిల్లడూ స్విమింగ్పూల్లో ఆడుకోవడం ఓ సరదా. కానీ మొన్నీ మధ్య తల్లి ఒక్కతే స్విమింగ్పూల్లో దిగింది. పిల్లడు ఎక్కడో ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆమె మామూ లుగానే పాడుకుంటూ తిరుగుతూంది. పిల్లాడి కోసం ఎదురుచూస్తోంది. పిలుద్దామనే అనుకుంది. కానీ అంతలోనే హఠాత్తుగా ఆమె పల్టీకొట్టింది. ఊపిరాడనంత పనయింది. నీళ్లు మింగేసింది. నీటిలోకి దిగిపోయేలోగానే అదృష్టం ఆమెను రక్షించింది. సరిగ్గా అప్పుడే ఆమె పదేళ్ల పిల్లవాడు గెవిన్ అటుగా వచ్చాడు. తల్లి అరుపులు విని పరుగున స్విమ్మింగ్పూల్లోకి అమాంతం దూకేశాడు. చిత్రమేమంటే ఆమెను బయటికి లాగేయగలిగాడు. అదీ ఆమె మొహాన్ని నీటి పైకి పట్టుకుని పూల్ చివర ఉన్న మెట్లమీద వరకూ తీసుకువచ్చి ఆమెను పైకి లాగేడు. అంతలో తండ్రి పరుగున వచ్చాడు.
ఇదెలా సాధ్యం.. అన్న ప్రశ్నకంటే పిల్లాడు ప్రదర్శించిన తెలివినే అందరూ మెచ్చకున్నారు. నీటిలో మునిగిపోతున్న తల్లి అరవగానే దూకడం సరే. కానీ అంత మనిషిని వాడు మెడపట్టుకుని తలను నీటి పైనే ఉంచేట్టు చేసి తీసుకురావడమే గొప్ప విషయమని అన్నారంతా. మనూళ్లో అయితే దీన్నే దైవేచ్ఛ అనేవారు. ఏమయినప్పటికీ ఓక్లహామాలో గెవిన్ నివాస ప్రాంతంలో మాత్రం గొప్ప హీరోగా అందరి మెప్పూ పొందుతున్నాడు.
ఆ తల్లి ఫేస్బుక్లో తన గెవిన్ తనకు దేవుడు అంటూ రాసింది. వాడివల్లే మళ్లీ ఊపిరిపీల్చుతున్నా నన్న ది. వాడు నాకు మరో జన్మని ప్రసాదించాడన్నది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gevin-saved-his-mother-39-142938.html
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.