గౌతీ ఫ్యామిలీ @ సింగపూర్

Publish Date:Mar 26, 2026

Advertisement

టీమ్ ఇండియా హెడ్ కోచ్  గౌతమ్ గంభీర్ సింగపూర్ లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. తన కుమార్తెలు అజీన్, అనైజా, భార్య నటాషాలతో సింగపూర్ లో హాలీడే మూడ్ లో విహరిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా విజయం వెనుక గౌతం గంభీర్ వ్యూహాలు ఉన్నాయి. జట్టును సమతూకంలో ఉంచడంలోనూ, ఆటగాళ్ల ప్రతిభను వంద శాతం రాబట్టడంలోనూ గౌతం గంభీర్ విరామమెరుగకుండా కృషి చేశాడు.  గౌతం గంభీర్ వ్యూహాలు, కఠోర శ్రమ కారణంగా టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా జగజ్జేతగా నిలిచింది. ఇందు కోసం ఎంతో ఒత్తడి తీసుకుని, శ్రమించిన గౌతం గంభీర్  నెక్స్ట్ టోర్నీకి సన్నాహాలు ప్రారంభించడానికి ముందు లభించిన ఈ విరామాన్ని ఫ్యామిలీతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.  

సింగపూర్ వీధుల్లో గంభీర్  సామాన్యుడిగా పెళ్లాం పిల్లలతో విహరిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.   భార్య నటాషా, కుమార్తెలు అజీన్, అనైజాతో కలిసి ఆయన అక్కడి అందాలను తిలకిస్తున్నారు. ఈ సందర్భంగా  తన చిన్న కుమార్తెను భుజాలపై ఎక్కించుకుని వీధుల్లో నడుస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైదానంలో ఎంతో సీరియస్‌గా కనిపించే గంభీర్, వ్యక్తిగత జీవితంలో  అందుకు భిన్నంగా సరదాగా కనిపించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.    2007లో ఆటగాడిగా టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన గౌతం గంభీర్.. 2026లో జట్టు హెడ్ కోచ్ గా టీమ్ ఇండియాకు ప్రపంచకప్ ను అందించాడు.  జట్టును ప్రపంచ విజేతగా నిలిపిన కోచ్‌ల జాబితాలో  లాల్‌చంద్ రాజ్‌పుత్, రాహుల్ ద్రవిడ్ సరసన సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు.  

ప్రస్తుతం ఈ విహారయాత్ర ముగిసిన తర్వాత గంభీర్ తిరిగి తన బాధ్యతల్లో నిమగ్నం కానున్నారు. టీమిండియా తదుపరి షెడ్యూల్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగనున్న సిరీస్‌లో భాగంగా భారత్ ఒక టెస్టు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.  ఆ తరువాత  టీమ్ ఇండియా   ఐర్లాండ్ , ఇంగ్లండ్‌లలో పర్యటించనుంది. వరుస విదేశీ పర్యటనలు ఉన్న నేపథ్యంలో.. మధ్యంలో లభించిన ఈ విరామంలో  గంభీర్‌  మానసికంగా ధృఢంగా తయారు కావడానికి దోహదపడుతుందని అన్నారు.  

By
en-us Political News

  
సౌదీ అరేబియా నైరుతి తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఒక చమురు ట్యాంకర్‌పై  జరిగిన క్షిపణి దాడి ప్రపంచ దేశాలను నివ్వెరపరిచింది.  పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ప్రపంచ ఇంధన రవాణాను సందిగ్ధంలో పడేసింది. 
నీట్ లీకేజీకి వ్యతిరేకంగానూ, అలాగే విద్యా వ్యవస్థలో సంస్కరణలను, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనలకు సంఘీభావం ప్రకటిస్తూ ఆయేషా ఖాన్ బుధవారం ముంబైలో జరిగిన ర్యాలీ, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మూలారామ్, సీమ వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన హత్య కేసుల్లో నేరస్తులుగా రుజువై యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే.. శిక్షా కాలంలో వీరి సత్ప్రవర్తన చూసిన జైలు అధికారులు ఈ ఇద్దరినీ సాధారణ జైలు నుండి మండోర్ ఓపెన్ జైలుకు తరలించింది. ఇక్కడే మూలారామ్, సీమలకు పరిచయం ఏర్పడి, అది స్నేహంగా పెరిగి ప్రేమగా మారింది.
ధవళేశ్వరంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న కందుల జెస్సీ.. అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌కు చేరిన ప్రయాణం ప్రతీ చిన్నారికీ గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
తమ న్యాయమైన హక్కుల కోసం, భవిష్యత్తు రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం, నిర్బంధం వంటి అణచివేత చర్యలకు పాల్పడటం వివాదానికి దారితీసింది. రాజకీయ నాయకులు, సామాజిక వేత్తలు పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
లోహియా కార్ప్ ఐపీఓ ప్రారంభమైంది. రూ. 404 425 ధరల శ్రేణి, 8.47% జిఎంపి లాభాలు, ఆఫర్ ఫర్ సేల్ వివరాలు, కేటాయింపు డేట్లు మరియు బ్రోకరేజ్ సంస్థల విశ్లేషణను ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
హ్యుందాయ్ కార్ల ఫ్యాక్టరీలో బోస్టన్ డైనమిక్స్ అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోల ప్రవేశానికి వ్యతిరేకంగా 39,000 మంది కార్మికులు చేపట్టిన చారిత్రాత్మక సమ్మె, రూ. 1,000 కోట్లకు పైగా ఉత్పత్తి నష్టం మరియు AI రోబోటిక్స్ యుగంలో ఉద్యోగ భద్రత గురించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అమెరికాలోని ఇర్మో పట్టణంలో పోలీసు అధికారుల కంటే ఎక్కువగా ఏఐ నిఘా కెమెరాలను ఏర్పాటు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఫ్లాక్ కెమెరాల డేటా భద్రత, సైబర్ లోపాలు మరియు పౌర హక్కుల ఉల్లంఘనపై ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ మీకోసం.
జెన్ జీ ఉద్యోగులు ఆఫీస్ కంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌లోనే ఎక్కువ ఉత్పాదకత సాధిస్తున్నారని యూగోవ్ సర్వే తెలిపింది. ఆఫీస్ డిస్ట్రాక్షన్స్, వర్క్ సంస్కృతి మరియు ఉత్పాదకతపై 53 శాతం మంది వెల్లడించిన కీలక నిజాలు ఇక్కడ చదవండి.
పవిత్రమైన వివాహబంధం మొగుడూ పెళ్లాల మధ్య అనురాగం, ఆప్యాయత, ప్రేమలతో ముడి పడి ఉంటే పరిస్థితి నుంచి పరస్పరం కక్షలూ కార్పణ్యాలతో బద్ధ శత్రువులుగా మారే పరిస్థితి ఉత్పన్నమౌతోంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే స్టాక్ మార్కెట్ క్రాష్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ పెట్టుబడులు మరియు మాంద్యంలో ధనవంతులుగా మారే రహస్యాలను ఈ స్టోరీలో తెలుసుకోండి.
భారతదేశం రాబోయే పండుగల సీజన్ దృష్టిలో ఉంచుకుని జూలై నుండి అక్టోబర్ వరకు నెలకు 15 లక్షల టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకోవడానికి సిద్ధమైంది. సన్‌ఫ్లవర్, పామ్ ఆయిల్ ధరలు మరియు మార్కెట్ పరిస్థితులపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జొమాటో మాతృ సంస్థ ఎటర్నల్ క్యూ1 ఫలితాల్లో రూ. 92 కోట్ల నికర లాభంతో 268% వృద్ధి నమోదు చేసింది. క్విక్ కామర్స్ విస్తరణ, ఫుడ్ డెలివరీ ఆర్డర్ల విలువ, షేర్ మార్కెట్ విశ్లేషణ పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.