వరదనీటిలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు.!

Publish Date:Jul 9, 2026

Advertisement

మహారాష్ట్ర రాయగఢ్‌ జిల్లాలో   భారీ వర్షాలు,  వరదలు  బీభత్సం సృష్టిస్తున్నాయి.  జనజీవనం పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా, ఇప్పుడు ప్రజల ప్రాణాలకు సరికొత్త ముప్పు వచ్చి పడింది. పణ్వేల్ తాలూకా పరిధిలోని  హెచ్‌పీసీఎల్ పాతాళగంగా ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ వరద నీటిలో మునిగిపోవడంతో అక్కడ ఉన్న సుమారు మూడు వేల గ్యాస్ సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ సిలిండర్లలో పూర్తిగా గ్యాస్ నింపిన వాటితో పాటు, ఖాళీ సిలిండర్లు కూడా ఉన్నాయి. ప్లాంట్ నుంచి కొట్టుకొచ్చిన ఈ వేలాది సిలిండర్లు ఇప్పుడు పాతాళగంగా నదిలోకి, దాని పరిసర ప్రాంతాల్లోకి భారీగా వచ్చి చేరుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. 

నదిలో కానీ, లేదా నదీ తీర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా ఎల్పీజీ సిలిండర్లు కొట్టుకొచ్చి కనిపిస్తే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఆ సిలిండర్లు  లీక్ అయ్యే ప్రమాదం   ఉందని అధికారులు చెబుతున్నారు. ఉత్సాహంతోనో లేక ఉచితంగా దొరికాయనో వాటిని ఇళ్లకు తీసుకెళ్లడం, వాటి రెగ్యులేటర్లను తెరిచేందుకు ప్రయత్నించడం లాంటివి చేస్తే పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

వరద ప్రవాహంలో  కొట్టుకుపోయిన మూడు వేల సిలిండర్లను   సురక్షితంగా స్వాధీనం చేసుకునేందుకు విపత్తు నిర్వహణ బృందాలు, హెచ్‌పీసీఎల్ ప్రతినిధులు నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. నది పరిసర గ్రామాల ప్రజలు ఎవరైనా ఈ సిలిండర్లను గుర్తిస్తే, వాటికి దూరంగా ఉంటూ వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందించాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. వర్షాలు, వరదల ముప్పుతో పాటు ఇప్పుడు  గ్యాస్ సిలిండర్ల ముప్పు కూడా తోడవడంతో రాయగఢ్ జిల్లా యంత్రాంగం  అప్రమత్తమైంది. వ్యవహరిస్తోంది.

maharashtra floods, raigad rain news, 3000 lpg cylinders washed away, patalganga river

By
en-us Political News

  
హస్తం పార్టీలో కొత్త కాక.. సొంత ప్రభుత్వంపైనే మునుగోడు ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు..!
ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌ పై నిర్వహించనున్న తిరంగా ర్యాలీ నేపథ్యం లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు.
హైదరాబాద్‌లోని కేబీహెచ్‌బీ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన చేశారు.
సర్జరీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..అభినందనలు తెలిపిన తారక్..!
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఆవేదనతో అట్టుడుకుతోంది. మట్టిలో కలిసిపోతున్న ఆశలు, కళ్ళముందే జరుగుతున్న అన్యాయం చూసి కన్నీళ్లు పెడుతున్నారు
ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!
ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చే క్రమంలో టాటా గ్రూప్‌నకు చెందిన విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా
తెలంగాణ రాజకీయాల్లో బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మద్యం మత్తులో చోరీ.. చివరికి యజమానికి దొరికిపోయిన..!
హైదరాబాదులో సంచలనం సృష్టించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాజేంద్రనగర్ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
కారు నాదే కానీ రూపాయి ఇవ్వను..బొమ్మకు మురళి సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్ రావు కన్నుమూశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.