గార్డెనింగ్‌తో ఆరోగ్యం!

Publish Date:Jul 4, 2016

Advertisement

 

ఉరుకులు పరుగులు పెట్టే జీవితంలో ఎవ్వరికీ నిమిషం ఖాళీ ఉండటం లేదు. ఇంత వేగంగా సాగే జీవితంలోనూ మొక్కలని పెంచడం అంటే ఇష్టపడేవారు లేకపోలేదు. ఇంటి పెరడులో ఏ కాస్త జాగా ఉన్నా, రోజులో ఏ మాత్రం ఖాళీ ఉన్నా... తోటపనిలో తృప్తిని పొందేవారు కనిపించకపోరు. కానీ తోటపని అనేది కేవలం ఒక వ్యాపకం మాత్రమే కాదనీ, అద్భుతమైన ఆరోగ్యాన్ని సాధించే మార్గం అని అంటున్నారు నిపుణులు. నమ్మనివారి కోసం చాలా కారణాలనే చూపిస్తున్నారు.

 

ప్రశాంతత లభిస్తుంది:  నెదర్లాండ్స్‌ చెందిన కొందరు నిపుణులు ఆ మధ్య ఒక పరిశోధనను చేశారు. అందులో భాగంగా రోజులో ఒక అరగంటపాటు కొందరిని తోటపని చేయమని, మరికొందరిని ఇంట్లోనే ఉండి చదువుకోమనీ చెప్పారు. ఫలితం! తోటపని చేసిన వారి మనసు చాలా ఉల్లాసంగా మారిపోయిందట. పైగా మానసిక ఒత్తిడి కారణంగా ఉత్పత్తి అయ్యే ‘కార్టిసాల్‌’ అనే రసాయనం కూడా వీరిలో తగ్గుముఖం పట్టిందట. ఊబకాయం నుంచి గుండెజబ్బుల వరకూ నానారకాల అనారోగ్య సమస్యలకూ ఈ కార్టిసాల్‌ ఓ కారణం! దీనిని బట్టి తోటపని అమితమైన ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని తేలిపోయింది.

 

అధిక వ్యాయామం:  చాలామంది నడక, సైక్లింగ్‌, ఈత వంటి వ్యాయామాలే అత్యద్భుత ఫలితాలు ఇస్తాయని అనుకుంటారు. కానీ తోటపని ఒకటి ఉందన్న విషయం మర్చిపోతారు. తోటపనిలో మట్టిని తవ్విపోయడం, పాదులు కట్టడం, మొక్కలు నాటడం, కలుపుని ఏరివేయడం... ఇలా చాలా పనే చేయవలసి ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావల్సినంత వ్యాయామం లభిస్తుంది. పైగా ఈ తోటపని చేసే సమయంలో కళ్ల దగ్గర్నుంచీ వేళ్ల వరకూ ప్రతీ అవయవమూ నేర్పుగా పనిచేయాల్సి ఉంటుంది. అంటే శరీరంలోని ప్రతిభాగానికీ ఇది చురుకుదనాన్ని అందిస్తుందన్నమాట! పైగా శరీరం ఎటు పడితే అటుగా వంగే నేర్పునీ అలవరుస్తుంది.

 

విటమిన్‌ డి:  శరీరానికి ప్రకృతి సిద్ధంగా సూర్యరశ్మి నుంచి లభించే పోషకం- విటమిన్‌ ‘డి’. కానీ నాలుగు గోడల మధ్యనే ఉండిపోతున్న జీవనశైలి వల్ల ఈ డి విటమిన్‌ కూడా ఇప్పుడు మనకి దూరమవుతోంది. దీంతో శరీరానికి అవసరమయ్యే కాల్షియంను శోషించుకునే శక్తిని కోల్పోతున్నాము. చర్మవ్యాధుల దగ్గర్నుంచీ చక్కెర వ్యాధి వరకూ... చాలా సమస్యలని అదుపులో ఉంచేందుకు డి విటమిన్‌ అత్యవసరం. తరచూ తోటపని చేయడం వల్ల ఈ డి విటమిన్ మనకు కావల్సినంతగా లభించే అవకాశం ఉంది.

 

మెదడుకీ మంచిదే!:  తోటపనిలో కేవలం శరీరం మాత్రమే కాదు... మెదడు కూడా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి వృద్ధాప్యంతో పాటు వచ్చే అల్జీమర్స్‌, మతిమరపు వంటి సమస్యలకి తోటపని చాలా ఉపయుక్తమట! తోటపని చేసే అలవాటు లేనివారితో పోలిస్తే, ఆ అలవాటు ఉన్నవారిలో మతిమరపు సమస్య దాదాపు 47 శాతం తక్కువగా ఉన్నట్లు ఓ పరిశోధనలో తేలింది.

 

సంతృప్తి:  తోటపని చేసేవారిలో..... తాము ఒక మొక్కకి జీవం పోసామన్న సంతృప్తి, ఆ మొక్కలు పెరుగుతున్నప్పుడు కలిగే సంతోషం ఏ ఆస్తిపాస్తులకీ తీసిపోవు. ఇక తాము నాటిన చెట్ల నుంచి సహజసిద్ధంగా లభించే కూరగాయలు తిన్నప్పుడు ఎలాంటి అనారోగ్యమూ దరిచేరదు. చెట్లని పెంచడం, వాటి మధ్య ఉండటం... మనిషికి తాను కూడా ప్రకృతిలో ఒక భాగం అన్న భావనను కలిగిస్తుంది. ప్రకృతితో ఉండే ఆ అనుబంధంతో అతని ఆయుష్షు మరింతగా పెరుగుతుంది.

 

- నిర్జర.

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.