బాబు పకడ్బందీ వ్యూహం.. గన్నవరం వంశీకి దూరం!

Publish Date:Apr 20, 2024

Advertisement

రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ ఆస్థాన విద్వాంసుల్లో  వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ..  ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌ళ్లీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తున్నారు. గ‌త రెండు ద‌ఫాలుగా తెలుగుదేశం క్యాడ‌ర్ మ‌ద్ద‌తుతో గెలిచిన ఆయ‌న‌కు ఈసారి ఘోర ఓట‌మి ఎదురు కాబోతున్న ద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది.   ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూట‌మి త‌ర‌పున‌ తెలుగుదేశం అభ్య‌ర్థి యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో యార్ల‌గ‌డ్డ వైసీపీ అభ్యర్థిగా వంశీ చేతిలో స్వ‌ల్ప ఓట్లతో ఓడిపోయారు. వంశీ జ‌గ‌న్ శిబిరంలో చేర‌డంతో..  యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరిన‌ నాటినుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు యార్ల‌గ‌డ్డ అందుబాటులో ఉంటూ వ‌స్తున్నారు. మొద‌టి నుంచి గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి  కంచుకోట. దీనికితోడు వంశీని ఓడించేందుకు చంద్ర‌బాబు ప‌క‌డ్బందీ వ్యూహాన్ని అమ‌లు చేశార‌ని,  దీంతో యార్ల‌గ‌డ్డ విజ‌యం న‌ల్లేరుపై బండిన‌డ‌కేన‌నిపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ముఖ సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో మ‌రోసారి ఇక్కడ తెలుగుదేశం విజయం ఖాయమని పేర్కొన్నాయి.  
 
గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌.  1983 త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం జెండా ఎగురుతూ వ‌స్తుంది..మ‌ధ్య‌లో రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు గెలిచిన‌ప్ప‌టికీ వారుకూడా టీడీపీ సానుభూతి ప‌రులే కావ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రంలో వంశీని భారీ మెజార్టీతో ఓడించాల‌ని తెలుగుదేశం శ్రేణులు, చంద్ర‌బాబు అభిమానులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీకి వైసీపీలో చేరిన త‌రువాత తెలుగుదేశం నేత‌ల‌పై నోరుపారేసుకోవ‌టం అల‌వాటుగా మారింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపై వ‌ల్ల‌భ‌నేని అభ్యంత‌ర‌క‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, నారా, నంద‌మూరి కుటుంబాల అభిమానులు వంశీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలోవంశీకి మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లుసైతం వెనుక‌డుగు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వంశీ క్యారెక్ట‌ర్ లేని వ్య‌క్తిఅని, రాజ‌కీయ భిక్షపెట్టిన చంద్ర‌బాబు నాయుడు కుటుంబంపైనే అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపితే ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్నికూడా క్ష‌మించ‌ర‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే పేర్కొటున్నారు. 

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్థిగా వ‌ల్ల‌భ‌నేని వంశీ విజ‌యం సాధించి వైసీపీలోకి వెళ్లిన‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారని ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. వైసీపీలో చేరిన త‌రువాత నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను క‌నీసం ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌ని ప‌లువురు వైసీపీ నేత‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన వంశీని ప‌లువురు స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తున్నారు.   ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీ, కాపు సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌. ఎవ‌రు విజ‌యం సాధించాల‌న్నా ఈ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు కీల‌కం. తెలుగుదేశం, జ‌న‌సేన క‌లిసి పోటీచేస్తుండ‌టంతో  మెజారిటీ కాపుసామాజిక వర్గ ఓటర్లు తెలుగుదేశం అభ్యర్థి  యార్ల‌గ‌డ్డ‌కు మ‌ద్ద‌తు నిలుస్తున్నారు. ఎస్సీలు అధిక‌శాతం తెలుగుదేశంకు మద్దతుగా ఉన్నారు. అలాగే బీసీలు సైతం కూటమికే జై కొడుతున్నారు.   క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు వంశీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. చంద్ర‌బాబు కుటుంబంపై వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వంశీకి ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు వారంతా ఏక‌తాటిపైకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 
 
సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందు కొంత‌కాలంగా వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజ‌కీయాల్లో యాక్టివ్ గా లేరు. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడ‌త‌ల వారిగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. చివ‌రి వ‌ర‌కు వ‌ల్ల‌భ‌నేని వంశీకి అవ‌కాశం ద‌క్క‌లేదు. వైసీపీ నుంచి పోటీచేస్తే ఓడిపోతాన‌ని భావించిన వంశీ.. తాను ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటాన‌ని జ‌గ‌న్ కు చెప్పిన‌ట్లు అప్పట్లో ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే  జ‌గ‌న్ ప్రోద్బ‌లంతో పోటీకి ఒప్పుకోవ‌టంతో చివ‌రి విడ‌త‌లో గ‌న్న‌వ‌రం అభ్య‌ర్థిగా వంశీ పేరును వైసీపీ అధిష్టానం ప్ర‌క‌టించింది.  వారంరోజుల క్రితం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర  గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సాగింది. అయితే , బ‌స్సు యాత్ర‌లో ఆశించిన స్థాయిలో ప్ర‌జ‌లు పాల్గొన‌లేద‌ని నియోజ‌క‌వ‌ర్గం పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో చ‌ర్చ జ‌రుగుతున్నది.   రాజ‌కీయ బిక్ష‌పెట్టిన  చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఓటు ద్వారా గుణ‌పాఠం చెప్పేందుకు ప్ర‌జ‌లంతా సిద్ధ‌మైన‌ట్లు ఉమ్మ‌డి కృష్ణా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మొత్తానికి ఎటుచూసినా ఈద‌ఫా ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓట‌మి ఖాయ‌మ‌ని ప్ర‌ముఖ‌ స‌ర్వే సంస్థ‌లు సైతం తేల్చాయి.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.