బాబు పకడ్బందీ వ్యూహం.. గన్నవరం వంశీకి దూరం!

Publish Date:Apr 20, 2024

Advertisement

రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ ఆస్థాన విద్వాంసుల్లో  వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి  తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ..  ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థిగా మ‌ళ్లీ గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తున్నారు. గ‌త రెండు ద‌ఫాలుగా తెలుగుదేశం క్యాడ‌ర్ మ‌ద్ద‌తుతో గెలిచిన ఆయ‌న‌కు ఈసారి ఘోర ఓట‌మి ఎదురు కాబోతున్న ద‌న్న చ‌ర్చ ఏపీ రాజ‌కీయాల్లో జోరుగా సాగుతోంది.   ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కూట‌మి త‌ర‌పున‌ తెలుగుదేశం అభ్య‌ర్థి యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు పోటీ చేస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో యార్ల‌గ‌డ్డ వైసీపీ అభ్యర్థిగా వంశీ చేతిలో స్వ‌ల్ప ఓట్లతో ఓడిపోయారు. వంశీ జ‌గ‌న్ శిబిరంలో చేర‌డంతో..  యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు తెలుగుదేశంలో చేరారు. తెలుగుదేశంలో చేరిన‌ నాటినుంచి నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు యార్ల‌గ‌డ్డ అందుబాటులో ఉంటూ వ‌స్తున్నారు. మొద‌టి నుంచి గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి  కంచుకోట. దీనికితోడు వంశీని ఓడించేందుకు చంద్ర‌బాబు ప‌క‌డ్బందీ వ్యూహాన్ని అమ‌లు చేశార‌ని,  దీంతో యార్ల‌గ‌డ్డ విజ‌యం న‌ల్లేరుపై బండిన‌డ‌కేన‌నిపరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ముఖ సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలో మ‌రోసారి ఇక్కడ తెలుగుదేశం విజయం ఖాయమని పేర్కొన్నాయి.  
 
గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌.  1983 త‌రువాత ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం జెండా ఎగురుతూ వ‌స్తుంది..మ‌ధ్య‌లో రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్య‌ర్థులు గెలిచిన‌ప్ప‌టికీ వారుకూడా టీడీపీ సానుభూతి ప‌రులే కావ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం గ‌న్న‌వ‌రంలో వంశీని భారీ మెజార్టీతో ఓడించాల‌ని తెలుగుదేశం శ్రేణులు, చంద్ర‌బాబు అభిమానులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. వ‌ల్ల‌భ‌నేని వంశీకి వైసీపీలో చేరిన త‌రువాత తెలుగుదేశం నేత‌ల‌పై నోరుపారేసుకోవ‌టం అల‌వాటుగా మారింది. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రిపై వ‌ల్ల‌భ‌నేని అభ్యంత‌ర‌క‌ర‌ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు, నారా, నంద‌మూరి కుటుంబాల అభిమానులు వంశీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలోవంశీకి మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లుసైతం వెనుక‌డుగు వేస్తుండ‌టం గ‌మ‌నార్హం. వంశీ క్యారెక్ట‌ర్ లేని వ్య‌క్తిఅని, రాజ‌కీయ భిక్షపెట్టిన చంద్ర‌బాబు నాయుడు కుటుంబంపైనే అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌కు మ‌ద్ద‌తు తెలిపితే ప్ర‌జ‌లు మ‌మ్మ‌ల్నికూడా క్ష‌మించ‌ర‌ని కొంద‌రు వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే పేర్కొటున్నారు. 

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌ వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం అభ్య‌ర్థిగా వ‌ల్ల‌భ‌నేని వంశీ విజ‌యం సాధించి వైసీపీలోకి వెళ్లిన‌ప్ప‌టికీ నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యారని ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. వైసీపీలో చేరిన త‌రువాత నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను క‌నీసం ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవ‌ని ప‌లువురు వైసీపీ నేత‌లే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. దీంతో ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లిన వంశీని ప‌లువురు స‌మ‌స్య‌ల‌పై నిల‌దీస్తున్నారు.   ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీ, కాపు సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌. ఎవ‌రు విజ‌యం సాధించాల‌న్నా ఈ రెండు సామాజిక వ‌ర్గాల ఓట్లు కీల‌కం. తెలుగుదేశం, జ‌న‌సేన క‌లిసి పోటీచేస్తుండ‌టంతో  మెజారిటీ కాపుసామాజిక వర్గ ఓటర్లు తెలుగుదేశం అభ్యర్థి  యార్ల‌గ‌డ్డ‌కు మ‌ద్ద‌తు నిలుస్తున్నారు. ఎస్సీలు అధిక‌శాతం తెలుగుదేశంకు మద్దతుగా ఉన్నారు. అలాగే బీసీలు సైతం కూటమికే జై కొడుతున్నారు.   క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు వంశీపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. చంద్ర‌బాబు కుటుంబంపై వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వంశీకి ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టి గుణ‌పాఠం చెప్పేందుకు వారంతా ఏక‌తాటిపైకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. 
 
సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ కు ముందు కొంత‌కాలంగా వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజ‌కీయాల్లో యాక్టివ్ గా లేరు. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విడ‌త‌ల వారిగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. చివ‌రి వ‌ర‌కు వ‌ల్ల‌భ‌నేని వంశీకి అవ‌కాశం ద‌క్క‌లేదు. వైసీపీ నుంచి పోటీచేస్తే ఓడిపోతాన‌ని భావించిన వంశీ.. తాను ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉంటాన‌ని జ‌గ‌న్ కు చెప్పిన‌ట్లు అప్పట్లో ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే  జ‌గ‌న్ ప్రోద్బ‌లంతో పోటీకి ఒప్పుకోవ‌టంతో చివ‌రి విడ‌త‌లో గ‌న్న‌వ‌రం అభ్య‌ర్థిగా వంశీ పేరును వైసీపీ అధిష్టానం ప్ర‌క‌టించింది.  వారంరోజుల క్రితం జ‌గ‌న్ బ‌స్సు యాత్ర  గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో సాగింది. అయితే , బ‌స్సు యాత్ర‌లో ఆశించిన స్థాయిలో ప్ర‌జ‌లు పాల్గొన‌లేద‌ని నియోజ‌క‌వ‌ర్గం పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో చ‌ర్చ జ‌రుగుతున్నది.   రాజ‌కీయ బిక్ష‌పెట్టిన  చంద్ర‌బాబు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై వ‌ల్ల‌భ‌నేని వంశీ చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు ఆగ్ర‌హంతో ఉన్నారు. దీంతో వ‌ల్ల‌భ‌నేని వంశీకి ఓటు ద్వారా గుణ‌పాఠం చెప్పేందుకు ప్ర‌జ‌లంతా సిద్ధ‌మైన‌ట్లు ఉమ్మ‌డి కృష్ణా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. మొత్తానికి ఎటుచూసినా ఈద‌ఫా ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అభ్య‌ర్థి వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓట‌మి ఖాయ‌మ‌ని ప్ర‌ముఖ‌ స‌ర్వే సంస్థ‌లు సైతం తేల్చాయి.

By
en-us Political News

  
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనాచౌదరి విజయం సునాయాసమేనని తెలుగుదేశం కూటమి శ్రేణులు విశ్వాసంతో ఉన్నాయి. సుజనా చౌదరి విజయం కోసం కూటమి భాగస్వామ్యపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి పని చేస్తున్నాయి.
తెలంగాణలో ఎండలు చండప్రచండంగా ఉన్నాయి. ఉదయం ఏడున్నర గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగానే నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (మే2) శ్రీవారిని మొత్తం 65వేల 313 మంది దర్శించుకున్నారు.
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.