బొజ్జ గ‌ణ‌ప‌య్య పూజ‌కు వేళాయె!

Publish Date:Sep 6, 2024

Advertisement

గణపతి నవరాత్రి వేడుకలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌జ‌లు సిద్ధ‌మ‌య్యారు. ప‌ట్ట‌ణం, ప‌ల్లెల్లో వాడ‌వాడ‌లా గ‌ణ‌నాథుడి మండ‌పాలు ఏర్పాటు చేశారు.  సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడు భక్తుల నుంచి పూజలందుకోనున్నాడు. ప్ర‌తీ సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. తొమ్మిది నుంచి ప‌ద‌కొండు రోజుల పాటు గ‌ణేశ్ ఉత్స‌వాలు కొన‌సాగ‌నున్నాయి. ఆది దంపతుల(శివ, పార్వతులు) మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. 

వినాయ‌క చ‌వితి హిందువుల‌కు తొలి పండుగ‌. భాద్ర‌ప‌ద శుద్ధ చ‌వితి రోజే గ‌ణ‌నాథుడు పుట్టాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. గ‌ణేషుడి ఆవిర్భావ గాథ‌లు పురాణాల్లో ర‌క‌ర‌కాలుగా చెప్ప‌బ‌డ్డాయి. శివ పురాణం ప్ర‌కారం.. ఒక‌సారి పార్వ‌తీదేవి స్నానం చేయ‌డానికి శ‌రీరానికి న‌లుగు పండిని రాసుకుంది. మిగిలిన న‌లుగు పండిని ఓ బొమ్మ‌ను త‌యారు చేసి దాని ప్రాణం పోసింది. అత‌నిని ద్వారం ద‌గ్గ‌ర కాప‌లాగా పెట్టింది. శివుడు లోప‌లికి వెళ్తుండ‌గా ద్వారం ద‌గ్గ‌ర బాలుడు అడ్డుకున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య యుద్ధం జ‌రిగింది. ఆగ్ర‌హంతో శివుడు ఆ బాలుడి త‌ల‌ను త్రిశూలంతో న‌రికివేశాడు. త‌ల తెగిప‌డి ఉన్న బాలుడిని చూసి పార్వ‌తీ దేవి క‌న్నీరుమున్నీరైంది. పార్వ‌తీదేవి బాధ‌ను చూడ‌లేకపోయిన శివుడు.. ఒక ఏనుగు త‌ల‌ను తీసుకొచ్చి అతికించి ప్రాణం పోశాడు. అత‌నికి గ‌జాన‌ణుడు అని పేరు పెట్టాడు. త‌న కార‌ణంగా ఆ బాలుడు వికార రూపాన్ని పొందాడ‌ని గ‌జాన‌నుడికి తొలిపూజ అందుకునేలా శివుడు వ‌ర‌మిచ్చాడు. దీంతో ప్ర‌తీయేడాది భాద్ర‌ప‌ద మాసంలో తొలి పూజ‌ను గ‌ణేశుడు అందుకుంటున్నాడు. 

తెలుగు రాష్ట్రాల్లో ఖైర‌తాబాద్ గ‌ణ‌నాథుడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ప్ర‌తీయేటా ఇక్క‌డ గ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ప్ర‌తీ ఏడాది ఒక ప్ర‌త్యేక అవ‌తారంలో ద‌ర్శ‌న‌మిచ్చే గ‌ణ‌నాథుడు.. ఈసారి 70 అడుగుల ఎత్తుతో శ్రీ స‌ప్త‌ముఖ మ‌హాశ‌క్తి గ‌ణ‌ప‌తిగా భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. గ‌ణ‌నాథుడి ఉత్స‌వాలు ఒక్క భారతదేశంలోనే కాదు.. విదేశాల్లో సైతం జ‌రుపుకుంటారు. ఇంకా చెప్పాలంటే.. ముస్లిం దేశాల్లో కూడా జ‌రుపుకుంటారు. జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలతోపాటు ముస్లింలు అత్యధిక సంఖ్యలోనున్న ఇండోనేషియాలోసైతం గణపతి పూజలందుకుంటున్నారు. 270 మిలియన్ల జనాభా కలిగిన ఆ దేశంలో 87 శాతం మంది ముస్లింలే. వారంతా విఘ్నేశ్వరుడిని పూజిస్తారు.

ఇక భారత దేశంలో బహిరంగంగా ఒక సామాజిక ఉత్సవంగా వినాయక చవితి నవరాత్రులను నిర్వహించడం అన్నది మాత్రం స్వాతంత్ర్యోద్యమ సమయంలో భారతీయుల ఐక్యతా చిహ్నంగా నిర్వహించడం ఆరంభమైంది. ఇందుకు స్వాతంత్ర్యం నా జన్మ హక్కు అని నినదించిన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కారణం. 1894లో మహారాష్ట్ర పుణె కేంద్రంగా సర్వ జనైఖ్య గణేశ్ ఉత్సవాలకు ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక సామాజిక ఉద్యమంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. అలా మొదలైన గణేష్ చతుర్ధి ఉత్సవాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 

By
en-us Political News

  
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఓ యువతి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై కేసు నమోదైంది. అంతే వెంటనే ఆయనను జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
చైనా దేశ ఫైనాన్షియల్ క్యాపిటల్ నగరం షాంఘైను భారీ తుఫాను బెబింకా టైఫూన్ బెంబేలెల్తిస్తోంది. గత 70 సంవత్సరాలతో పోలిస్తే ఇదే అతి పెద్ద తుఫాను అని చైనా వాతావరణ శాఖ చెబుతోంది.
 తెలంగాణ సచివాలయం దగ్గర మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గాంధీ కుటుంబం దేశానికి చేసిన త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు.
లక్ష్మీపార్వతి అలిగారు.. బుంగమూతి పెట్టుకున్నారు. జగన్ తనను చిన్నచూపు చూస్తున్నారని హర్టయ్యారు.
వైసీపీలో మంచి వాగ్ధాటి ఉన్న నాయకులలో మాజీ మంత్రి బుగ్గన ముందు వరుసలో ఉంటారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అంటే జగన్ అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా బుగ్గన పీఏపీ చైర్మన్ గా వ్యవహరించారు.
పని చేయాలన్న చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉండాలే కానీ.. ప్రభుత్వాలు అద్భుతాలు చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రుజువు చేస్తున్నది.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ జెండా పీకేయడానికి రెడీ అయిపోయారా? వైసీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడం ఇక లాంఛనమేనా? అన్న అనుమానాలు గత కొంత కాలంగా రాజకీయ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్నాయి.
అధికారులు అధికారంలో ఉన్న వారితో అంటకాగి.. వారి కోసం అడ్డగోలు పనులు చేస్తే పర్యవసానం అనుభవించక తప్పదని పలు మార్లు రుజువైంది. తాజాగా కాదంబరి జత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ కూడా ఆ అధికారులు నిబంధనలను పట్టించుకోకుండా ఏలిన వారి కళ్లల్లో ఆనందం చూడడమే తమ జన్మకు సార్థకత అన్నట్లు ప్రవర్తించిన కారణంగానే ఇప్పుడు సస్పెన్షన్ కు గురయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని   ప్రముఖ సినీ నటుడు చిరంజీవి సోమవారం కలిసారు. సిఎంరిలీఫ్ పండ్ కు 50 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
ప్రముఖ కొరియాగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచారం కేసు నమోదైంది.   తమను లైంగికంగా వేధిస్తున్నాడని జూనియర్ డ్యాన్సర్(21) ఒకరు  పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఢీషో ద్వారా టాలివుడ్ లో అడుగుపెట్టటిన  కొరియాగ్రాఫర్ అనతి కాలంలో మంచి గుర్తింపు పొందారు అగ్రహీరోలకు కొరియాగ్రాఫర్ గా పని చేశాడు.
గణేష్ ఉత్సవాలను వేడుకగా నిర్వహించిన అనంతరం గణేషుడి లడ్డూ వేలం వేయడం అన్నది ఆనవాయితీగా వస్తున్నది. కమ్యూనిటీలలోనూ, వీధులలోనూ, వాడవాడలా గణేష మంటపాలు ఏర్పాటు చేసి గణేష్ చతుర్ది నుంచి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన తరువాత గణేష నిమజ్జనం జరుగుతుంది. ఆ నిమజ్జనానికి ముందు మండపాలలో గణేషుని లడ్డూ వేలం వేయడం అన్నది ఆనవాయితీ.
ఈనెల 20వ తేదీతో వంద రోజులు పూర్తవుతుంది. ఈ వందరోజుల పాటు ఏయే ఎమ్మెల్యే ఎలాంటి పనితీరు కనబరిచారు అనే అంశం మీద వారి దగ్గర్నుంచే చంద్రబాబు సమాచారం తీసుకుని, రివ్యూ చేయబోతున్నారు.
కొంతమంది మోసపోవడానికే పుడతారు. పెద్దగా చదువుకోనివారి కంటే, బాగా చదువుకుంటున్నాం... బోలెడంత సంపాదిస్తున్నాం... మోడ్రన్‌గా జీవిస్తున్నాం అంటూ బిల్డప్ ఇచ్చేవారే గోతిలో పడుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.