Publish Date:Mar 18, 2024
గాజువాక నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జోష్ కనిపిస్తున్నది. ఎప్పుడైతే జనసేనాని పవన్ కల్యాణ్ గాజువాక నుంచి పోటీ చేయరని తేలిపోయిందో.. ఆ క్షణం నుంచీ తెలుగుదేశం పార్టీ గాజువాక సీటును తమ ఖాతాలో వేసేసుకుంది. కచ్చితంగా గెలిచే స్థానాలలో గాజువాక మొదటి వరుసలో ఉంటుందని తెలుగుదేశం శ్రేణులు ఢంకా బజాయించి చెబుతున్నాయి.
2019 ఎన్నికలలో ఈ స్థానం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన పల్లా శ్రీనివాసరావు, గత ఐదేళ్లుగా నియోజకవర్గ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ నియోజకవర్గ ప్రజల తలలో నాలుకగా మారారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా పార్టీ క్యాడర్ కు అండగా నిలిచారు. నియోజకవర్గ సమస్యలపైనే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలకు వ్యతిరేకంగా క్రియాశీలంగా వ్యవహరించారు. ఆందోళనా కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. దీంతో నియోజకవర్గ ప్రజలలో ఆయన పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గ సమస్యలపై పల్లా శ్రీనివాసరావు పోరాటాలు, నియోజకవర్గ ప్రజలకు ఆయన అండగా నిలిచిన తీరు ప్రజలలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన గళమెత్తిన తీరు నియోజకవర్గ ఓటర్లకు ఆయనను దగ్గర చేసింది. మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆయన తిరుగులేని నేతగా మారారు.
అందుకు భిన్నంగా అధికార పార్టీ వైసీపీ గాజువాకలో తీవ్ర విభేదాలు ఉన్నాయి. అంతర్గత విభేదాల కారణంగా వైసీపీలో గ్రూపుల పోరు తీవ్రస్థాయిలో ఉంది. మరీ ముఖ్యంగా నియోజవకర్గం నుంచి వైసీపీ అభ్యర్థి విషయంలో పలు మార్పులు, చేర్పులూ జరిగాయి. అలా జరిగిన ప్రతి సారీ పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పీక్స్ కి వెళ్లింది. తొలుత గాజువాక వైసీపీ అభ్యర్థిగా వి. రామచంద్రరావు అలియాస్ చందును జగన్ నిర్ణయించారు. ఆయన అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా నియోజకవర్గ వైసీపీలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైంది. అసంతృప్తులను బుజ్జగించుకుని చందు నియోజకవర్గంతో తన ప్రచారం ప్రారంభించారో లేదో అంతలోనూ చందూను కాదని జగన్ మంత్రి అమర్నాథ్ ను అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే మంత్రి అమర్నాథ్ అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కీలక నేతలు అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అమర్నాథ్ కు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో గాజువాక నుంచి అమర్నాథ్ విజయం నల్లేరు మీద బండి నడక ఎంత మాత్రం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో గాజువాక నుంచి తెలుగుదేశం విజయం పక్కా అని విశ్లేషిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం ఎలా అయితే చంద్రబాబుకు కంచుకోటగా ఉందో గాజువాక కూడా అలాగే తెలుగుదేశం కంచుకోట అని పార్టీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gajuwaka-not-easy-to-minister-gudiwada-amarnath-25-172317.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.