Publish Date:Sep 14, 2022
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య విభజన సమస్యలపై కేంద్రం ఈనెల 27న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శు లతో సమావేశం కానుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్భల్లా ఆధ్వర్యంలో సమావేశం జరగ నుంది. ఈ సమావేశంలో తొమ్మిది విభాగాలకు సంబంధించిన 14 అంశాలు చర్చించనున్నారు.
అయితే చర్చించాల్సిన అనేక అంశాల కంటే రాజధాని గురించిన అంశం మరింత ప్రాధాన్యత సంతరిం చుకుంటుంది. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి నిధుల గురించి చర్చించనున్నారు. జగన్ ప్రభుత్వం ముందు అమరావతి రాజధానిగా ఉంటుందన్నప్పటికీ, తర్వాత పాలనా సౌకర్యానికి మూడు రాజధానులు ఉంటాయని అన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించడం, విపక్షాలు, ప్రజలు ఆమోదిం చిన తర్వాత మరి రెండు నగరాలను రాజధానులుగా చేయనున్నట్లు, అందుకు అభ్యంతరాలు ఉండా ల్సిన అవసరం లేదని ప్రభుత్వమే ప్రచారం చేయించుకుంది.
కానీ అమరావతి రాజధానిగా చేస్తామన్నందుకు దానికి సంబంధించి భూములను ఇచ్చినవారు, రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ అభిప్రాయాన్ని కాదన్నారు. రాజధాని ఒకటే ఉండాలని, మూడు రాజధానులు ప్రకటిం చడం అర్ధరహితమని, ప్రభుత్వం తమకు తోచిన విధంగా మాటమారుస్తూండడం రాజకీయ లబ్ధిని తెలి యజేస్తందే గాని ప్రజాసంక్షేమాన్ని తెలియజేయదని ప్రజలు ఉద్యమించారు.
ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించింది. ఈ కారణంగా, రాజ ధాని నిర్మాణానికి నిధుల విషయంలో సందిగ్ధానికి అవకాశమే లేదని కేంద్రం ప్రకటించింది. ఒక రాజ ధాని నిర్మాణానికే నిధులు సమకూరుస్తామని కేంద్రం పేర్కొన్నది. జగన్ పట్టుబట్టి మూడు రాజధానుల అంశా న్ని తెరమీదకి తెచ్చి ప్రజల్ని కేంద్రాన్ని సందిగ్ధంలో పడేశారు. కానీ కేంద్రం మాత్రం మొదటి నుంచి ఆంధ్రాకు ఒకే రాజధాని ఉంటుందని, అదీ ముందుగా ప్రకటించిన అమరావతే అవుతుందని గట్టిగా వాదిస్తోంది. పైగా అమరావతిని రాజధానిగా చేయడానికే నిధులు ఏర్పాటు చేస్తామ ని కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పింది. ఈ అంశాన్నే కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వ సి.ఎస్ల సమావేశంలో స్పష్టం చేయనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/funds-for-only-one-capital-says-center-25-143720.html
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.