కేసినో అంటే ఏంటి? గ్యాంబ్లింగ్ గురించి తెలుసా? గుడివాడ‌కు ఎలా వ‌చ్చింది?

Publish Date:Jan 27, 2022

Advertisement

కెషినో.. గ్యాంబ్లింగ్ హౌస్.. ఇప్పుడు ఏపీలో మాంచి కాక రేపుతున్న వివాదం. తెలుగు ప్రజలు.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్లలో కొద్దిరోజులుగా తరచుగా వినిపిస్తున్న మాట. తెలుగు ప్రజలకు ముందెప్పుడూ ప్రత్యక్షంగా తెలియని సంస్కృతి.. ఈ కెషినో గురించే ఇంతగా చర్చల్లోకి రావడానికి ఒకే ఒక్కడు కారణం.. మహామహుల పురిటిగడ్డ గుడివాడ నడిబొడ్డున కెషినో నిర్వహించిన ఘనుడు.. అతనే బూతుల మంత్రి.. డైరెక్ట్ గా పేరు చెప్పకపోయినా ఆయనెవరో ఇప్పటికే గుర్తు వచ్చే ఉంటుంది.. సంక్రాంతి పండుగ సంబరాల నెపంతో గుడివాడలో.. తన సొంత కన్వెన్షన్ సెంటర్ లో కెసినో నిర్వహించిన ఆయనపై విపక్షాలు ఒంటికాలిపై లేస్తున్నాయి. జూదరుల స్థాయిని మరో మెట్టుకు ఎక్కించిన మంత్రిని ఆ పదవి నుంచి తప్పించాలని, ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్.

నిజానికి కెసినో సంస్కృతి మన దేశంలోని ఒక్క గోవాలో తప్ప మరెక్కడా లేదు. అందుకు విదేశీ పర్యాటకులను ఆకర్షించడం అనే కారణం కూడా గోవా విషయంలో ఉండి ఉండొచ్చు. కెసినో సంస్కృతికి పెట్టింది పేరు అగ్రరాజ్యం అమెరికాలోని లాస్ వెగాస్. ప్రతి ఏటా అక్కడ వచ్చినంత కెసినో ఆదాయం ప్రపంచంలో మరెక్కడా రాదంటే అతిశయోక్తి కాదు. అట్లాంటిక్ సిటీ, షికాగో, న్యూయార్క్ సిటీ, డెట్రాయిట్, బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, మిసిసిపీ, సెయింట్ లూయీస్, కన్సాస్ సిటీ తదితర సిటీల్లోనూ కెసినోలు నడుస్తుంటాయి. అమెరికా చరిత్ర తొలి రోజుల్లో కెసినోలు అంటే సెలూన్ లు అని మాత్రమే జనానికి తెలుసు. లాస్ వెగాస్ వచ్చిన పర్యాటకులు ఒకరినొకరు పరిచయాలు పెంచుకోడానికి, కలిసి మద్యం సేవించడానికి, కలిసి గ్యాంబ్లింగ్ ఆడేందుకు కెసినోలకు వెళ్లే సంప్రదాయం ఉండేది.

భారత దేశానికి చుట్టుపక్కల శ్రీలంక, సింగపూర్, మలేషియాల్లో కూడా కెసినోలు నడుస్తుంటాయి. బ్రిటన్ లో కూడా కెసినో సంప్రదాయం ఉంది. ఆయా దేశాలకు మన దేశం నుంచి వెళ్లే కొందరు సరదాగా కెసినోలకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. కెసినోల్లో రకారకాల గ్యాంబ్లింగ్ లకు సౌకర్యం కల్పిస్తారు నిర్వాహకులు. సాధారణంగా కెసినోలు హొటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్ లు, రిటెయిల్ షాపింగ్, క్రూయిజ్ షిప్పులు, పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో నిర్వహిస్తుంటారు. వాటిలో  గ్యాంబ్లింగ్, డ్యాన్స్ లు, కామెడీ షోలు, ఆటల పోటీలు లాంటివి అందుబాటులో ఉంటాయి. కొన్ని కొన్ని కెసినోల్లో అందమైన అమ్మాయిలు కూడా అందుబాటులో ఉంటారనే పేరు ఉంది. అందు వల్లే కాలక్రమేణా కెసినోలు వ్యభిచార గృహాలు అనే పేరు కూడా తెచ్చుకున్నాయి. అసలక్కడ ఏమి జరుగుతోందో తెలియకుండా గందరగోళానికి గురిచేసేలా పెద్ద పెద్ద శబ్దాలతో గేమ్ లు నిర్వహించే చోటును ఇప్పుడు కెసినో అంటున్నారు.

కెసినో అనే మాట ఇటలీ నుంచి వచ్చింది. కెసినో అంటే హౌస్ అని అర్థం. 19 వ శతాబ్దం నుంచి ఆహ్లాదకరమైన కార్యక్రమాలు జరిగే కొన్నిప్రాంతాల్లో కెసినోలు నిర్వహించేవారు. ఐరోపాలో మొట్టమొదటి సారిగా వెలుగు చూసిన గ్యాంబ్లింగ్ హౌస్ ను కెసినో అని పిలిచేవారు కాదు. 1638 లలో ఇటలీలోని గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ వెనిస్ లో కార్నివాల్ సమయంలో మాత్రమే కెసినోలు నిర్వహించేవారు. స్థానికులను పేదలుగా మార్చేస్తోందనే కారణంతో కెసినో సంప్రదాయాన్ని అక్కడ 1774లో నిలిపివేశారు. 20వ శతాబ్దంలో కెసినోలను అమెరికా బ్యాన్ చేసింది. అయితే.. 1931లో నెవాడా రాష్ట్రంలో కెసినోలకు మళ్లీ అనుమతి ఇచ్చింది. అమెరికాలోని న్యూజెర్సీలో 1976లో న్యాయబద్ధమైన కెసినోలు ఏర్పాటయ్యాయి. వాటిలో గ్యాంబ్లింగ్ ను అనుమతించారు. అట్లాంటిక్ సిటీ ఇప్పుడు అమెరికా మొత్తం గ్యాంబ్లింగ్ జరిగే రెండో అతి పెద్ద నగరంగా నిలుస్తోంది.

గ్యాంబ్లింగ్ హౌస్ లేదా కెసినోలోకి న్యాయబద్ధమైన ప్రవేశ అనుమతి కావాలన్నా, గ్యాంబ్లింగ్ ఆడాలన్నా కనీసం 18 నుంచి 20 ఏళ్ల వయస్సు పూర్తయి ఉండాలి. ఇదే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక నిబంధన. నిజానికి కెసినోల్లో గేమ్ లు ఆడే వారికి చక్కని బుద్ధి నైపుణ్యం ఉండాలి. కెసినోల్లో సర్వ సాధారణంగా క్రాప్స్, రౌలెట్, బకారెట్, బ్లాక్ జాక్, వీడియో పోకర్ గేమ్ లు ఉంటాయి. ఈ గేమ్ లు ఆడే వారి నుంచి కెసినో హౌస్ ‘రేక్’ పేరుతో కొంత మొత్తం కమీషన్ గా తీసుకుంటుంది. అది కాకుండా గెలిచిన వారికి వచ్చిన సొమ్ము నుంచి ‘పే అవుట్’ పేరుతో కూడా కెసినో నిర్వాహకులు వసూలు చేస్తారు. అన్ని విదేశీ కెసినోల్లో సభ్యత్వ రుసుము ఉంటుంది. ఏడాదికి కొంత మొత్తం సభ్యత్వ ఫీజు చెల్లించిన వారు కెసినోలోకి ప్రవేశించవచ్చు. గ్యాంబ్లింగ్ సహా ఇతర గేమ్ లలో పాల్గొనవచ్చు. వాటితో పాటుగా ఇతర వినోద కార్యక్రమాలు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలా కాదంటే.. ఎప్పుడైనా ఒకసారి కెసినోకు వెళ్లాలంటే కొంత మొత్తం ప్రవేశ రుసుం కట్టాల్సి ఉంటుంది.

ఇక గుడివాడ కెసినో విషయానికి వస్తే.. ఒక్కొక్కరి నుంచి 5 వేల రూపాయలు ప్రవేశ రుసుముగా నిర్వాహకులు దండుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పేకాట, రౌలెట్, చీర్ గర్ల్స్ డ్యాన్సులు, అర్ధనగ్న నృత్యాలు ఇతరత్రా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు మీడియాలో విజువల్స్ చూస్తేనే అర్థం అవుతుంది.

గుడివాడ కే.కన్వెష్షన్ లో నిర్వహించిన కేసినో కోసం కోట్లాది రూపాయల విలువైన కెసినో సామగ్రిని  రప్పించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు ఆ కోట్లాది రూపాయలను ఎవరు చెల్లించారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. మన దేశంలో అనుమతి లేని కెసినోను మంత్రి కొడాలికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో ఎలా నిర్వహించగలిగారనేది ప్రశ్న. కే. కన్వెన్షన్ లో కెసినో నిర్వహిస్తున్నట్లు పబ్లిగ్గానే ప్రచారం చేసినా.. సీఎంకు, డీజీపీకి, ఇతర అధికారులకు తెలియదంటే నమ్మాలా? అసలు అనుమతే లేని కెసినో నిర్వహించేందుకు గుడివాడలో ఎలా పర్మిషన్ వచ్చింది? అనేది పలువురి మీమాంస. లేదా అంగబలం, అర్థబలంతో.. అధికార మదంతో తామేదైనా చేయగలనని చాటేందుకు కెసినో నిర్వహించారా అనే అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

By
en-us Political News

  
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి,
బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
తెలంగాణ‌లో లోక్‌స‌భ ఎన్నిక‌ల హీట్ తార స్థాయికి చేరింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కొన‌సాగుతున్నది. పార్టీల అధిష్టానాల నుంచి బీఫారంలు అందుకున్న అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 17 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌గా.. అధికార కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు నియోజకవర్గాలలో అభ్యర్థులను ఇంకా ప్ర‌క‌టించాల్సి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.