మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు. మైనింగ్ కేసులో ఆయన మంగళవారం (ఏప్రిల్ 1) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయన డుమ్మా కొట్టారు. వాస్తవానికి పోలీసులు ఆయనకు సోమవారం (మార్చి 31) విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. ఆ తరువాత తాను ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో తన కుటుంబ సభ్యులతో ఉన్నానంటూ మాజీ మంత్రి కాకాణి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ సారి పోలీసులు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లి మంగళవారం (ఏప్రిల్ 1) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు. అయితే ఆయన హైదరాబాద్ లోని నివాసంలో కూడా అందుబాటులో లేకపోవడంతో పోలీసులు కాకాణి సమీప బంధువుకు నోటీసులు అందజేశారు. మంగళవారం విచారణకు గైర్హాజరైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఇటు నెల్లూరులో కానీ, అటు హైదరాబాద్ లో కానీ ఆయన అందుబాటులో లేకుండా అజ్ణాతంలోకి వెళ్లిపోయారని అంతా భావిస్తున్నారు. ఇలా ఉండగా అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిలు మంజూరుచేయాలని కోరుతూ ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాకాణి బెయిలు పిటిషన్ నేడో రేపో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఉండగా మాజీ మంత్రి కాకాణి తాను గురువారం నుంచి అందుబాటులో ఉంటానంటూ పోలీసులకు సమాచారం ఇచ్చారు. తాను బుధవారం (ఏప్రిల్ 2) సాయంత్రం తరువాత నెల్లూరు చేరుకుంటాననీ, గురువారం నుంచీ అందుబాటులో ఉంటాననీ, విచారణకు సహకరిస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది. మరో సారి నోటీసులు ఇస్తారా? లేక రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టినందున పరారీలో ఉన్నట్లు పరిగణించి గాలింపు చర్యలు చేపడతారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా మరో వైపు కాకాణి గిరిజనులను బెదిరించారంటూ నెల్లూరు జిల్లా పొదలకూరులో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/former-minister-kakani-abscond-for-investigation-again-39-195397.html
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.