Publish Date:Apr 15, 2025
ఐపీఎల్ లో భాగంగా మంగళవారం (ఏప్రిల్ 15) పంజాబ్ కింగ్స్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చాహల్ స్పిన్ తో మ్యాజిక్ చేశాడు. దాంతో కోల్ కతా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. ఐపీఎల్ అంటేనే బంతిపై బ్యాట్ ఆధిపత్యం.. పరుగుల వరద పారుతుంది.
Publish Date:Apr 15, 2025
తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై ఢిల్లీలో చర్చలు జరిగాయి. ఇక అప్పటి నుంచి విస్తరణ .. అదిగో, ఇదిగో అన్న ప్రచారం చక్కర్లు కొట్టింది. ఆశావహులాంతా హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.
Publish Date:Apr 15, 2025
వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్టు కనిపించిన జగన్ మళ్లీ ఆయననే అందలమెక్కిస్తున్నారు. ఇక నుంచి పార్టీకి దిశానిర్దేశం చేసే బాధ్యత సజ్జల భుజాలపై పెట్టారు మాజీ సీఎం జగన్ తాజాగా నియమించిన పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కన్వీనర్గా సజ్జలను నియమించడంతో పార్టీలో ఆయన ప్రాధాన్యతను మరింత పెరిగినట్లైంది.
Publish Date:Apr 15, 2025
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సకుటుంబ సమేతంగా ఈ నెల 16న ఢిల్లీకి వెడుతున్న చంద్రబాబు అక్కడ నుంచి విదేశీ పర్యటనకు వెడతారు.
Publish Date:Apr 15, 2025
ప్రశాంత్ కిషోర్, పీకే .. పేరు చాలు. పరిచయం అవసరం లేదు.పీకే అంటే చాలు, ఆయన ఎవరో, ఆయన ఏమిటో అందరికీ అర్థమైపోతుంది. ఎన్నికల వ్యూహకర్తగా ఆయనకు అంత మంచి గుర్తింపు వుంది.అయితే అది ఆయన గతం. ప్రస్తుతం ఆయన, వేషం మార్చారు. రాజకీయ అరంగేట్రం చేశారు. సో.. ఇప్పడు పీకే పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. జన సురాజ్ పార్టీ (జేఎస్పీ) వ్యవస్థాపక అద్యక్షుడు. ఈ సంవత్సరం చివర్లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్య భూమికను పోషించేందుకు తహతహ లాడుతున్న రాజకీయ నాయకుడు. ఈ ఎనికల్లో ఎలాగైనా కింగ్, కాదంటే కనీసం కింగ్ మేకర్ కావాలని కలలుకంటున్నారు.
Publish Date:Apr 15, 2025
విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రద్దుపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ, విశాఖపట్నంల మధ్య నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. విశాఖపట్నం, విజయవాడల మధ్య ఉదయం నడిచే రెండు విమాన సర్వీసులను రద్దు చేయడం వల్ల ప్రయాణీకులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయని గంటా శ్రీనివాసరావు అన్నారు.
Publish Date:Apr 15, 2025
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై రాజకీయ వైరంతో ప్రత్యర్థి పెట్టించిన 17 కేసులకు సర్వేపల్లి శాసన సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చట్టాన్ని గౌరవించి కోర్టుకు హాజరౌతుంటే.. వీటికి కారణంగా చెబుతున్న ఆయన ప్రత్యర్థి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నారు.
Publish Date:Apr 15, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ వేగం పెంచింది. ఓ వైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజా కసిరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతూనే, హైదరాబాద్ లోని ఆయన నివాసం కార్యాలయాలలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు, కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నది.
Publish Date:Apr 15, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిలు పిటిషన్ ను విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారు హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది.
Publish Date:Apr 15, 2025
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. 7.5 కోట్ల రూపాయల విలువైన గుర్గావ్ ల్యాండ్ స్కామ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
Publish Date:Apr 15, 2025
ఒలింపిక్స్ పతకం విజేత, ప్రముఖ వెయిట్లిఫ్టర్, తెలుగు తేజం కరణం మల్లీశ్వరి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. హర్యానాలోని యమునానగర్ లో ఈ భేటీ జరిగింది. కరణం మల్లీశ్వరితో భేటీ గురించి ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
Publish Date:Apr 15, 2025
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయూ కూటమికి బీహార్ లో షాక్ తగిలింది. ఎన్డీయే కూటమి భాగస్వామ్య పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి వైదొలగింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ అధికారికంగా ధృవీకరించారు.
Publish Date:Apr 15, 2025
ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటేన ఖరారైంది. వచ్చే నెల 2న ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి పనుల పున: ప్రారంభ శంకుస్థాపనకు ఆయన హాజరు కానున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు.