అర్ధరాత్రి మాజీ ఐపీఎస్ ఇంటి ముందు యువకుడు హల్‌చల్

Publish Date:Jan 8, 2026

Advertisement

 

హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఐపీఎస్ అధికారి వి.కే.సింగ్ నివాసం ముందు ఓ యువకుడు నానా రచ్చ రచ్చ చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. జూబ్లీహిల్స్‌లోని మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి ముందు రోడ్డు నిర్మాణ పనుల నేపథ్యంలో అధికారులు భారీ కేట్లను ఏర్పాటు చేసి రహదారిని తాత్కాలికంగా మూసి వేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి సమయంలో తర్బీజ్ అనే యువకుడు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రోడ్డు బ్లాక్ కావడంతో ఆగ్రహా నికి గురైన యువకుడు తర్బీజ్, మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ ఇంటి గేటును కొడుతూ నోటికి వచ్చినట్లు దుర్భాషలాడాడు. అంతేకాకుండా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వికేసింగ్ గేటు ముందు హల్చల్ సృష్టిస్తున్న యువకుడిని భద్రతా సిబ్బంది గమనించారు. యువకుడు లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో భద్రత సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. 

ఈ సమయంలో తర్బీజ్ మరింత దూకుడుగా ప్రవర్తిస్తూ భద్రతా సిబ్బంది వద్ద ఉన్న వెపన్ లాక్కోవడానికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అయితే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఈ క్రమంలోనే యువకుడు తర్బీజ్, “500 మందితో నీ ఇంటిపైకి వస్తా” అంటూ మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్‌ను బెదిరించాడు. 

అర్ధరాత్రి సమయంలో హడావుడి సృష్టించిన యువకుడు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ వి.కే.సింగ్ పర్సనల్ సెక్రటరీ జస్వంత్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారం భించారు. యువకుడి ప్రవర్తన, నేపథ్యం, గతంలో ఏవైనా వివాదాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

 

By
en-us Political News

  
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది.
జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది. ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా.. విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో.. గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది.
ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు.
పర్యాటక రంగాన్ని ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, రానున్న పదేళ్లలో పర్యాటకంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు. సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామనీ, పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు.
కొత్తపల్లి కూడలి వద్ద జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే రాత్రి ఒక కోడిని తెచ్చి, దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీపై చల్లారు. ఈ దృశ్యాలను వీడియో తీసి, దానికి రక్తచరిత్ర సినిమాలోని హింసాత్మక పాటను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశారు.
కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్‌ భరద్వాజ్‌పై సస్పెన్షన్ వేటు పడింది.
ప్రపంచంలోని కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్‌తో జరగనున్న 5 టీ20ల సిరీస్‌లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
యంగ్ ఇండియా స్కూల్ లో బ్రేక్‌ఫాస్ట్‌ అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాల‌ని అధికారులను సీఎం ఆదేశించారు.
మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు.
జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.