Publish Date:Apr 15, 2026
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం శ్రేణులూ, నేతలూ కూడా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో మరింత కీలక స్థానం కల్పించాలని గత ఏడాదిన్నర పైగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయాన్ని చంద్రబాబు సమక్షంలోనే కొదరు స్పష్టంగా చెప్పారు కూడా. అలాగే తెలుగుదేశం శ్రేణులైనా ఒక సమయంలో లోకేష్ కు పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలనీ, ఆయన పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించాలనీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనీ కూడా బాహాటంగానే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా కడప మహానాడుకు ముందు ఈ డిమాండ్ తెలుగు దేశం శ్రేణుల నుంచి చాలా చాలా గట్టిగా వినిపించింది. ఒక దశలో కడప మహానాడు వేదికగానే లోకేష్ ప్రమోషన్ ప్రకటన ఉంటుందని కూడా గట్టిగా వినిపించింది. అయితే కూటమి పరిమితుల కారణంగా అప్పట్లో చంద్రబాబు లోకేష్ ప్రమోషన్ విషయంపై బాహాటంగా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా మందలించారు కూడా.ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీకి తొట్ట తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ నియమితులయ్యారు.
నారా లోకేశ్ కు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారికం నియామకం జరిగింది కానీ.. ఆయన చాలా కాలంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాలుగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో లోకేష్ ముద్రను బలంగా ఉంది. ఇక పార్టీ కేడర్ తో లోకేష్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అన్నిటికీ మించి లోకేష్ యూత్ గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియామకం పార్టీ పరంగా ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందనడంలో సదేహం లేదు.
పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లోకేష్ భావనకు అనుగుణంగానే ఇప్పుడు పార్టీ కమిటీల ప్రకటన కూడా ఉంది. రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పార్టీ మరింత బలోపేతం కావడానికి, కార్యకర్తలలో మరింత జోష్ నింపడానికి దోహదపడుతుందని తెలుగుదేశం సీనియర్లు గట్టిగా చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/first-working-president-of-telugu-desam-party-25-217412.html
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.