Publish Date:Jun 28, 2022
తిరనాళ్లలో తప్పిపోయిన బిడ్డ పదేళ్ల తర్వాత అనూహ్యంగా కలవడం సినిమాల్లో, నిజ జీవితంలోనూ జరగవచ్చు. అలా జరుగుతుందా అన్నది కొందరి అనుమానం. జరిగినవి చూసినవారికి పెద్ద వింతేమీ కాదు. కానీ ఎవైన్ డేవిస్ కి మాత్రం జీవితాంతం ఆశ్చర్యకరమే! ఎందుకంటే ఎప్పుడో పది నెలల క్రితం పారేసుకున్న ఐఫోన్ హఠాత్తుగా మొన్నీ మధ్య దొరికింది. అదీ ఏ మాత్రం పాడవకుండా!
దాన్ని మిగ్యూల్ అనే వ్యక్తి నదిలో పడవలో ప్రయాణిస్తుంటే తెడ్డుకి ఐ ఫోన్ తగిలింది. దాన్ని బయటకు తీసి అసలు యజమానికి చేర్చాడు.
దీనికంటే మరీ వింతే మిటంటే, అసలా ఫోన్ యజమాని డేవిస్ ఇన్నాళ్లు ఎలా ప్రశాంతంగా వున్నాడా? అని. ఈ సంగతి విన్న నెటిజన్లు వీడెవడ్రా బాబూ! అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఐఫోన్ అనేది మూడో చేయిగా మారిపోయింది మరి! ఎందుకంటే, మిగ్యూల్ మొన్న నదిలో పడవలో తిరుగు తూంటే తెడ్డుకి ఈ ఫోన్ తగిలిందిట. దాన్ని జాగ్రత్తగా పైకి తీసేడు. అది బాగానే వుందని అనిపించింది. అందు లోకి నీళ్లు ఇంకలేదని గ్రహించాడు. ఇంటికి వెళ్లగానే దానికి ఛార్జి పెట్టి చూశాడు. అందులో చివ రగా ఉపయోగించినది ఆగస్టు 13 అని తేదీ కనపడింది. అతని ఆశ్చర్యానికి అంతేలేదు. కానీ అతను దాన్ని తను దాచుకోవాలనుకోలేదు. దాని అసలు యజమాని ఎవరా అని ఆరా తీసి మరీ అతనికి తీసికెళ్లి ఇచ్చాడు. ఇది మరీ హర్షణీయం!
తెల్లారుతూనే ఐఫోన్లో మెసేజ్లు, ఫోటోలు చూసుకుంటేనే గాని రోజు ఆరంభం కాని రోజులివి. ఐ ఫోన్ వుంటే లోకమంతా అరచేతిలో వున్నట్టే. స్నేహితులు, బంధువులు, సినిమాలు, సరదాలు, ఆటపాటలు ఒకటేమిటి యావత్ లోకమంతా ఒక్క క్లిక్ దూరంలో సందడి చేస్తాయి. ఫోన్ల కంపెనీవారికి ఎంత లాభార్జన జరుగుతోందో ఏమో గాని జనాలకు ముఖ్యంగా యువతకు మాత్రం ఐఫోన్తో బోల్డు కాలక్షేపం. చదువు, వుద్యోగాల మాట ఎలా వున్నా ఇపుడంతా ఆన్లైన్ వ్యవహారాలే గనుక ఐ ఫోన్ అనేది జీవిత భాగస్వామితో సమానంగా మారింది. ఇది భవిష్యత్తులో మరింత పిచ్చెక్కించే ఆనందం.
పది నెలల క్రితం పొరపాటున నదిలో పడిపోయిందని, అది దొరకదని ఆశలు వదులుకున్నానని డేవిస్ అన్నాడు. తర్వాత ఆ ఫోన్లోనే మిగ్యూల్తో సెల్ఫీ తీసుకుని డేవిస్ నెటిజన్లకు అసలు సమాచారం అం దించాడు. ఇలాంటివి జరగడం ఎక్కడా వినం. కానీ జరిగింది. అలాగని ఖరీదయిన ఫోన్లతో తిరిగేవారు జాగ్రత్తగానే వుండాలి. ఎందుకంటే పారేసుకున్నపుడల్లా అందరికీ మిగ్యూల్ లాంటివారు తెచ్చివ్వరు!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/find-the-lost-phone-39-138607.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.