అంతరిక్షాన్ని అన్వేషించిన అతని చూపు....

Publish Date:Feb 15, 2025

Advertisement

 



 
శాస్త్ర పరిశోధన పెద్ద పాపంలా భావించే కాలంలో ఆయన శాస్త్రీయ విప్లవంలో భాగమయ్యారు.  ఎన్ని విమర్శలు, వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ తన పరిశోధన ఆపకుండా వివిధ రంగాల్లో ఆయన చేసిన  శాస్త్రీయ పరిశీలనలు, ప్రయోగాత్మక విధానాల వల్ల, ఆయనను ఆధునిక ఖగోళ శాస్త్రపు పితామహుడు, ఆధునిక భౌతికశాస్త్ర, విజ్ఞానశాస్త్ర పితామహుడిగా  పిలుస్తారు. ఆయన శాస్త్రీయ పరిశోధనలు ప్రకృతి, విశ్వం యొక్క రహస్యాలను వెలికితీయడంలో మూలస్తంభంగా మారాయి.  ఖగోళ శాస్త్రం ఈనాడు ఇంతలా అభివృద్ధి చెందటానికి మూలమైన గెలీలియో గురించి తెలుసుకుంటే...... 

గెలీలియో గురించి....

 గెలీలియో 1564  ఫిబ్రవరి 15న, ఇటలీలోని పిసా నగరంలో జన్మించారు. ఆయన పిసా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అక్కడ మెడిసిన్ చదివి డాక్టర్ కావాలనుకున్నారు. కానీ కోర్సుని పూర్తి చేయలేదు. 1589లో ఆయన చదువును మానేశారు. ఐనాసరే  గణితశాస్త్రం పట్ల ఆసక్తితో ఆ విశ్వవిద్యాలయంలోనే గణితాన్ని బోధించారు.  ఆయన   చలనం, గురుత్వాకర్షణ  వంటి భౌతిక ఘటనలను అధ్యయనం చేయడం ప్రారంభించారు. అనేక గ్రంధాలు , ఉపన్యాసాలు, సిద్ధాంత గ్రంథాలపై పని చేశారు.  అరిస్టోటిల్‌ ఆలోచనలని  విమర్శించారు. తన ప్రయోగాలు, పరిశీలన ద్వారా  ప్రకృతిని అర్ధం చేసుకోవటంలో  కొత్త విధానాలు కనుగొన్నాడు.  కోపర్నికస్ యొక్క హీలియోసెంట్రిక్ థియరీని  సమర్థించినందుకు చర్చి విచారణ ఆయనను గృహ నిర్బంధానికి గురి చేసింది. ఈ సమయంలో, ఆయన అప్ప్లైడ్ ఫిజిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటీరీయల్ ఇంజినీరింగ్ వంటి  రంగాల్లో తన పరిశోధనను కొనసాగించారు. 

సైన్సు కోసం చేసిన కృషి......

 గెలీలియో శాస్త్రీయ పరిశోధనలు కేవలం ఒక్క రంగానికే పరిమితం కాలేదు.  చంద్రుని లక్షణాలు, శుక్రగ్రహ దశలు , గురుగ్రహపు నాలుగు ఉపగ్రహాలు,  సూర్యుని మీదున్న మచ్చలు వంటి అనేక ఖగోళ పరిశీలనల్లో విశేషానుభవం సంపాదించాడు. ఆయన ఒక గొప్ప మేధావి.  టెలిస్కోప్‌ను శాస్త్రీయ ప్రయోజనాలకు మాత్రమే గాక సైనిక ప్రయోజనాల గురించి కూడా ఉపయోగపడేలా మెరుగుపరిచారు.  గణిత గణనల కోసం కూడా ఉపయోగించారు. ఆయన డిజైన్ చేసిన టెలిస్కోప్ అప్పట్లో సైనికులు ఉపయోగించే  బాలిస్టిక్, సైనిక కంపాస్ల  ఖచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగపడింది. ఆయన 1632లో "డైలాగ్ కన్సెర్నింగ్ ది టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్”  అనే ప్రసిద్ధ గ్రంథాన్ని ప్రచురించారు.  ఈ గ్రంథంలో శాస్త్రీయ ప్రబోధం, గెలీలియో ఖగోళ పరిశీలనలు, సిద్ధాంతాలు, విశ్వం గురించిన  టాలమీ  సిద్ధాంతంపై  అరిస్టోటిల్ దృక్పథం ఏమిటనే  చర్చ కూడా ఉంటుంది. 

ఎదుర్కొన్న  విమర్శలు.....

అప్పట్లో సైన్సు అంతగా అభివృద్ధి చెందలేదు.   మూఢనమ్మకాలే తప్ప శాస్త్రీయ దృక్పధం లేని కాలం కావటంతో   గెలీలియో తన ప్రయోగాలు, పరిశీలనల వల్ల ప్రధాన వివాదాల్లో చిక్కుకుని  విమర్శలకు గురయ్యారు.  మతగ్రంధం పట్ల అతివిశ్వాసం ఉన్నవాళ్ళు,  ఆయన పరిశోధనలు, అభిప్రాయాలు చర్చి బోధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావించారు.  గెలీలియో తన టెలీస్కోప్ ద్వారా పరిశీలించిన  మొదటి శాస్త్రీయ   వివరణ అయిన  "స్టారీ మెసెంజర్”ను   పబ్లిష్ చేసిన ఐదు సంవత్సరాల తర్వాత, చర్చి ఆయనపై కఠిన చర్యలు తీసుకుంది. 1615లో రోమన్ విచారణ  ముందు హాజరుకావాల్సిందిగా పిలిచారు. హీలియోసెంట్రిక్ సిద్ధాంతాన్ని ప్రచారం చేయకూడదని  హెచ్చరించారు. కానీ 1633లో కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసినందుకు ఆయనను దోషిగా ప్రకటించి,  జీవితాంతం గృహ నిర్బంధ శిక్ష విధించారు. అలా 1642 జనవరి 8న గృహ నిర్బంధంలోనే మరణించారు.


గెలీలియో చేసిన విస్తృతమైన పరిశోధనలు ఆధునిక విజ్ఞానశాస్త్రం అభివృద్ధికి మార్గదర్శనమయ్యాయి. ఆయన సిద్ధాంతాలు, ప్రయోగాలు  సైన్సు అభివృద్ధిలో ఎంతో కీలకంగా మారాయని చెప్పటం అతిశయోక్తి కాదు. ఆయన చేసిన శాస్త్రీయ విశ్లేషణలు, పరిశోధనలు విజ్ఞానశాస్త్రంలో స్థిరంగా నిలిచిపోయాయి. ఆయన ప్రభావం ఆధునిక శాస్త్ర ప్రపంచాన్ని రూపొందించడంలో కీలకంగా మారింది.

                                        *రూపశ్రీ

By
en-us Political News

  
పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలకు సంబంధించినది. ఈ ఇద్దరిలో ఏ ఒకరి అభిప్రాయం,  ఆలోచన,  ఇష్టం లేకపోయినా మరొక వ్యక్తి కూడా జీవితాంతం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి అంటే ఆచి తూచి నిర్ణయం తీసుకోవాలని పెద్దలు చెబుతుంటారు...
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.